logo

ఆటోను ఢీకొన్న వాహనం.. ఏడుగురికి గాయాలు

కళ్యాణదుర్గం- బళ్లారి ర.భ. అంతర్రాష్ట్ర రహదారిలో నాగిరెడ్డిపల్లి గ్రామ సమీపంలో బుధవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, ఆటో డ్రైవర్‌ తిప్పేస్వామి తెలిపిన వివరాల మేరకు.. కణేక

Published : 30 Jun 2022 02:43 IST

నాగిరెడ్డిపల్లి (రాయదుర్గం గ్రామీణం), న్యూస్‌టుడే: కళ్యాణదుర్గం- బళ్లారి ర.భ. అంతర్రాష్ట్ర రహదారిలో నాగిరెడ్డిపల్లి గ్రామ సమీపంలో బుధవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, ఆటో డ్రైవర్‌ తిప్పేస్వామి తెలిపిన వివరాల మేరకు.. కణేకల్లు క్రాస్‌ నుంచి కళ్యాణదుర్గానికి వెళ్లే ప్రయాణికుల ఆటో నాగిరెడ్డిపల్లి గ్రామ సమీపంలో పెద్ద మలుపులోని స్పీడు బ్రేకర్‌ వద్ద నిదానంగా వెళుతోంది. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వస్తున్న బళ్లారికి చెందిన మందుల రవాణా వాహనం ఆటోను బలంగా ఢీకొంది. దీంతో ఆటో డ్రైవర్‌, ముగ్గురు ఉపాధ్యాయులు, ప్రయాణికులతో కలిపి ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను అంబులెన్సులో కళ్యాణదుర్గం ప్రభుత్వ వైద్యశాలకు, మరికొందరిని కణేకల్లు క్రాస్‌లోని ఆర్డీటీ వైద్యశాలకు తరలించారు. ఇద్దరు మహిళలకు తీవ్రగాయాలు కాగా.. ప్రాథమిక చికిత్స అందించి అనంతపురం ప్రభుత్వ ప్రధాన వైద్యశాలకు పంపారు.

స్థానికులు, రైతులు, ప్రయాణికులు స్పందించి ఆటోలో ఇరుక్కున్న వారిని బయటకు తీసి రక్షించారు. గాయపడిన వారిలో ముగ్గురు ఉపాధ్యాయులు, బెళుగుప్ప, కళ్యాణదుర్గం పట్టణాలకు చెందినవారు ఉన్నారు. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని