విద్యకు పేదరికం అడ్డు కారాదు
విద్యకు పేదరికం ఏ మాత్రం అడ్డు కాకూడదనేదే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ బసంత్కుమార్ పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శ్రీసత్యసాయి జిల్లాలో అమ్మఒడి పథకం ద్వారా
నమూనా చెక్కును అందిస్తున్న ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి, కలెక్టర్ బసంత్కుమార్
పుట్టపర్తి, న్యూస్టుడే : విద్యకు పేదరికం ఏ మాత్రం అడ్డు కాకూడదనేదే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ బసంత్కుమార్ పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శ్రీసత్యసాయి జిల్లాలో అమ్మఒడి పథకం ద్వారా మూడో ఏడాది 1,66,441 మంది విద్యార్థులకు, రూ.249.661 కోట్లు తల్లుల ఖాతాలో జమ చేసేందుకు మెగా చెక్కును జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్రెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, తల్లులకు అందజేశారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు విద్యాబోధన అందిస్తున్నట్లు తెలిపారు. నేటి పోటీ ప్రపంచంలో రాణించాలంటే, ధనం కంటే, విద్య ఎంతో అవసరమన్నారు. ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు తప్పనిసరిగా చదువు చెప్పించాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించి, ఆదర్శంగా నిలవాలని సూచించారు. విద్యా దానం అనంతమైనదని, దానం చేస్తున్నకొద్దీ విజ్ఞానం పెరుగుతుందన్నారు. ప్రతి విద్యార్థికి సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు ల్యాప్టాప్లు సెప్టెంబరులో అందిస్తామన్నారు. ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తుందని, తల్లిదండ్రులు తప్పనిసరిగా పిల్లలను పాఠశాలలకు పంపాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా అన్ని రకలా మౌలిక సదుపాయాలతో సమకూరుస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి నాగేశ్వరరావు, జిల్లా వ్యవసాయ సలహా సంఘం కమిటీ ఛైర్మన్ రమణారెడ్డి, పుడా ఛైర్మన్ లక్ష్మీనరసమ్మ, ఛైర్మన్ తుంగ ఓబుళపతి, ఎంపీపీ రమణారెడ్డి, నెడ్క్యాప్ డైరెక్టర్ మాధవరెడ్డి, మండల విద్యాధికారి వెంకటరమణానాయక్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోండి
[ 24-04-2024]
ఎన్నికల విధులకు నియామకం పొందిన ఉద్యోగ, ఉపాధ్యాయులందరూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించు కోవాలని కలెక్టర్ డాక్టర్ వినోద్కుమార్ పేర్కొన్నారు. -
ఇసుకంతైనా భయం లేదు.. దోపిడీ ఆగదు
[ 24-04-2024]
ఆస్తిని పంచుకున్నట్లు.. ప్రకృతి వనరులైన నదులు, వాగులు, వంకలను వైకాపా నాయకులు పంచేసుకున్నారు. జగన్ అండతో నదుల్ని వాటాలేసుకుని మరీ అక్రమ రవాణా కొనసాగించారు. ఉమ్మడి అనంత జిల్లాలోని పెన్నా, చిత్రావతి, వేదవతి, జయమంగళి తదితర నదుల్ని నామరూపాల్లేకుండా చేశారు. -
నమ్మండి.. జగనన్న కాలనీనే..
[ 24-04-2024]
వజ్రకరూరు మండలంలోని చాబాల, ధర్మపురి, గూళ్యపాళ్యం, కమలపాడు, పీసీప్యాపిలి గ్రామాల్లోని జగనన్న కాలనీలు ముళ్లపొదలతో నిండిపోయాయి. గడేహోతూరులో 73 ఇళ్లు, వజ్రకరూరులో 578 పట్టాలకుగాను 121, కొనకొండ్లలో 830కుపైగా పట్టాలు పంపిణీ చేస్తే 181 ఇళ్లు పూర్తయ్యాయి. -
ఒకే రోజు యాభై నామినేషన్లు
[ 24-04-2024]
జిల్లాలో పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. మంగళవారం ఒక్కరోజే అసెంబ్లీ స్థానాలకు ఏకంగా యాభై నామినేషన్లు దాఖలు కావడం విశేషం. పార్లమెంటు స్థానానికి రెండు వచ్చాయి. -
దేవుడి భూమినీ గుల్ల చేశారు
[ 24-04-2024]
జిల్లాలోని పెద్దవడుగూరుకు కూతవేటు దూరంలో ఉన్న నెలగొండరాయుడుస్వామి ఆలయానికి సంబంధించిన సర్వే సంఖ్య 777-ఎలోని 21.04 ఎకరాల ఎర్రనేల భూముల్లో వైకాపా నేతల కన్ను పడింది. -
రైల్వే స్టేషన్లలో తక్కువ ధరకే భోజనం
[ 24-04-2024]
రైలులో ప్రయాణించే ప్రయాణికులకు కొన్ని రైల్వే స్టేషన్లలో తక్కువ ధరకు భోజనాన్ని అందించే కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించామని సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ మనోజ్ తెలిపారు. -
జగన్ .. ఇంకా పరిహారం ఇవ్వలే
[ 24-04-2024]
భైరవానితిప్ప ప్రాజెక్టుకు సంబంధించి రూ.542కోట్లు వ్యయం అవుతుంది. ఇందులో తొలుత రైతుల నుంచి భూమిని సేకరిస్తేనే కాలువ పనులకు అడుగులు ముందుకు పడతాయి. 1,406 ఎకరాల భూమిని సేకరించడానికి పరిహారంగా రూ.208కోట్లు మంజూరు చేస్తున్నాను. -
ఉద్యాన రైతుల ఊపిరితీస్తున్న జగన్!
[ 24-04-2024]
రాష్ట్రంలోనే ఉమ్మడి అనంతపురం జిల్లా ఉద్యాన పంటలకు ప్రసిద్ధి. ప్రధానంగా చీనీ, దానిమ్మ సాగు ఎక్కువ. గత తెదేపా హయాంలో ఆయా పంటల సాగుకు పెద్దఎత్తున ప్రోత్సహించారు. -
విజయీభవ..
[ 24-04-2024]
ఉరవకొండ, రాప్తాడు నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించాలని తెదేపా అధినేత చంద్రబాబు సూచించారు. మంగళవారం విజయనగరం జిల్లా ఎస్.కోట పర్యటనలో ఉన్న చంద్రబాబును పయ్యావుల కేశవ్, పరిటాల సునీత కలిశారు. -
చేపా..చేపా.. నువ్వెందుకు ఈదలేదు!
[ 24-04-2024]
వైకాపా ప్రభుత్వంలో అన్నదాతలకే కాదు.. చేపల పెంపకానికీ నీటి కష్టాలు వెంటాడుతున్నాయి. గతేడాదే మత్స్య క్షేత్రాల్లో చేపల పిల్లల ఉత్పత్తి చేపట్టారు. ఇప్పటికే ప్రాజెక్టులు, చెరువుల్లో చేపల పెంపకం చేపట్టాల్సి ఉంది. -
ఉపాధి హామీ పనుల్లో అక్రమాలు
[ 24-04-2024]
దయ్యాలకుంటపల్లి గ్రామంలో ఉపాధి హామీ పనుల్లో అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. గ్రామ శివారులో గువ్వలగొండి కొండలో ఫాం పాండు పనులు చేస్తున్నారు. -
కోడ్ ఉల్లంఘిస్తున్నా.. చర్యలు సున్నా
[ 24-04-2024]
ఉద్యోగులు యథేచ్ఛగా వైకాపా ప్రచారంలో పాల్గొంటున్నా అధికారులకు కన్పించడం లేదు. కోడ్ ఉల్లంఘించే వారిపై పరిశీలించి సొంతంగా చర్యలు తీసుకోవడానికి భయపడే పరిస్థితి ఉంది. -
జగన్ పాలనలో .. ఉద్యానాలు కనుమరుగు
[ 24-04-2024]
జగన్ ప్రభుత్వంలో పట్టణవాసికి ఆహ్లాదాన్ని అందించాల్సిన ఉద్యానవనాలు ఉనికిని కోల్పోయాయి. వీటిని సంరక్షించాల్సిన పురపాలికలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. కొత్త పార్కుల ఏర్పాటును గాలికి వదిలేశారు. -
తెదేపాను గెలిపిద్దాం.. భవిష్యత్తును బాగుచేద్దాం
[ 24-04-2024]
సైకిల్ గుర్తుకు ఓటేసి తెదేపాను గెలిపిద్దాం.. భవిష్యత్తు తరాలను బాగుచేద్దామని తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని విజయనగర్ కాలనీలో మంగళలవారం ఆయన పర్యటించారు. -
ధర్మవరంలో కూటమి సందడి
[ 24-04-2024]
భాజపా ఎమ్మెల్యే అభ్యర్థి సత్యకుమార్ నామినేషన్ కార్యక్రమం మంగళవారం అట్టహాసంగా సాగింది. తెదేపా, భాజపా, జనసేన కార్యకర్తలు, నాయకులు భారీ సంఖ్యలో హాజరు కావడంతో పట్టణం కాషాయం, పసుపుమయంగా మారిపోయింది. -
కొండను తవ్వి.. వంకలు పూడ్చి
[ 24-04-2024]
వైకాపా నాయకుల అండతో కొందరు కొండలను మాయం చేస్తున్నారు. మట్టిని ఇష్టానుసారంగా తవ్వి ఆక్రమణలకు తెగబడుతున్నారు. కనగానపల్లి మండలం దాదులూరు రెవెన్యూ పంచాయతీలో ఉన్న కుర్లపల్లి గ్రామ సమీపంలో ఓ రియల్టర్ (భూ వ్యాపారస్థుడు) కొన్నేళ్ల క్రితం భూముల్ని కొనుగోలు చేశాడు. -
లేపాక్షికి యునెస్కో గుర్తింపు తెస్తాం
[ 24-04-2024]
తెదేపా ప్రభుత్వంలో పర్యాటక ఉత్సవాలను నిర్వహించి లేపాక్షి ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో మారుమోగేలా చేశామని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పేర్కొన్నారు. అటువంటి లేపాక్షిని ప్రస్తుత ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం