logo

తెదేపా డాక్టర్స్‌ సెల్‌ అధ్యక్ష, కార్యదర్శుల నియామకం

తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డాక్టర్స్‌ సెల్‌ ఉమ్మడి జిల్లాలకు సంబంధించి అధ్యక్ష, కార్యదర్శులను ఎంపిక చేశారు. గుంతకల్లు నియోజకవర్గానికి చెందిన డాక్టర్‌ హిమబిందు అనంతపురం పార్లమెంటు నియోజకవర్గానికి, హిందూపురానికి డాక్ట

Published : 29 Jun 2022 05:32 IST

అనంతపురం(రాణినగర్‌), న్యూస్‌టుడే: తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డాక్టర్స్‌ సెల్‌ ఉమ్మడి జిల్లాలకు సంబంధించి అధ్యక్ష, కార్యదర్శులను ఎంపిక చేశారు. గుంతకల్లు నియోజకవర్గానికి చెందిన డాక్టర్‌ హిమబిందు అనంతపురం పార్లమెంటు నియోజకవర్గానికి, హిందూపురానికి డాక్టర్‌ ఎమ్‌.శివకుమార్‌ను అధ్యక్షులుగా నియమించారు. అనంతపురం అర్బన్‌ నియోజకవర్గానికి చెందిన డాక్టర్‌ లక్ష్మీప్రసాద్‌, పుట్టపర్తి నియోజకవర్గానికి చెందిన డాక్టర్‌ రవికుమార్‌ను ప్రధాన కార్యదర్శులుగా ఎంపిక చేశారు.

 తెదేపా డాక్టర్స్‌ సెల్‌ రాష్ట్ర కమిటీలో డాక్టర్‌ శివకుమార్‌, గుంతకల్లు నియోజకవర్గానికి చెందిన మహమ్మద్‌ రఫీని రాష్ట్ర నిర్వహణ కార్యదర్శులుగా నియమించారు.

తెదేపా ఎస్టీ సెల్‌ హిందూపురం పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడిగా పుట్టపర్తి నియోజకవర్గానికి చెందిన శ్రీరాములునాయక్‌, ప్రధాన కార్యదర్శిగా పెనుకొండ నియోజకవర్గానికి చెందిన జితేంద్రనాయక్‌ను నియమించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని