తెదేపా నాయకుడిపై హెడ్కానిస్టేబుల్ దాడి
న్యాయం చేయాలని పోలీసుస్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసిన టతెదేపా నాయకుడు ఎర్రిస్వామిరెడ్డిపైనే హెడ్కానిస్టేబుల్ రఘునాథరెడ్డి దాడికి పాల్పడిన ఘటన సోమవారం కణేకల్లులో జరిగింది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు..
బాధితుడిని విచారిస్తున్న సీఐ యుగంధర్
కణేకల్లు: న్యాయం చేయాలని పోలీసుస్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసిన టతెదేపా నాయకుడు ఎర్రిస్వామిరెడ్డిపైనే హెడ్కానిస్టేబుల్ రఘునాథరెడ్డి దాడికి పాల్పడిన ఘటన సోమవారం కణేకల్లులో జరిగింది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు.. కణేకల్లు మండలం జక్కలవడికి గ్రామానికి చెందిన సర్పంచి శారదమ్మ భర్త వైకాపా నాయకుడు హనుమంతరెడ్డి నుంచి రూ.59 వేలు అప్పుగా ఎర్రిస్వామిరెడ్డి తీసుకున్నారు. అప్పు చెల్లించాలని ఒత్తిడి చేయగా.. ప్రస్తుతం చెల్లించలేనని, గడువు ఇవ్వాలని కోరారు. దీంతో వైకాపా నాయకుడు తెదేపా నాయకుడికి చెందిన ద్విచక్ర వాహనాన్ని తీసుకెళ్లేందుకు యత్నించడంతో అడ్డుకోగా దాడికి పాల్పడ్డారు. దీంతో బాధితుడు తన భార్య శ్రీదేవితో కలిసి స్టేసన్కు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈక్రమంలో హెడ్కానిస్టేబుల్ ఎలాంటి విచారణ చేయకుండా కొట్టారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. తాను చెప్పేది పట్టించుకోకుండా దుర్భాషలాడినట్లు వాపోయారు. చేతులెత్తి మొక్కుతున్నా హెడ్కానిస్టేబుల్ కనికరించలేదన్నారు.
హెడ్కానిస్టేబుల్ను సస్పెండ్ చేయాలి: న్యాయం కావాలంటూ పోలీసుస్టేషన్కు వెళ్లిన తెదేపా నాయకుడిపై దాడికి పాల్పడిన హెడ్కానిస్టేబుల్ రఘునాథరెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు డిమాండు చేశారు. హెడ్కానిస్టేబుల్ తీరుపై కణేకల్లు పోలీసుస్టేషన్ ఎదుట తెదేపా నాయకులతో ఆందోళన చేపట్టేందుకు అనంతపురం నుంచి వస్తున్న మాజీ మంత్రిని సీఐ యుగంధర్ కణేకల్లు క్రాసింగులో అడ్డుకున్నారు. తెదేపా నాయకుడు ఆనందరాజు ఇంటికి తీసుకెళ్లారు. అనంతరం అక్కడికి వచ్చిన బాధితుడు మాజీ మంత్రి, సీఐకి ఘటన గురించి వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏడో రోజు జోరుగా నామినేషన్లు
[ 25-04-2024]
ప్రధాన పార్టీలైన తెదేపా, కాంగ్రెస్, వైకాపా, బీఎస్పీ తదితర పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు బుధవారం జోరుగా నామినేషన్ వేశారు. -
విధేయతకు తెదేపా పట్టం
[ 25-04-2024]
అనంతపురం జిల్లా తెదేపా అధ్యక్షుడిగా జి.వెంకట శివుడు యాదవ్ నియమించారు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. -
నిర్మించలేదు.. నిర్వహణ చేతకాదు
[ 25-04-2024]
కల్లబొల్లి మాటలు చెప్పడం తప్ప జగన్ ప్రభుత్వం ఈ ఐదేళ్లలో రైతులకు ఉపయోగపడే పని ఒక్కటీ చేయలేదు. తాను నిర్మించలేదు.. -
అనంత నగరం.. పసుపుమయం
[ 25-04-2024]
అనంతపురం అర్బన్ తెదేపా అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ నామినేషన్ సందర్భంగా బుధవారం అనంతపురం అర్బన్ క్యాంపు కార్యాలయానికి ఉదయం 8 గంటలకే -
వంతెన నిర్మాణాన్ని విస్మరించిన జగన్ సర్కార్
[ 25-04-2024]
వైకాపా పాలనలో భూతద్దం పెట్టి వెతికినా అభివృద్ధి కనిపించదు. తెదేపా హయాంలో తలపెట్టిన పనుల్ని ఐదేళ్లుగా జగన్ ప్రభుత్వం పక్కనపెట్టేసింది. ఉరవకొండ మండలం కైకుంట్ల నుంచి వై.రాంపురం మార్గంలో హంద్రీనీవా -
వైకాపా అసమర్థ అభ్యర్థిని ఓడిస్తేనే అభివృద్ధి: కేశవ్
[ 25-04-2024]
ఉరవకొండ, విడపనకల్లు, వజ్రకరూరు, బెళుగుప్ప, న్యూస్టుడే: వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి అసమర్థుడని, ఆయన్ను ఈ ఎన్నికల్లో ఓడిస్తేనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యం అవుతుందని తెదేపా అభ్యర్థి, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఉద్ఘాటించారు. -
ఐదేళ్ల పాలన చూశాం.. మళ్లీ తప్పు చేయొద్దు
[ 25-04-2024]
పేరూరు డ్యాంకు నీరు తెచ్చాం, బంగారు గనులను తెరిపించి ఉద్యోగాలు కల్పించాం.. అంటూ ప్రకాశ్రెడ్డి అన్ని అబద్ధాలే చెబుతారని మాజీ మంత్రి పరిటాల సునీత ధ్వజమెత్తారు. -
రాయదుర్గం సర్వతోముఖాభివృద్ధికి కృషి : కాలవ
[ 25-04-2024]
రాయదుర్గం సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తానని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కాలవ శ్రీనివాసులు అన్నారు. బుధవారం మధ్యాహ్నం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. -
పెద్దారెడ్డి నామినేషన్.. అంతా పరేషాన్
[ 25-04-2024]
తాడిపత్రి వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి బుధవారం నామినేషన్ వేసేందుకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ప్రధాన రహదారి సీబీ రోడ్డును రెండువైపులా బ్లాక్ చేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. -
ఏడో రోజు 54 నామినేషన్ల దాఖలు
[ 25-04-2024]
జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఏడో రోజు హిందూపురం పార్లమెంటు స్థానానికి ఏడు, ఏడు అసెంబ్లీ స్థానాలకు 47 మొత్తం 54 నామినేషన్లు దాఖలు చేశారు. -
కొండలు కరిగించి.. నిధులు కొల్లగొట్టి
[ 25-04-2024]
అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైకాపా నాయకులు మట్టి వ్యాపారుల అవతారమెత్తి కొండలను కరిగించేశారు. కదిరి ప్రాంతంలోని -
నీరు కుప్పం వెళ్లింది.. చెరువు ఎండింది
[ 25-04-2024]
వైకాపా ప్రభుత్వం హంద్రీనీవా జలాలను కుప్పం తీసుకెళ్లడం ఫలితంగా ముదిగుబ్బ మండలంలోని దొరిగల్లు చెరువు ఎండింది. ఈ చెరువు కింద ఖరీఫ్లో సుమారు 500, రబీలో 200 ఎకరాల వరకు ఆయకట్టు సాగవుతోంది. -
పేరుకే పెద్దాసుపత్రి... ఓపీ సేవలు నామమాత్రం
[ 25-04-2024]
ఉరవకొండ 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీ సేవలు నామమాత్రంగా అందుతున్నాయి. దాంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ