సమస్యలెదురైనా.. సాధించారు
సమస్యలు ఎదురయ్యాయని కుంగిపోలేదువారు. అందివచ్చిన అవకాశాలను అందుకుంటూనే ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి పట్టుదలతో శ్రమించారు. అనుకున్నది సాధించి.. తమ కలలు, తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చి నలుగురి నుంచి అభినందనలు అందుకుంటున్నారు.
గ్రూప్ 1 పరీక్షల్లో జిల్లావాసుల జయకేతనం
- న్యూస్టుడే బృందం
సమస్యలు ఎదురయ్యాయని కుంగిపోలేదువారు. అందివచ్చిన అవకాశాలను అందుకుంటూనే ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి పట్టుదలతో శ్రమించారు. అనుకున్నది సాధించి.. తమ కలలు, తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చి నలుగురి నుంచి అభినందనలు అందుకుంటున్నారు.
నాన్న ఆశయ సాధనే లక్ష్యం
భవానిశంకరి
అనంతపురం విద్య: కన్నతండ్రి ఆశయం కోసం సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలేసి కలెక్టర్ కావాలనే తపనతో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యారు అనంతకు చెందిన భవానిశంకరి. నగరంలోని అనంత టౌన్షిప్లో నివాసముంటున్న వెంకటబాలజీ, సావిత్రి దంపతుల కుమార్తె భవానిశంకరి. తల్లిదండ్రులిద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులే. గ్రూప్-1 మెయిన్ పరీక్షలకు 2 నెలల ముందు తండ్రి మరణం భవానిశంకరిని కలచివేసింది. నాన్న ఆశయాలు సాధించడం కోసం మనోధైర్యంతో పరీక్షలు రాశారామె. లక్ష్య సాధనలో విజయం సాధించి డిప్యూటీ కలెక్టర్గా ఎంపికయ్యారు. ఉన్నత ఉద్యోగం సాధించినప్పుడు నాన్న లేరన్న బాధ ఉందని ఆమె తెలిపారు. ఆయన ప్రోత్సాహంతోనే ఉద్యోగం సాధించానని చెప్పారు.
వైద్యవృత్తి నుంచి డిప్యూటీ కలెక్టర్గా
డాక్టర్ ఎస్.భరత్నాయక్
కర్నూలు నేరవిభాగం: వైద్య వృత్తి నుంచి గ్రూప్-1 ఉద్యోగం సాధించారు కర్నూలు జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సహాయ పర్యవేక్షణాధికారి డాక్టర్ ఎస్.భరత్ నాయక్. అనంతపురం నగరానికి చెందిన భరత్నాయక్ తండ్రి ఎస్.శంకర్నాయక్ శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో పట్టు విభాగాధిపతిగా, తల్లి శాంతాబాయి ఖజానా సహాయ అధికారిణిగా పనిచేసి పదవీ విరమణ పొందారు. భరత్నాయక్ అనంతపురంలోనే ప్రభుత్వ వైద్యకళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. తల్లిదండ్రుల స్ఫూర్తితో సివిల్స్కు సన్నద్ధమై రెండుసార్లు ప్రయత్నించారు. 2016 గ్రూప్-1 రాసి మద్యనిషేధ, అబ్కారీశాఖలో సహాయ పర్యవేక్షణాధికారిగా ఎంపికయ్యారు. కర్నూలులో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో టాస్క్ఫోర్స్లో విధులు నిర్వర్తిస్తూనే మళ్లీ 2018 గ్రూప్-1కు సన్నద్ధమయ్యారు. డిప్యూటీ కలెక్టర్గా ఎంపికయ్యారు.
ఆర్డీవోగా రైతు బిడ్డ
నాన్నకు మిఠాయి తినిపిస్తున్న మనీష
రాప్తాడు (ఆత్మకూరు): రైతు బిడ్డ ఆర్టీవోగా ఎంపికయ్యారు. రాప్తాడు మండలం బుక్కచెర్ల గ్రామానికి చెందిన సూర్యనారాయణరెడ్డి, సావిత్రి దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనాన్ని సాగిస్తున్నారు. వీరి కుమార్తె మనీష 2017లో హైదరాబాద్లోని ఐఏఎస్ అకాడమీలో డిగ్రీ చేశారు. 2018లో గ్రూప్ 1 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా విడుదల చేసిన ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ చూపి ఆర్టీవోగా ఎంపికయ్యారు. తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏడో రోజు జోరుగా నామినేషన్లు
[ 25-04-2024]
ప్రధాన పార్టీలైన తెదేపా, కాంగ్రెస్, వైకాపా, బీఎస్పీ తదితర పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు బుధవారం జోరుగా నామినేషన్ వేశారు. -
విధేయతకు తెదేపా పట్టం
[ 25-04-2024]
అనంతపురం జిల్లా తెదేపా అధ్యక్షుడిగా జి.వెంకట శివుడు యాదవ్ నియమించారు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. -
నిర్మించలేదు.. నిర్వహణ చేతకాదు
[ 25-04-2024]
కల్లబొల్లి మాటలు చెప్పడం తప్ప జగన్ ప్రభుత్వం ఈ ఐదేళ్లలో రైతులకు ఉపయోగపడే పని ఒక్కటీ చేయలేదు. తాను నిర్మించలేదు.. -
అనంత నగరం.. పసుపుమయం
[ 25-04-2024]
అనంతపురం అర్బన్ తెదేపా అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ నామినేషన్ సందర్భంగా బుధవారం అనంతపురం అర్బన్ క్యాంపు కార్యాలయానికి ఉదయం 8 గంటలకే -
వంతెన నిర్మాణాన్ని విస్మరించిన జగన్ సర్కార్
[ 25-04-2024]
వైకాపా పాలనలో భూతద్దం పెట్టి వెతికినా అభివృద్ధి కనిపించదు. తెదేపా హయాంలో తలపెట్టిన పనుల్ని ఐదేళ్లుగా జగన్ ప్రభుత్వం పక్కనపెట్టేసింది. ఉరవకొండ మండలం కైకుంట్ల నుంచి వై.రాంపురం మార్గంలో హంద్రీనీవా -
వైకాపా అసమర్థ అభ్యర్థిని ఓడిస్తేనే అభివృద్ధి: కేశవ్
[ 25-04-2024]
ఉరవకొండ, విడపనకల్లు, వజ్రకరూరు, బెళుగుప్ప, న్యూస్టుడే: వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి అసమర్థుడని, ఆయన్ను ఈ ఎన్నికల్లో ఓడిస్తేనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యం అవుతుందని తెదేపా అభ్యర్థి, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఉద్ఘాటించారు. -
ఐదేళ్ల పాలన చూశాం.. మళ్లీ తప్పు చేయొద్దు
[ 25-04-2024]
పేరూరు డ్యాంకు నీరు తెచ్చాం, బంగారు గనులను తెరిపించి ఉద్యోగాలు కల్పించాం.. అంటూ ప్రకాశ్రెడ్డి అన్ని అబద్ధాలే చెబుతారని మాజీ మంత్రి పరిటాల సునీత ధ్వజమెత్తారు. -
రాయదుర్గం సర్వతోముఖాభివృద్ధికి కృషి : కాలవ
[ 25-04-2024]
రాయదుర్గం సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తానని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కాలవ శ్రీనివాసులు అన్నారు. బుధవారం మధ్యాహ్నం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. -
పెద్దారెడ్డి నామినేషన్.. అంతా పరేషాన్
[ 25-04-2024]
తాడిపత్రి వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి బుధవారం నామినేషన్ వేసేందుకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ప్రధాన రహదారి సీబీ రోడ్డును రెండువైపులా బ్లాక్ చేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. -
ఏడో రోజు 54 నామినేషన్ల దాఖలు
[ 25-04-2024]
జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఏడో రోజు హిందూపురం పార్లమెంటు స్థానానికి ఏడు, ఏడు అసెంబ్లీ స్థానాలకు 47 మొత్తం 54 నామినేషన్లు దాఖలు చేశారు. -
కొండలు కరిగించి.. నిధులు కొల్లగొట్టి
[ 25-04-2024]
అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైకాపా నాయకులు మట్టి వ్యాపారుల అవతారమెత్తి కొండలను కరిగించేశారు. కదిరి ప్రాంతంలోని -
నీరు కుప్పం వెళ్లింది.. చెరువు ఎండింది
[ 25-04-2024]
వైకాపా ప్రభుత్వం హంద్రీనీవా జలాలను కుప్పం తీసుకెళ్లడం ఫలితంగా ముదిగుబ్బ మండలంలోని దొరిగల్లు చెరువు ఎండింది. ఈ చెరువు కింద ఖరీఫ్లో సుమారు 500, రబీలో 200 ఎకరాల వరకు ఆయకట్టు సాగవుతోంది. -
పేరుకే పెద్దాసుపత్రి... ఓపీ సేవలు నామమాత్రం
[ 25-04-2024]
ఉరవకొండ 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీ సేవలు నామమాత్రంగా అందుతున్నాయి. దాంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత