logo

కోరలు చాస్తున్న కరోనా

జిల్లాలో కరోనా మహమ్మారి చాప కింద నీరులా విస్తరిస్తోంది. బుధవారం ఏకంగా ఆరు కేసులు నమోదయ్యాయి. మంగళవారం మూడు క్రియాశీలక కేసులు ఉండగా.. బుధవారం ఆ సంఖ్య తొమ్మిదికి చేరింది. ఇందులో ఒకరు ప్రభుత్వ సర్వజన

Published : 07 Jul 2022 03:17 IST

ఒకే రోజు ఆరు కేసులు

అనంతపురం(వైద్యం), న్యూస్‌టుడే: జిల్లాలో కరోనా మహమ్మారి చాప కింద నీరులా విస్తరిస్తోంది. బుధవారం ఏకంగా ఆరు కేసులు నమోదయ్యాయి. మంగళవారం మూడు క్రియాశీలక కేసులు ఉండగా.. బుధవారం ఆ సంఖ్య తొమ్మిదికి చేరింది. ఇందులో ఒకరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా మిగతా 8 మంది హోం ఐసొలేషన్‌లో ఉన్నారు. కరోనా విజృంభిస్తుండటంతో వైద్యాధికారులు అప్రమత్తం అవుతున్నారు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ముఖద్వారంలోని కొవిడ్‌ ఓపీలో సిబ్బందిని కేటాయించారు. ముగ్గురు నర్సులను ఒక షిప్టుకు కేటాయించారు. దీనికి తోడు అక్కడే కొవిడ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని