వర్షం వస్తే నీళ్లు కదలవు!
కళ్యాణదుర్గంలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో మురుగు రోడ్డుపైకి చేరుతోంది. వర్షపునీరు లోతట్టు ప్రాంతాల్లో రోజుల తరబడి నిల్వ ఉంటోంది. పట్టణంలోని కోటవీధి, రాచప్పబావి వీధి, బోయవీధి ప్రాంతాల నుంచి దిగువ ప్రాంతమైన జయనగర్ కాలనీ, రెవెన్యూ
సాయిబాబా గుడివద్ద ఇది పరిస్థితి..
కళ్యాణదుర్గం, న్యూస్టుడే: కళ్యాణదుర్గంలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో మురుగు రోడ్డుపైకి చేరుతోంది. వర్షపునీరు లోతట్టు ప్రాంతాల్లో రోజుల తరబడి నిల్వ ఉంటోంది. పట్టణంలోని కోటవీధి, రాచప్పబావి వీధి, బోయవీధి ప్రాంతాల నుంచి దిగువ ప్రాంతమైన జయనగర్ కాలనీ, రెవెన్యూ కాలనీ, దొడగట్టరోడ్డు ప్రాంతానికి కాలువల ద్వారా మురుగు నీళ్లు వస్తాయి. కొన్నిచోట్ల కాలువలు శిథిలావస్థకు చేరుకున్నాయి. మరికొన్ని ఛిద్రమవడంతో మురుగు సక్రమంగా సాగడంలేదు. గాంధీసర్కిల్లో కోటవీధి నుంచి వచ్చేనీళ్లు వెంకటేశ్వర థియేటర్ వెనుకవైపు నుంచి వెళ్లి జయనగర్ సమీపంలో పెద్ద కాలువలో కలవాలి. చెత్త పేరుకుపోవడం, ప్రవాహం అధికంగా ఉండటంతో గాంధీసర్కిల్లో ఉన్న మార్గబిలం నుంచి ప్రధాన రోడ్లపైకి వస్తోంది.
లోతట్టు ప్రాంతాలకు ముప్పు..
* తేలికపాటి వర్షానికే ఎస్టీ కాలనీలో పెద్దఎత్తున నీళ్లు నిలిచి చెరువును తలపిస్తోంది. వెంకటేశ్వర థియేటర్ వెనుక మురుగు కాలువ అధ్వానంగా ఉండటం, వ్యర్థాలు పేరుకుపోవడంతో వర్షపునీరు రోడ్ల మీదుగా ఎస్టీ కాలనీలో దిగువ ప్రాంతానికి చేరుతాయి. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో నీళ్లు నిలిచి ఇళ్లలోకి ప్రవేశిస్తున్నాయి. సుమారు పది రోజుల పాటు కాలనీలో దోమలు, దుర్వాసనతో జనాలు ఇబ్బంది పడుతుంటారు.
* అనంతపురం ప్రధాన రహదారిలో సాయిబాబా గుడి వద్ద పెద్ద మురుగు కాలువ ఉంది. ఊర్లో నుంచి వచ్చే నీళ్లన్నీ ఆ కాలువలోనే సుబేదారు కుంటకు చేరుతాయి. కల్వర్టు సన్నగా ఉండటం, చెత్త అడ్డుపడటంతో నీటి ప్రవాహం సాఫీగా సాగడంలేదు. వర్షానికి పెద్ద ఎత్తున చెత్త కొట్టుకురావడంతో కల్వర్టు పైనుంచి అనంతపురం రోడ్డు మీద వర్షపు నీళ్లు ప్రవహిస్తాయి. దిగువనున్న సాయిబాబా గుడి, వెనువైపు కాలనీల్లోని ఇళ్లలోకి చేరుతున్నాయి. కల్వర్టు ఆధునికీకరించి నీటి ప్రవాహం సక్రమంగా వెళ్లేలా చూడాల్సిన అవసరం ఉంది.
* ప్రధాన కాలువ ఆక్రమణకు గురి కావడంతో చిన్నదిగా మారిపోతోంది. పిచ్చిమొక్కలు ప్రవాహానికి అడ్డుగా ఉండటంతో రోడ్డుపైకి మురుగు చేరుతోంది. వర్షాలను దృష్టిలో పెట్టుకుని మున్సిపల్ అధికారులు కాలువ శుభ్రం చేయించి అడ్డంకి లేకుండా చర్యలు తీసుకోవాలి.
పట్టణం: కళ్యాణదుర్గం
వార్డులు: 24
జనాభా: 50 వేలు
డ్రైనేజీ కాలువలు: 16 కి.మీ.
కాలువలకు ప్రతిపాదనలు పెట్టాం..
14వ ఆర్థిక సంఘం కింద కాలువలకు ప్రతిపాదనలు పెట్టాం. గుత్తేదారులు ముందుకు రాకపోవడంతో నిధులు వెనక్కివెళ్లాయి. కాలువలు ఏర్పాటు చేస్తే లోతట్టు ప్రాంతాల్లోకి నీళ్లు వెళ్లే పరిస్థితి ఉండదు. 15వ ఆర్థిక సంఘంలో కొన్ని కాలువల ఏర్పాటుకు ప్రతిపాదనలు పెట్టాం. అనంతపురం రోడ్డు కల్వర్టు విషయమై ర.భ.శాఖ అధికారులే చర్యలు తీసుకోవాలి.
-వెంకటేశులు, మున్సిపల్ కమిషనర్
వారం రోజులు నిల్వ ఉంటాయి..
తేలికపాటి వర్షం వచ్చినా ఊర్లో నీళ్లు కాలనీలోకి చేరుతున్నాయి. బయటికెళ్లే దారిలేక ఖాళీ స్థలాల్లో నిలిపోతున్నాయి. వర్షం ఆగి వారం రోజులైనా అదే పరిస్థితి. దోమల వ్యాప్తి పెరిగింది.
-రామాంజినమ్మ, ఎస్టీ కాలనీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాడు-నేడు జగన్మాయ
[ 19-04-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రగతి పనులను అటకెక్కించారు. నాడు-నేడు పథకం కింద బడులను ఎంపిక చేశారే తప్ప అభివృద్ధి పనులు పూర్తి చేయడానికి తగిన నిధులు కేటాయించడం లేదు. -
నామినేషన్ల పర్వం ఆరంభం
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల సమరం ఆరంభమైంది. కీలక ఘట్టమైన నామినేషన్ల పర్వం మొదలైంది. -
తండ్రి ఆశయాన్నీ నెరవేర్చలేని జగన్: షర్మిల
[ 19-04-2024]
‘‘హంద్రీనీవా పథకాన్ని పూర్తి చేసి అనంత జిల్లా రైతులకు లక్ష ఎకరాలకు సాగు నీరివ్వాలన్నది దివంగత సీఎం వైఎస్సార్ లక్ష్యం. -
నిర్లక్ష్యపు జాడలో.. నీరెరగని కాలువలు
[ 19-04-2024]
కాలువల్లో నీరు పారినపుడే వ్యవసాయం ఆశాజనకంగా ఉంటుంది. అనంతపురం జిల్లాలో వ్యవసాయానికి కాలువలే ఆయువుపట్టు. -
నేడు బాలకృష్ణ నామినేషన్ పత్రాల దాఖలు
[ 19-04-2024]
హిందూపురం అసెంబ్లీ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే బాలకృష్ణ, ఆయన సతీమణి వసుంధరలు శుక్రవారం మధ్యాహ్నం 12.15 గంటలకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు. -
వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం.. ప్రమాదకరం
[ 19-04-2024]
ఈ నెల 16వ తేదీన ముదిగుబ్బ మండలంలోని మలకవేములక్రాస్లో మిద్దెపై ఆడుకుంటున్న ఎనిమిదేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు 11కేవీ విద్యుత్తు తీగలు తగలడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. -
విశ్రాంత ఉద్యోగుల పాలిట జగనాసురుడు
[ 19-04-2024]
సుమారు 35 ఏళ్ల పాటు సేవలు అందించిన విశ్రాంత ఉద్యోగులకు జగన్ సర్కారు పగలే చుక్కలు చూపిస్తోంది. -
జగన్ పాలనలో అన్నీ కోతలే
[ 19-04-2024]
యువతను ఆకర్షించి అధికారంలోకి వచ్చిన వైకాపా చివరకు.. ఆ వర్గానికే షాకిచ్చింది. -
నామినేషన్ల పర్వం ప్రారంభం
[ 19-04-2024]
మొదటి రోజు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా జరిగింది. కేంద్ర ఎన్నికల కమిషన్ సార్వత్రిక ఎన్నికలు నోటిఫికేషన్ విడుదల కావడంతో గురువారం నామపత్రాల ప్రక్రియ ప్రారంభమైంది. -
నేడు కణేకల్లులో చంద్రబాబు సభ
[ 19-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు శుక్రవారం అనంతపురం జిల్లా కణేకల్లుకు రానున్నారు. -
రైతులను విస్మరించిన వైకాపా ప్రభుత్వం
[ 19-04-2024]
రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వం ఐదేళ్లలో రైతులను పూర్తిగా విస్మరించిందని తెదేపా అభ్యర్థి పయ్యావుల కేశవ్ ఆరోపించారు. -
గ్రామాల అభివృద్ధికే రాజకీయాల్లోకి.. : అమిలినేని
[ 19-04-2024]
గ్రామాల అభివృద్ధి కోసమే రాజకీయాల్లోకి వచ్చానని కళ్యాణదుర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు స్పష్టం చేశారు. -
కోడ్ ఉల్లంఘించి ఫ్లెక్సీల ఏర్పాటు
[ 19-04-2024]
ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి అధికార పార్టీ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. -
గొర్రెల యజమానులతో రెవెన్యూ అధికారి డబ్బుల డిమాండ్
[ 19-04-2024]
గొర్రెల యాజమానుల నుంచి ఓ రెవెన్యూ అధికారి డబ్బులు డిమాండ్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
తాడిపత్రిలో భగ్గుమన్న భానుడు
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలోని తాడిపత్రిలో గురువారం అత్యధికంగా 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు సహదేవరెడ్డి, నారాయణస్వామి తెలిపారు.