చెరువుస్థలం ఆక్రమణపై హైకోర్టులో పిల్
మాట్లాడుతున్న ఉమామహేశ్వరనాయుడు
ఈనాడు, అమరావతి: కల్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని సుబేదార్ కుంట/చెరువును ఆక్రమించడాన్ని సవాలు చేస్తూ దాఖలైనప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి, అనంతపురం జిల్లా కలెక్టర్, కల్యాణదుర్గం ఆర్డీవో, తహసీల్దార్లను ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా చెరువుల ఆక్రమణల వ్యవహారంపై సుమోటోగా నమోదు చేసిన వ్యాజ్యంతో ప్రస్తుత పిటిషన్ను విచారిస్తామని తెలిపింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్ర, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులతో కూడిన ధర్మాసనం బుధవారం ఈమేరకు ఆదేశాలిచ్చింది. సుబేదార్ కుంట ఆక్రమణలను అడ్డుకోవాలని కోరుతూ కల్యాణదుర్గం తెదేపా తెదేపా ఇంఛార్జి ఎం.ఉమామహేశ్వరనాయుడు హైకోర్టులో పిల్ వేశారు. న్యాయవాది వై బాలాజీ వాదనలు వినిపిస్తూ.. చెరువును మట్టితో పూడ్చేసి దానిని ప్లాట్లుగా వేసి విక్రయించే యత్నం చేస్తున్నారన్నారు. వైకాపాకు చెందిన ఓ మంత్రి, వారి అనుచరుల కనుసన్నల్లో కబ్జా ప్రక్రియ నడుస్తోందన్నారు. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం కౌంటర్లు వేయాలని ప్రతివాదులను ఆదేశించింది.
ఆదేశం.. హర్షణీయం
కళ్యాణదుర్గం: సుబేదారు చెరువు పూడ్చివేతపై కౌంటర్ వేయాలని హైకోర్టు ఆదేశించడం హర్షణీయమని తెదేపా నియోజకవర్గ బాధ్యుడు ఉమామహేశ్వరనాయుడు అన్నారు. బుధవారం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. సర్వే నం.329లో 92.81 ఎకరాల్లో ఉన్న చెరువును పూడ్చివేస్తే రైతులు, పట్టణ ప్రజలకు నష్టం జరుగుతుందని అనేకసార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదన్నారు. హైకోర్టును ఆశ్రయించగా కేసు విచారణకు స్వీకరించిందన్నారు. ఇలాంటి సమస్యలు ఉన్న భూమిని ప్రజలు కొనుగోలు చేసి నష్టపోవద్దని సూచించారు. పార్టీ నాయకులు యేళ్ళ నారాయణ, మురళి, కొల్లప్ప, సత్యప్ప, శ్రీరాములు, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Nitish Kumar: నీతీశ్ కేబినెట్లో72% మందిపై క్రిమినల్ కేసులు.. 27మంది కోటీశ్వరులే..!
-
Viral-videos News
Viral video: యూనిఫాంలో పోలీసుల ‘నాగిని డ్యాన్స్’.. వైరల్గా మారిన వీడియో
-
World News
Biden: దగ్గిన చేతితోనే పెన్ను ఇచ్చి, కరచాలనం చేసి..!
-
Sports News
FIFA: ఫుట్బాల్ సమాఖ్యపై నిషేధం.. తాష్కెంట్లో చిక్కుకుపోయిన 23సభ్యుల మహిళల బృందం
-
Crime News
Crime news: ‘టీ’లో విషం కలిపి ముగ్గురు పిల్లలను హత్యచేసిన తల్లి
-
General News
Health tips: ఆరు రుచులతో ఆరోగ్యం.. ఈ విశేషాలు మీకు తెలుసా?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Liger: లైగర్ ఓటీటీ ఆఫర్ ఎందుకు వదులుకున్నారు?
- DK : ఆయన ఓటమిని అస్సలు తట్టుకోలేడు.. సహనం తక్కువే.. కానీ!
- Bihar: అరెస్టు వారెంటున్న నేత.. న్యాయశాఖ మంత్రిగా ప్రమాణం..!
- Biden: దగ్గిన చేతితోనే పెన్ను ఇచ్చి, కరచాలనం చేసి..!
- Tollywood: విజయేంద్రప్రసాద్ కథతో భారీ బడ్జెట్ మూవీ.. దర్శకుడు ఎవరంటే?
- Shyam Singha Roy: ఆస్కార్ నామినేషన్ల పరిశీలన రేసులో ‘శ్యామ్ సింగరాయ్’
- Chandrababu: ఎన్నికలకు సమయం లేదు.. దూకుడు పెంచాలి: చంద్రబాబు
- Crime news: ‘టీ’లో విషం కలిపి ముగ్గురు పిల్లలను హత్యచేసిన తల్లి
- Health tips: ఆరు రుచులతో ఆరోగ్యం.. ఈ విశేషాలు మీకు తెలుసా?
- Heart Health: చేపలతో గుండెకెంత మేలో తెలుసా..?