నిరసన గళం.. ప్రొబేషన్పై ప్రభావం
ప్రొబేషన్ డిక్లరేషన్ కోసం ఎనిమిది నెలలుగా నిరీక్షిస్తున్న గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులపై మరో పిడుగు పడింది. ప్రొబేషన్ డిక్లరేషన్ చేయాలని డిమాండు చేస్తూ ఈ ఏడాది జనవరిలో మూడు రోజులపాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సామూహిక ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలిసిందే.
సచివాలయ ఉద్యోగుల్లో ఆందోళన
నేడు ఉత్తర్వుల జారీ
జిల్లా సచివాలయం, న్యూస్టుడే
వార్డు సచివాలయం
ప్రొబేషన్ డిక్లరేషన్ కోసం ఎనిమిది నెలలుగా నిరీక్షిస్తున్న గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులపై మరో పిడుగు పడింది. ప్రొబేషన్ డిక్లరేషన్ చేయాలని డిమాండు చేస్తూ ఈ ఏడాది జనవరిలో మూడు రోజులపాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సామూహిక ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఆరు మాసాల తర్వాత ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం తెరపైకి తీసుకొస్తున్నట్లు సమాచారం. ఆందోళనలో క్రియాశీలకంగా పాల్గొన్న ఉద్యోగుల డిక్లరేషన్ను పక్కన (హోల్డ్) పెట్టాలన్న సంకేతాలు అందినట్లు చర్చ నడుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 5 ప్రకారం ఈనెల 30లోపు ప్రొబేషన్ డిక్లరేషన్ ప్రకటించాలి. ఈ మేరకు గురువారం కలెక్టర్, మున్సిపల్ ఆర్డీ, సంబంధిత శాఖల జిల్లా అధికారులు ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది.
అందరిలోనూ ఉత్కంఠ
జనవరి నెలలో జరిగిన ఆందోళనలో ఎవరెవరు పాల్గొన్నారో ప్రాథమిక జాబితా తయారు చేశారు. మొత్తంగా 130 మంది పేర్లు సేకరించారు. జాబితా కలెక్టర్, ఇతర జిల్లా అధికారులకు చేరినట్లు సమాచారం. 130 మంది ఆందోళనలో కీలకంగా పాల్గొన్నారా లేదా అన్న దానిపై సమాచారం పంపాలంటూ మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలకు పంపించినట్లు తెలిసింది. గుట్టుగా సాగుతున్న ఈ వ్యవహారం ఉద్యోగులకు తెలిసింది. జాబితాలో ఎవరి పేర్లు ఉన్నాయన్న దానిపై ఆరా తీస్తున్నారు. ప్రొబేషన్ డిక్లరేషన్ చేస్తారా లేదా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.
గుప్పెట్లో పెట్టుకోవడానికేనా?
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1207 సచివాలయాలు ఉన్నాయి. అందులో పట్టణాల్లో 311, గ్రామాల్లో 896 చొప్పున ఏర్పాటయ్యాయి. అనంత జిల్లాలో 699 గ్రామ వార్డు సచివాయాలు.. శ్రీసత్యసాయి జిల్లాలో 508 ఉన్నాయి. దాదాపు 10వేల మందికిపైగా ఉద్యోగులు పని చేస్తున్నారు. సుమారు 8 వేల మంది ప్రొబేషన్ డిక్లరేషన్కు అర్హత పొందారు. అనంత జిల్లాలోనే 4,448 మంది అర్హుల జాబితాలో ఉన్నారు. జీవో 5 ప్రకారం వేతన స్కేలును నిర్ణయించారు. 2021 అక్టోబరు నాటికే రెండేళ్లు పూర్తయింది. అప్పటి నుంచే బకాయిలతో కూడిన వేతనం ఇవ్వాలన్న డిమాండు ఉద్యోగుల్లో ఉంది. డిక్లరేషన్ తర్వాత బకాయిలు అడుగుతారేమోనన్న భయం ప్రభుత్వాన్ని వేధిస్తోంది. అందుకే ముందస్తు ఉద్యోగులను గుప్పెట్లో పెట్టుకోవడానికే జనవరిలో జరిగిన ఆందోళనను తెరపైకి తెచ్చినట్లు ప్రచారం సాగుతోంది.
అర్హులకు అవకాశం
- కేశవనాయుడు, ఓఎస్డీ
ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అర్హత పొందిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ డిక్లరేషన్ ఉత్తర్వులు జారీ చేస్తాం. ఇందుకు అన్నీ సిద్ధం చేశాం. రెండేళ్లు సర్వీసు, నిర్దేశిత పరీక్షలో ఉత్తీర్ణత పొందిన వారికి ఉత్తర్వు జారీ అవుతుంది. గురువారం ఉత్తర్వు ఇవ్వనున్నారు. ఆందోళనలో పాల్గొన్న వారికి ప్రొబేషన్పై ప్రభావం ఉంటుందన్న దానిపై మాకు సమాచారం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సాగు పడిపోయింది జగన్.. సాగనంపేందుకు ‘అనంత’ సిద్ధం
[ 18-04-2024]
అనంతపురం జిల్లా అంటేనే గుర్తొచ్చేది వేరుసెనగ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా పంట పండించేది అనంత జిల్లాలోనే.. ఇక్కడి రైతులకు ప్రధాన పంట వేరుసెనగ. ఇంతటి ప్రాధాన్యం ఉన్న పంట సాగు విస్తీర్ణం ఏటా తగ్గిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. -
నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన ఘట్టం నామినేషన్ల పర్వానికి గురువారం నుంచి తెరలేవనుంది. జిల్లాలో అనంత పార్లమెంటు (లోక్సభ), 8 శాసనసభా స్థానాలకు ఏకకాలంలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. -
లీజు పేరుతో ట్రాక్టర్లు మాయం ఘరానా ముఠా అరెస్టు
[ 18-04-2024]
ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో లీజు పేరిట ట్రాక్టర్లు తీసుకెళ్లి ఇతర ప్రాంతాల్లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్న ఘరానా ముఠా కేసును ఛేదించి కీలక సభ్యులను అరెస్టు చేసినట్లు శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి వెల్లడించారు. -
తెదేపా ప్రతినిధులపై వైకాపా శ్రేణుల దాడి
[ 18-04-2024]
ఉరవకొండలో తెదేపా ప్రతినిధులపై వైకాపా శ్రేణులు దాడికి పాల్పడ్డారు. తెదేపా బూత్ కన్వీనరు నాగభూషణ, నార్పలకు చెందిన అతని మిత్రుడు సంతోశ్తో కలిసి బుధవారం సాయంత్రం డ్రైవర్స్ కాలనీలో ఓటరు జాబితా పరిశీలనకు వెళ్లారు. -
19న చంద్రబాబు ఎన్నికల ప్రచార సభ
[ 18-04-2024]
ణేకల్లులో ఈనెల 19న సాయంత్రం తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో జరిగే ఎన్నికల ప్రచార సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. -
వైద్యం చేయకుండానే రోగుల పేరిట బిల్లులు!
[ 18-04-2024]
డోన్లోని ఒక ప్రైవేట్ వైద్యశాలకు గుత్తితోపాటు సమీప గ్రామాల నుంచి కొంతమంది పేదలను తీసుకెళ్లి ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేసినట్లు బిల్లులు చేసుకోవడం వివాదాస్పదమైంది. విచారణ చేపట్టిన అధికారులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. -
ఎన్నికల వ్యయ పరిశీలకుడి రాక
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం గురువారం మొదలు కానున్న నేపథ్యంలో ఎన్నికల వ్యయ పరిశీలకుడు నితిన్ అగర్వాల్ జిల్లాకు చేరుకున్నారు. -
నేత్రపర్వం.. సీతారాముల తిరుకల్యాణోత్సవం
[ 18-04-2024]
కసాపురంలోని శ్రీనెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో శ్రీరామనవమిని పురస్కరించుకుని సీతారాముల తిరుకల్యాణోత్సవం నేత్రపర్వంగా సాగింది. -
‘చెత్త’నూ తొలగించలేని ప్రభుత్వం
[ 18-04-2024]
-
మడకశిరలో వైకాపాకు షాక్
[ 18-04-2024]
వైకాపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఈర లక్కప్ప సొంత మండలంలోనే ఆ పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు మూకుమ్మడి రాజీనామాలు చేసి గట్టి షాక్ ఇచ్చారు. -
కల్యాణ వైభోగమే..
[ 18-04-2024]
పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో జానకీరాముడి కల్యాణోత్సవం వేలాది మంది భక్తజనం నడుమ వైభవపేతంగా జరిగింది. -
కోడ్ ఉన్నా ఆర్టీసీలో గుట్టుచప్పుడు కాకుండా నియామకం!
[ 18-04-2024]
ఎన్నికల కోడ్ వచ్చి సరిగ్గా నెలరోజులు అవుతున్నా ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థలో నియామకాలు మాత్రం గుట్టుచప్పుడు కాకుండా చేసేస్తున్నారు. -
అప్పు ఇచ్చా.. తిరిగి చెల్లించండి!
[ 18-04-2024]
మొన్నటివరకు కళ్యాణదుర్గంలో అధికారం వెలగబెట్టిన మహిళా ప్రజాప్రతినిధి ఐదేళ్లపాటు ధనార్జనే ధ్యేయంగా పనిచేశారు. డబ్బుల కోసం సొంతపార్టీ నాయకుల్ని సైతం వేధించారు. -
ధర్మవరంలో కూటమి జోరు
[ 18-04-2024]
ధర్మవరంలో రాజకీయ గాలి వేగంగా మారుతోంది. మొన్నటివరకు కూటమి, వైకాపా మధ్య పోటాపోటీగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయిందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. -
నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కీలక ఘట్టం నామపత్రం స్వీకరణ గురువారం నుంచి ప్రారంభంకానుంది. శ్రీసత్యసాయి జిల్లాలోని ఆరు అసెంబ్లీ, ఒక లోక్సభ స్థానాలకు నామపత్రాల స్వీకరణ, ఎన్నికల నోటిఫికేషన్ నేడు వెలువడనుంది. -
నేడు బండారు శ్రావణిశ్రీ నామినేషన్
[ 18-04-2024]
శింగనమల అసెంబ్లీ నియోజకవర్గానికి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ గురువారం నామపత్రాలు దాఖలు చేస్తున్నట్లు ఆ పార్టీ మండల కన్వీనర్ ఆదినారాయణ తెలిపారు.