విమర్శంచి.. విస్మరించి!
వందల సంఖ్యలో చెరువులు నింపి.. వేల ఎకరాలకు సాగునీరు అందించే బృహత్తర పథకం ఒక్క అడుగు దూరంలో నిలిచిపోయింది. పాలకుల నిర్లక్ష్యంతో మూడేళ్లుగా పనులు ముందుకు కదలలేదు. గత
ఈనాడు డిజిటల్, అనంతపురం, న్యూస్టుడే, మడకశిర
వందల సంఖ్యలో చెరువులు నింపి.. వేల ఎకరాలకు సాగునీరు అందించే బృహత్తర పథకం ఒక్క అడుగు దూరంలో నిలిచిపోయింది. పాలకుల నిర్లక్ష్యంతో మూడేళ్లుగా పనులు ముందుకు కదలలేదు. గత ప్రభుత్వంలో పనుల్ని పరుగులు పెట్టించారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత కన్నెత్తి కూడా చూడటం లేదు. గతంలో తవ్విన కాలువ గట్లు తెగి, చెట్లు మొలిచి రూపుకోల్పోతున్నాయి. మిగిలిన చిన్నచిన్న పనుల్ని పూర్తిచేయడానికి అధికారులు ప్రతిపాదనలు పంపుతున్నా ప్రభుత్వ ఆమోదానికి నోచుకోవడం లేదు. మరోవైపు కొత్తగా బైపాస్ కాలువను నిర్మించే ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. బైపాస్ కెనాల్ ప్రతిపాదన బాగానే ఉన్నా బ్రాంచి కెనాల్కు సంబంధించి మిగిలిన పనుల్ని పూర్తి చేయకపోతే లక్ష్యం నెరవేరదు. దీనిపై ఎలా ముందుకు వెళ్తారనేది స్పష్టం కావాల్సి ఉంది.
రూ.730 కోట్ల అంచనాతో..
హంద్రీనీవా జలాలతో మడకశిర నియోజకవర్గంలోని 5 మండలాలకు సాగునీరు ఇవ్వాలనే లక్ష్యంతో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మడకశిర బ్రాంచి కాలువకు శ్రీకారం చుట్టారు. తెదేపా హయాంలో పనులు చురుగ్గా చేపట్టారు. గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి పెనుకొండ, సోమందేపల్లి, హిందూపురం, లేపాక్షి, పరిగి మండలాల మీదుగా మడకశిరకు కాలువ నిర్మించారు. మొత్తం 17 లిఫ్టుల ద్వారా నీటిని ఎత్తిపోసి మడకశిర, గుడిబండ, అమరాపురం, రొళ్ల, అగళి మండలాలకు సాగునీరు అందించేలా ప్రణాళికలు రూపొందించారు. రూ.730 కోట్ల అంచనా వ్యయంతో 170 కిలోమీటర్ల కాలువ తవ్వారు. అలాగే అగళి వరకు 30 కి.మీ. కాలువ, అమరాపురం వరకు మరో 30 కి.మీ. కాలువ కలుపుకొని మొత్తంగా 230 కిలోమీటర్ల మేర జలాలను తరలించేలా పనులు చేశారు. దీనిద్వారా మడకశిరతోపాటు ఇతర మండలాల్లోని చిన్నవి, పెద్దవి కలిపి 265 చెరువులను కృష్ణా జలాలతో నింపాలనేది ముఖ్య ఉద్దేశం.
గతంలోనే 90 శాతం పూర్తి
మడకశిర నియోజకవర్గం పరిధిలో 122 కి.మీ.ల మేర కాలువ పనుల్ని 56, 57, 58 ప్యాకేజీల్లో చేపట్టారు. తెదేపా ప్రభుత్వంలోనే 90 శాతం వరకు పనులు పూర్తయ్యాయి. కల్వర్టులు, వంతెనలు మినహా ప్రధాన కాలువ పూర్తయింది. అప్పట్లోనే మడకశిర చెరువుకు నీరు అందించారు. మిగిలిన 10 శాతం పనులు పూర్తయితే 5 మండలాల్లోని చెరువులకు నీరు చేరే అవకాశం ఉంది. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత పనులు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.
మిగిలింది వంతెనలే..
కృష్ణానది జలాలు హంద్రీనీవా ద్వారా చెరువులకు చేరాలంటే కాలువపై వంతెనలు, కల్వర్టులు మాత్రమే పూర్తికావాల్సి ఉంది. మూడు ప్యాకేజీల్లో కలిపి 280 వరకు వంతెనలు, కల్వర్టులు నిర్మించాల్సి ఉండగా.. 202 వరకు పూర్తయ్యాయి. 78 వరకు పెండింగ్లో ఉన్నాయి. వీటిని పూర్తిచేయడానికి రూ.70 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. ఇప్పటివరకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదు. 58వ ప్యాకేజీలో అగళి, అమరాపురం మండలాల్లో 65 కిలోమీటర్ల కాలువ ఉంది. దీనిపై 167 వంతెనలు నిర్మించాల్సి ఉండగా.. 121 పూర్తి చేశారు. 56వ ప్యాకేజీలో 10 వంతెనలు, 57వ ప్యాకేజీలో 22 వంతెనలు పెండింగ్లో ఉన్నాయి.
కొత్తగా బైపాస్ ప్రతిపాదన
గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి మడకశిర చివరి వరకు 160 కిలోమీటర్ల మేర ప్రధాన కాలువ నిర్మాణం జరిగింది. అంతదూరం నీరు ప్రవహించి మడకశిర చేరుకోవడానికి ఎక్కువ సమయంతోపాటు నీటి వృథా అవుతుందని అధికారులు చెబుతున్నారు. దీనికి పరిష్కారంగా మడకశిర బైపాస్ కెనాల్ను కొత్తగా తెరపైకి తీసుకొచ్చారు. బ్రాంచి కెనాల్పై 41వ కిలోమీటరు నుంచి 125వ కిలోమీటరు వరకు 37 కిలోమీటర్ల కాలువ నిర్మించాలనేది ఆలోచన. దీనివల్ల 47 కి.మీ.ల దూరం తగ్గుతుందని చెబుతున్నారు. ఈ బైపాస్ కెనాల్పై రెండు లిఫ్టులు వస్తాయి. రూ.214 కోట్ల అంచనాతో నిర్మించనున్నారు.
ఇదీ పరిస్థితి..
56వ ప్యాకేజీలో మడకశిర మండలం సి.కొడిగేపల్లి వద్ద ప్రారంభమై మనూరు, కల్లుమర్రి, హరేసముద్రం చెరువు వరకు 7 కి.మీ.ల కాలువ, అక్కడి నుంచి కదిరేపల్లి మీదుగా రాళ్లపల్లి, జంబులబండ, గుడిబండ మండలం సింగేపల్లి వరకు 31 కి.మీ.లు, అక్కడి జంక్షన్ నుంచి రెండుగా చీలిపోయి అగళి మండలంలో 32 కిలోమీటర్లు, అమరాపురం మండలంలో 32 కిలోమీటర్లు మేర కాలువ నిర్మాణం చేశారు. రొళ్ల మండలంలో 14 కిలోమీటర్ల మేర కాలువ వెళ్తుంది. 57 ప్యాకేజీలో హరేసముద్రం చెరువు నుంచి జంబలబండ సమీపంలోని సింగేపల్లి చెరువు వరకు 32 కిలోమీటర్ల మేర కాలువ నిర్మాణం సాగింది.
‘మడకశిర బ్రాంచి కెనాల్ పనులపై తెదేపా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. బ్రాంచ్ కెనాల్ కోసం రూ.250 ఖర్చు చేసి 80 శాతం పనుల్ని వైఎస్ రాజశేఖర్రెడ్డి పూర్తిచేశారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో 20 శాతం పనులు కూడా చేయలేకపోయారు. వైకాపా అధికారంలోకి రాగానే పూర్తి చేసి నీళ్లిస్తాం’.
- 2019 మార్చి 30న ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పిన మాట
ప్రతిపాదనలు పంపిస్తాం
దేశానాయక్, ఎస్ఈ, హంద్రీనీవా
మడకశిర బ్రాంచి కెనాల్కు సంబంధించి పెండింగ్లో ఉన్న వంతెనల నిర్మాణానికి గతంలో ప్రతిపాదనలు పంపాం. ప్రభుత్వం నుంచి అనుమతి రాలేదు. ఇటీవల జరిగిన సమావేశంలో కొత్తగా ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించాం. కొత్త ధరలు ఖరారైన తర్వాత పూర్తిస్థాయి అంచనాలు రూపొందిస్తాం. మడకశిరకు వేగంగా నీటిని తీసుకెళ్లాలనే ప్రతిపాదనతో బైపాస్ కెనాల్ నిర్మాణం చేపడుతున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అనంత అభివృద్ధిని గాడిలో పెడతాం
[ 29-03-2024]
ఎన్నికల యుద్ధానికి తెలుగు తమ్ముళ్లు సిద్ధమయ్యారు. సమరానికి రాప్తాడు రంకెలు వేసింది. శింగనమల సై అంటూ దూకింది. కదిరి కదం తొక్కింది. -
వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం.. దుర్గం వాసులకు కష్టం
[ 29-03-2024]
వైకాపా ప్రభుత్వం 50 శాతం మేర తన వాటా నిధులను మంజూరు చేయకపోవటంతో రాయదుర్గం పట్టణంలోని రెండు రైల్వే వంతెనల అనుసంధాన రహదారుల పనులు ఆగిపోయాయి. -
కాలుతున్న కడుపులు.. ఏవీ ఉపాధి బిల్లులు?
[ 29-03-2024]
వారంతా దినసరి కూలీలు. రోజు పని చేస్తే తప్ప కుటుంబాలను పోషించుకోలేని స్థితి. పొట్టకూటి కోసం ఎండలో ఎండుతూ పనులు చేస్తున్నారు. -
ధరల బోర్డులు తెచ్చారు.. మూలన పడేశారు
[ 29-03-2024]
పట్టణంలోని దినసరి, వారపు సంత, జంతు వధశాలలో గుత్తేదారుల దోపిడీని అరికట్టేందుకు ఆయా మార్కెట్లలో కౌన్సిల్ సూచన మేరకు రెవెన్యూ ఉద్యోగులు ధరల బోర్డులను తయారు చేయించి తెచ్చారు. -
ఐదుగురు కుమార్తెలతో తల్లి బలవన్మరణానికి యత్నం
[ 29-03-2024]
భర్త గోపాల్ వేధింపులు, ఆర్థిక సమస్యలతో అనిత అనే గృహిణి తన ఐదుగురు కుమార్తెలకు విషం తాగించి, తానూ బలవన్మరణానికి ప్రయత్నించింది. -
అప్పుల వేధింపులు తాళలేక భార్యాభర్తలు, కుమారుడి ఆత్మహత్యాయత్నం
[ 29-03-2024]
అప్పు ఇచ్చిన వ్యక్తి వేధింపులు తాళలేక భార్యాభర్తలు, కుమారుడు పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఇది. -
33 శాఖల ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ అవకాశం
[ 29-03-2024]
త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు ఉపయోగించుకోడానికి 33 శాఖల పరిధిలోని ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించిందని డీఆర్వో రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. -
డబ్బు కోసమే చికెన్ వ్యాపారి కిడ్నాప్
[ 29-03-2024]
కొత్తచెరువులో చికెన్ సెంటర్ యజమాని ఉప్పు వెంకటాచలపతిని కిడ్నాప్ చేసిన కేసులో 8 మంది నిందితులను అరెస్టు చేసి వారి నుంచి ఒక కారు, 8 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పుట్టపర్తి డీఎస్పీ వాసుదేవన్ పేర్కొన్నారు. -
ఎన్నికల్లో పారదర్శకంగా పనిచేయాలి: ఎస్పీ
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేలా అంకితభావంతో నిష్పక్షపాతంగా, పారదర్శకంగా విధులు నిర్వహించాలని ఎస్పీ అన్బురాజన్ పేర్కొన్నారు. -
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి
[ 29-03-2024]
శ్రీసత్యసాయి జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు భాస్కర్రెడ్డి పేర్కొన్నారు. -
మరుగున మురుగు పారుదల వ్యవస్థ
[ 29-03-2024]
పురపాలకలో డ్రైనేజీ వ్యవస్థ ప్రధానమైంది. అందుకే పారిశుద్ధ్యానికి ప్రాధాన్యమిస్తూ ప్రత్యేకంగా ప్రజారోగ్య విభాగంలో కార్మికుల ఏర్పాటుతో పరిసరాల శుభ్రతను పాటిస్తారు. -
తెదేపా అధినేతకు ఘనస్వాగతం
[ 29-03-2024]
తెదేపా అధినేత చంద్రబాబు ఉమ్మడి జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా గురువారం అనంతపురం గ్రామీణం ప్రసన్నాయపల్లి హెలీప్యాడ్ వద్ద అనంతపురం -
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని..
[ 29-03-2024]
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను భార్య ప్రియుడితో కలిసి హతమార్చింది. కర్నూలు జిల్లా దేవనకొండ -
కొత్త వేరుసెనగ వంగడాల పంపిణీకి చర్యలు
[ 29-03-2024]
వచ్చే ఖరీఫ్ సీజన్కు వర్షాభావ పరిస్థితులను తట్టుకునే వేరుసెనగ కొత్త వంగడాలను సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి ఉమామహేశ్వరమ్మ సూచించారు.
తాజా వార్తలు (Latest News)
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
-
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ
-
ప్రేమ వివాహమే చేసుకుంటా: విజయ్ దేవరకొండ
-
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్
-
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
-
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!