బాధ్యత మరచి.. స్థలాలు పంచి
సొంతిల్లు లేని పేదలకు స్థలాలు ఇచ్చి గృహాలు నిర్మించి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం తలచింది. అందులో భాగంగానే అర్హులను గుర్తించి జగనన్న లేఅవుట్లలో స్థలాలను పంపిణీ చేస్తోంది. అయితే నార్పలలో ఓ అధికారి బాధ్యత మరచి.. అనర్హులకు ఇష్టారాజ్యంగా భూములు పంచేస్తున్నారు..
జాబితాలో అర్హులకు దక్కని చోటు
నార్పలలో అధికారి ఇష్టారాజ్యం
నార్పల ప్రభుత్వ స్థలంలో వేసిన లేఅవుట్లు
నార్పల గ్రామీణం, న్యూస్టుడే: సొంతిల్లు లేని పేదలకు స్థలాలు ఇచ్చి గృహాలు నిర్మించి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం తలచింది. అందులో భాగంగానే అర్హులను గుర్తించి జగనన్న లేఅవుట్లలో స్థలాలను పంపిణీ చేస్తోంది. అయితే నార్పలలో ఓ అధికారి బాధ్యత మరచి.. అనర్హులకు ఇష్టారాజ్యంగా భూములు పంచేస్తున్నారు.. ఫలితంగా అర్హులైన పేదలకు అన్యాయం జరుగుతోంది. నీడలేని వారికి మాత్రమే దక్కాల్సిన స్థలాలు, నేతల సిఫారసు ఉన్నవారికే సొంతం అవుతున్నాయి. ఇప్పటికే ఒకసారి స్థలం పొంది.. ఇళ్ల నిర్మాణాలకు నిధులు అందుకున్న వారికి సైతం వైఎస్సార్ జగనన్న ఇళ్ల పట్టాలు అందుతుండటం గమనార్హం. నిబంధనల ప్రకారం గ్రామసభ నిర్వహించి స్థానికంగా నివాసం ఉన్న వారికి లాటరీ పద్ధతిలో స్థలాలు కేటాయించాలి. తాజాగా విడుదల చేసిన జాబితా పరిశీలిస్తే.. గ్రామసభ నిర్వహించకుండా.. లాటరీ తీయకుండానే స్థలాలు కేటాయించారు. సదరు అధికారి అనర్హుల వద్ద పెద్ద మొత్తంలో సొమ్ము వసూలు చేసి వాలంటీర్ల ప్రమేయం లేకుండానే అనంతపురం, ధర్మవరం, తాడిపత్రి పట్టణాల్లో నివాసం ఉండే వారిని జాబితాలో చేర్చినట్లు విమర్శలు వెల్లువెత్తాయి.
ఇతర ప్రాంతాల్లో వారికి నివాస స్థలాలు
అనంత నగరం సమీపంలోని ఎ.నారాయణపురంలో నివాసం ఉంటున్న ఓ మహిళ పేరు జాబితాలో ఉంది. ఆమె ఆధార్, రేషన్కార్డులు అక్కడే ఉన్నాయి. ప్రతి నెలా అక్కడే రేషన్ సరకులు తీసుకుంటోంది. ఆమెకు నార్పల మేజర్ పంచాయతీ పరిధిలోని జగనన్న కాలనీలో సర్వే నంబరు-197-2లో స్థలం కేటాయించారు.
ధర్మవరంలో నివాసం ఉండే ఓ మహిళ పేరున సర్వే నంబరు 94-1లో స్థలం కేటాయిస్తూ జాబితాలో చేర్చారు.
అనంతపురం అజాద్నగర్లో ఉండే మరో మహిళతోపాటు పలువురికి రెవెన్యూ అధికారులు నార్పలలోని ఇళ్ల స్థలాల జాబితాలో ప్లాట్లు కేటాయించారు.
నాలుగుసార్లు దరఖాస్తు చేశాం
నా భర్త మదార్వలి ఎలక్ట్రానిక్ మెకానిక్గా పని చేస్తారు. మేము, మా అత్త వాళ్లు గత 26 ఏళ్లుగా పాత తపాలా కార్యాలయం సమీపంలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాం. ఇంటి స్థలం కోసం మొదటి విడతలో దరఖాస్తు చేసుకుంటే రాలేదు. మళ్లీ దరఖాస్తు చేస్తే 90 రోజుల్లో ఇస్తామన్నారు. ఇప్పటికి నాలుగు సార్లు దరఖాస్తు చేసిన ఫలితం లేదు. - సాయిసింధు, నార్పల
ఎంపీటీసీ సభ్యురాలు రాజీనామా చేసినా..
నార్పల మేజర్ పంచాయతీలో ఇంటి స్థలం కోసం సుమారు 1150 మంది దరఖాస్తు చేసుకున్నారు. రెవెన్యూ అధికారులు, వాలంటీర్లు ఇంటింటికీ తిరిగి 312 మంది లబ్ధిదారులను అర్హులుగా గుర్తించారు. ఈ జాబితాలో సగం మంది ఇళ్లు ఉన్న వాళ్లకే స్థలాలు కేటాయించారు. స్థానికంగా కాకుండా అనంతపురం ఆజాద్నగర్, ఎ.నారాయణపురం, తాడిపత్రితోపాటు ఇతర ప్రాంతాల్లో నివాసం ఉండే వారిని సైతం జాబితాలో చేర్చారు. అధికార పార్టీ నాయకుల ఆశీస్సులతో అనర్హులకు నివాస స్థలాలు కేటాయిస్తూ అక్రమాలకు తెర లేపారు. డబ్బులిచ్చిన వారికి రోడ్డుకు దగ్గరగా, ఇతరులకు దూరంగా స్థలాలు కేటాయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మెల్యే చొరవ తీసుకొని అనర్హులను తొలగించి అర్హులకు స్థలాలు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని పేద ప్రజలు కోరుతున్నారు.
నిబంధనలకు పాతర
నార్పల సీపీఐ కాలనీలో ఇళ్లు ఏర్పాటు చేసుకొన్న సుమారు 110 మందికి ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి చేతుల మీదుగా గతేడాది అక్టోబరులో పొజిషన్ సర్టిఫికెట్లు మంజురు చేశారు. వీటిలోనూ అధికారులు చేతివాటం ప్రదర్శించారనే ఆరోపణలు ఉన్నాయి. నార్పల గ్రామస్థులకు కాకుండా తాడిపత్రి, పామిడి, అనంతపురం, ధర్మవరంతోపాటు నార్పల మండలంలోని పలు గ్రామాల్లో నివాసం ఉండేవారికి పట్టాలు ఇచ్చారని స్థానిక ప్రజలు ఆందోళన చేశారు. రెవెన్యూ అధికారులు అర్హులను పక్కన పెట్టి అనర్హులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తున్నారని నార్పల వైకాపా ఎంపీటీసీ-4 సభ్యురాలు భాగ్యలక్ష్మీ తన అభ్యర్థిత్వానికి, పార్టీకి రాజీనామా చేశారు. అయినా నేటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ విషయంపై తహసీల్దార్ శ్రీధర్మూర్తిని వివరణ కోరగా ఇళ్ల స్థలాల జాబితాలో అనర్హులు ఉన్నట్లు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సాగు పడిపోయింది జగన్.. సాగనంపేందుకు ‘అనంత’ సిద్ధం
[ 18-04-2024]
అనంతపురం జిల్లా అంటేనే గుర్తొచ్చేది వేరుసెనగ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా పంట పండించేది అనంత జిల్లాలోనే.. ఇక్కడి రైతులకు ప్రధాన పంట వేరుసెనగ. ఇంతటి ప్రాధాన్యం ఉన్న పంట సాగు విస్తీర్ణం ఏటా తగ్గిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. -
నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన ఘట్టం నామినేషన్ల పర్వానికి గురువారం నుంచి తెరలేవనుంది. జిల్లాలో అనంత పార్లమెంటు (లోక్సభ), 8 శాసనసభా స్థానాలకు ఏకకాలంలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. -
లీజు పేరుతో ట్రాక్టర్లు మాయం ఘరానా ముఠా అరెస్టు
[ 18-04-2024]
ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో లీజు పేరిట ట్రాక్టర్లు తీసుకెళ్లి ఇతర ప్రాంతాల్లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్న ఘరానా ముఠా కేసును ఛేదించి కీలక సభ్యులను అరెస్టు చేసినట్లు శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి వెల్లడించారు. -
తెదేపా ప్రతినిధులపై వైకాపా శ్రేణుల దాడి
[ 18-04-2024]
ఉరవకొండలో తెదేపా ప్రతినిధులపై వైకాపా శ్రేణులు దాడికి పాల్పడ్డారు. తెదేపా బూత్ కన్వీనరు నాగభూషణ, నార్పలకు చెందిన అతని మిత్రుడు సంతోశ్తో కలిసి బుధవారం సాయంత్రం డ్రైవర్స్ కాలనీలో ఓటరు జాబితా పరిశీలనకు వెళ్లారు. -
19న చంద్రబాబు ఎన్నికల ప్రచార సభ
[ 18-04-2024]
ణేకల్లులో ఈనెల 19న సాయంత్రం తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో జరిగే ఎన్నికల ప్రచార సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. -
వైద్యం చేయకుండానే రోగుల పేరిట బిల్లులు!
[ 18-04-2024]
డోన్లోని ఒక ప్రైవేట్ వైద్యశాలకు గుత్తితోపాటు సమీప గ్రామాల నుంచి కొంతమంది పేదలను తీసుకెళ్లి ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేసినట్లు బిల్లులు చేసుకోవడం వివాదాస్పదమైంది. విచారణ చేపట్టిన అధికారులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. -
ఎన్నికల వ్యయ పరిశీలకుడి రాక
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం గురువారం మొదలు కానున్న నేపథ్యంలో ఎన్నికల వ్యయ పరిశీలకుడు నితిన్ అగర్వాల్ జిల్లాకు చేరుకున్నారు. -
నేత్రపర్వం.. సీతారాముల తిరుకల్యాణోత్సవం
[ 18-04-2024]
కసాపురంలోని శ్రీనెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో శ్రీరామనవమిని పురస్కరించుకుని సీతారాముల తిరుకల్యాణోత్సవం నేత్రపర్వంగా సాగింది. -
‘చెత్త’నూ తొలగించలేని ప్రభుత్వం
[ 18-04-2024]
-
మడకశిరలో వైకాపాకు షాక్
[ 18-04-2024]
వైకాపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఈర లక్కప్ప సొంత మండలంలోనే ఆ పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు మూకుమ్మడి రాజీనామాలు చేసి గట్టి షాక్ ఇచ్చారు. -
కల్యాణ వైభోగమే..
[ 18-04-2024]
పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో జానకీరాముడి కల్యాణోత్సవం వేలాది మంది భక్తజనం నడుమ వైభవపేతంగా జరిగింది. -
కోడ్ ఉన్నా ఆర్టీసీలో గుట్టుచప్పుడు కాకుండా నియామకం!
[ 18-04-2024]
ఎన్నికల కోడ్ వచ్చి సరిగ్గా నెలరోజులు అవుతున్నా ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థలో నియామకాలు మాత్రం గుట్టుచప్పుడు కాకుండా చేసేస్తున్నారు. -
అప్పు ఇచ్చా.. తిరిగి చెల్లించండి!
[ 18-04-2024]
మొన్నటివరకు కళ్యాణదుర్గంలో అధికారం వెలగబెట్టిన మహిళా ప్రజాప్రతినిధి ఐదేళ్లపాటు ధనార్జనే ధ్యేయంగా పనిచేశారు. డబ్బుల కోసం సొంతపార్టీ నాయకుల్ని సైతం వేధించారు. -
ధర్మవరంలో కూటమి జోరు
[ 18-04-2024]
ధర్మవరంలో రాజకీయ గాలి వేగంగా మారుతోంది. మొన్నటివరకు కూటమి, వైకాపా మధ్య పోటాపోటీగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయిందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. -
నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కీలక ఘట్టం నామపత్రం స్వీకరణ గురువారం నుంచి ప్రారంభంకానుంది. శ్రీసత్యసాయి జిల్లాలోని ఆరు అసెంబ్లీ, ఒక లోక్సభ స్థానాలకు నామపత్రాల స్వీకరణ, ఎన్నికల నోటిఫికేషన్ నేడు వెలువడనుంది. -
నేడు బండారు శ్రావణిశ్రీ నామినేషన్
[ 18-04-2024]
శింగనమల అసెంబ్లీ నియోజకవర్గానికి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ గురువారం నామపత్రాలు దాఖలు చేస్తున్నట్లు ఆ పార్టీ మండల కన్వీనర్ ఆదినారాయణ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
బేబీ ఫుడ్లో చక్కెర.. వివరణ ఇచ్చిన నెస్లే ఇండియా
-
మంగళగిరిలో నారా లోకేశ్ నామినేషన్.. తెదేపా శ్రేణుల భారీ ర్యాలీ
-
రామేశ్వరం కెఫే కేసులో నిందితులను పట్టించిన తప్పుడు ఐడీ..!
-
మిమ్మల్ని నా సినిమాలోకి తీసుకున్నందుకు చింతిస్తున్నా: సీనియర్ నటుడికి సందీప్ చురకలు
-
జగన్పై రాయిదాడి కేసులో అనుమానితుడి అరెస్ట్