విద్యుత్తు ధర్మం.. విస్మరించారు!
అధికారులు, ఉద్యోగుల నిర్లక్ష్యంతో తరచూ విద్యుత్తు ప్రమాదాలు జరుగుతున్నాయి. అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నాయి. క్షేత్రస్థాయిలో ఉపకేంద్రాలు, లైన్లు, స్తంభాలు, నియంత్రికలను పరిశీలించి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి. మరమ్మతులు
కంపచెట్లలో విద్యుత్తు తీగలు
అనంత(విద్యుత్తు), న్యూస్టుడే: అధికారులు, ఉద్యోగుల నిర్లక్ష్యంతో తరచూ విద్యుత్తు ప్రమాదాలు జరుగుతున్నాయి. అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నాయి. క్షేత్రస్థాయిలో ఉపకేంద్రాలు, లైన్లు, స్తంభాలు, నియంత్రికలను పరిశీలించి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి. మరమ్మతులు క్రమంగా చేపట్టాలి. ఆదిశగా చర్యలు తీసుకోకపోవడం వల్లే.. ప్రమాదాలు జరుగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో నాలుగేళ్లలో 537 మంది విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయారంటే.. ఆలోచించాల్సిన అవసరం ఉంది.
భవనాలకు ఆనుకుని ప్రమాదకరంగా ఇలా..
ఈ ఎత్తులో ఉండాలి
రోడ్డు క్రాసింగ్ ఉన్న చోట భూమి నుంచి 11 కేవీలైన్ 7.5మీ, 33 కేవీ 8.73, 120 కేవీ 10.10, 200 కేవీ 11, 400 కేవీ 12.5 మీటర్ల ఎత్తులో ఏర్పాటు చేయాలి. ఈ నిబంధనలు చాలా ప్రాంతాల్లో అమలు చేయడం లేదు. కిందకు తీగలు వేలాడుతున్నా సరిచేసే నాథుడే లేరు.
పర్యవేక్షణ విస్మరించారు
ఎల్టీ లైన్ను లైన్ఇన్స్పెక్టర్, 11 కేవీలైన్ను ఏఈ, 33 కేవీలైన్ను డీఈఈ మూడు నెలలకోసారి కచ్చితంగా పరిశీలించాలి. తమ దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించాలి. ఏవైనా సంఘటనలు జరిగినప్పుడు మినహా వీరిలో ఎక్కువమంది క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లటం లేదన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
దశాబ్దాల క్రితం ఏర్పాటు
* ఉమ్మడి జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ దశాబ్దం కిందట ఏర్పాటు చేసిన విద్యుత్తులైన్లు ఉన్నాయి. స్తంభాలకు ఏర్పాటు చేసిన కండక్టరు, కేబుల్కి అధిక, అల్ప విద్యుత్తు సరఫరా అయినప్పుడల్లా వీటి నాణ్యత దెబ్బతిని తెగిపడుతుంటాయి. తెగిన తీగలకే అతుకులు వేస్తూ కాలం వెళ్లదీస్తున్నారు.
* అధికారుల వివరాల ప్రకారం 812 కి.మీ. ఎల్టీ బేర్ కండక్టరు, సాధారణ ఎల్టీ కండక్టరు 6,935 కి.మీ., 11 కేవీ కండక్టరు 10,995 కి.మీ., 33 కేవీ 2,045 కి.మీ. ఉంది. వీటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయకపోవటంతో తరచూ తీగలు తెగుతున్నాయి.
* ఉమ్మడి జిల్లాలోని ఉపకేంద్రాల్లో 33కేవీ హెచ్వీవీసీబీలు 370, 11 కేవీ ఎల్వీవీసీబీలు 370 మార్చాలని సదరు అధికారులు ఉన్నతాధికారులకు నివేదించారు. వాటిపై ఎవరూ శ్రద్ధచూపడం లేదు. బ్రేకర్లు పనిచేయకపోతే ప్రమాద సమయంలో లైన్ట్రిప్ కాదు. దీంతో తెగిపడినా విద్యుత్తు నిలిచిపోదు.
ఏడాది కిందట పెద్దపప్పూరు మండలం వరదాయపల్లికి చెందిన తల్లి వెంకటలక్ష్మమ్మ, కొడుకు వెంకటస్వామి తమ పొలానికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా 11 కేవీ తీగ తెగి వారి మీదపడటంతో విద్యుదాఘాతంతో ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు.
ఏప్రిల్ 19న లత్తవరానికి చెందిన చిరంజీవి ఎద్దులబండిపై వెళుతుండగా ఎల్టీ లైన్ తెగి ఎద్దుల మీద పడింది. ఈ క్రమంలో చిరంజీవి బండిమీద నుంచి కిందకు దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు.
మే 5న ఉరవకొండ మండలం మైదారంపల్లి రహదారిపై కౌకుంట్ల గ్రామానికి చెందిన అశోక్ ద్విచక్ర వాహనంపై వెళుతుండగా 11కేవీ విద్యుత్తుతీగ కింద పడటంతో విద్యుదాఘాతానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు.
మే 5 బుక్కరాయసముద్రం మండలం కేకే అగ్రహారం గ్రామానికి చెందిన రమణమ్మ (45) ఇంటి ముందు ఉన్న చెట్టుకొమ్మలపై విద్యుత్తులైన్ తెగి పడింది. ఇంటికి విద్యుత్తు సరఫరా కావడంతో ప్రాణాలు కోల్పోయింది.
కనిపించని రక్షణ వలయాలు
రోడ్డు, రైలు క్రాసింగ్ ఉన్న ప్రాంతాల్లో విద్యుత్తులైన్లను ఏర్పాటు చేస్తే కచ్చితంగా తీగల కింద రక్షణ వలయం (సేఫ్గార్డ్)లను ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం ట్రైన్ క్రాసింగ్ల వద్ద మినహా ఎక్కడా వీటిని ఏర్పాటు చేయటం లేదు.
సిబ్బంది కొరత
విద్యుత్తుశాఖలో పెరుగుతున్న సర్వీసులకు అనుగుణంగా నియామకాలు చేపట్టడం లేదు. ఉన్న ఉద్యోగులే పనిఒత్తిడితో విధులు నిర్వహిస్తున్నారు. ఒక్కో లైన్మెన్, జేఎల్ఎంలు నాలుగు నుంచి 10గ్రామాల వరకు పర్యవేక్షిస్తుండటంతో దృష్టికి వచ్చిన ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించలేని పరిస్థితి నెలకొంది. లైన్మెన్లు 558 మందికి 55 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏఎల్ఎంలు 535కు 348 ఖాళీలు ఉన్నాయి. జేఎల్ఎంలు 449 ఉండాల్సి ఉండగా 275 ఖాళీలు ఉన్నాయి.
ప్రమాదాల నివారణకు చర్యలు
విద్యుత్తు ప్రమాదాల నివారణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. తీగలు ఎన్నేళ్లు వాడినా ఇబ్బంది ఉండదు. ఎక్కడైనా డ్యామేజ్ అయితే వాటిని వెంటనే మార్పు చేస్తాం. మాకు అందిన ఫిర్యాదులను సకాలంలోనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. గతంలో లైన్లు ఎక్కువ దూరంగా ఉండేవి ఈ క్రమంలో సేఫ్గార్డులు వేసేవాళ్లు. ప్రస్తుతం నిబంధనలకు అనుగుణంగానే దూరం ఉంటోంది. దీంతో సేఫ్గార్డులు వేయటం లేదు.
- నాగరాజు, ఎస్ఈ, విద్యుత్తుశాఖ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిర్బంధాలు.. వేధింపులు
[ 16-04-2024]
సమస్యలు తీర్చాలని అడిగితే వేధింపులకు గురి చేయడం.. హక్కుల సాధనకు ఉద్యమిస్తే నిర్బంధాలు.. అరెస్టులతో భయపెట్టడం.. ఇవన్నీ జగన్ నిరంకుశ పాలనకు నిలువెత్తు సాక్ష్యం. -
ఒక్క పరిశ్రమనైనా తెచ్చావా జగన్
[ 16-04-2024]
ఉమ్మడి అనంత జిల్లాలో జగన్ సర్కార్ దెబ్బకు పరిశ్రమలు విలవిల్లాడుతున్నాయి. నిరుద్యోగ యువతకు తీరని అన్యాయం చేశారు. -
వైకాపా కార్యకర్తల కవ్వింపు చర్యలతో ఉద్రిక్తత
[ 16-04-2024]
కొత్తచెరువు బీసీ కాలనీలో తెదేపా అభ్యర్థి ప్రచారం సందర్భంగా వైకాపా కార్యకర్తల కవ్వింపు చర్యలు కొంత ఉద్రిక్తతకు దారి తీశాయి. -
రోడ్డు ప్రమాద కేసును తప్పుదోవపట్టించిన సీఐ
[ 16-04-2024]
నిర్లక్ష్యంగా కారు నడిపి ఓ వ్యక్తి మృతికి కారణమైన కేసును సీఐ తప్పు దోవపట్టించారు. న్యాయం చేయాలని ధర్నా చేసిన బాధితులపైనే కేసులు కట్టారు. -
నామినేషన్ల పర్వానికి సంసిద్ధం: కలెక్టర్
[ 16-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వానికి సర్వం సిద్ధంగా ఉన్నాం. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలిస్తాం..అని కలెక్టర్/జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వి.వినోద్కుమార్ పేర్కొన్నారు. -
వాల్మీకుల గొంతు కోసిన జగన్: కాలవ
[ 16-04-2024]
వాల్మీకుల గొంతు కోసిన వ్యక్తి జగన్ అని, దాన్ని అడ్డుకోకుండా వాల్మీకి అయిన రంగయ్య చేతకాని వారిలా ఉండిపోయారని రాయదుర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కాలవ శ్రీనివాసులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. -
ఐదేళ్ల్లు నిద్రమత్తు ఎన్నికల వేళ కసరత్తు
[ 16-04-2024]
ఎన్నికల దగ్గరకు వస్తున్నాయని ప్రజల్లో మంచిపేరు తెచ్చుకునేందుకు నాయకులు తహతహలాడుతున్నారు. తాడిపత్రిలో ఆసుపత్రి నూతన భవనం నిర్మాణంలో ఉంది ఇంకా ఫ్లోరింగ్ పనులు సాగుతూనే ఉన్నాయి. -
అందరితో మమేకమవుతూ.. అన్ని వర్గాలకు భరోసానిస్తూ
[ 16-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో తెదేపా ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు దూసుకుపోతున్నారు. నిత్యం అంతర్గత, బహిరంగ సమావేశాలతో ఓట్ల వేటలో వేగం పెంచారు. -
తెదేపాతోనే సామాజిక న్యాయం
[ 16-04-2024]
తెదేపా ప్రజల కోసమే పనిచేస్తుందని, అన్నివర్గాల వారికి సామాజిక న్యాయం చేస్తూ అభివృద్ధికి బాటలు వేస్తుందని హిందూపురం పార్లమెంటు అభ్యర్థి బీకే పార్థసారథి పేర్కొన్నారు. -
పోలీసుల అత్యుత్సాహం
[ 16-04-2024]
హిందూపురం గ్రామీణ మండలం రాచపల్లి వద్ద జూదం ఆడుతున్నారన్న సమాచారంతో పోలీసులు సోమవారం సాయంకాలం తనిఖీకి వెళ్లారు. -
రోడ్ల నిర్మాణానికి ఐదేళ్లు సరిపోలేదా జగన్!
[ 16-04-2024]
ప్రజాస్వామ్యంలో గ్రామాభివృద్ధి నిరంతర ప్రక్రియ. వైకాపా ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత ఆ విధానం మారింది. -
బలవంతంగా వైకాపా కండువా.. అరగంటలోనే తెదేపాలోకి
[ 16-04-2024]
బొమ్మనహాళ్లో పలువురు తెదేపా నాయకులకు, వైకాపా నాయకులు బలవంతంగా కండువాలు కప్పడం విమర్శలకు తావిచ్చింది. -
గోడల మధ్య ఇరుక్కున్న బాలిక
[ 16-04-2024]
సరదాగా ఆడుకుంటూ ప్రమాదవశాత్తు రెండుగోడల మధ్య ఇరుక్కుని ఓ బాలిక తీవ్ర అవస్థలు పడింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆ అలవాట్లతో.. స్పెర్మ్ డీఎన్ఏకు ముప్పు!
-
కార్పొరేట్ ఉద్యోగం వదిలి.. ‘సివిల్స్’ టాపర్గా నిలిచి.. శ్రీవాస్తవ జర్నీ ఇదీ!
-
బ్యాలెట్ ఓటింగ్తో ఏం జరిగిందో మాకు తెలుసు: సుప్రీంకోర్టు
-
లోక్సభ ఎన్నికల వేళ.. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్
-
టీ20 ప్రపంచకప్లో మ్యాచ్ విన్నర్.. దినేశ్ కార్తిక్కు గోల్డెన్ ఛాన్స్: అంబటి రాయుడు
-
డ్వాక్రా బృందాలను ప్రభావితం చేసేలా నిర్ణయాలు వద్దు: ఈసీ