ఎంపీ తీరు సిగ్గుచేటు
హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ తీరు సిగ్గుచేటని పలువురు నాయకులు మండిపడ్డారు. ఎంపీ నగ్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో రావడంపై తెదేపా, తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో శుక్రవారం
ఎంపీ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న తెదేపా, తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు
అనంతపురం (రాణినగర్), న్యూస్టుడే: హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ తీరు సిగ్గుచేటని పలువురు నాయకులు మండిపడ్డారు. ఎంపీ నగ్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో రావడంపై తెదేపా, తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. నగరంలోని సప్తగిరి కూడలిలో ఎంపీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కూడా బాధ్యత వహించాలని డిమాండు చేశారు. తక్షణమే ఎంపీ పదవి నుంచి తొలగించాలని డిమాండు చేశారు. ఈ కార్యక్రమంలో తెదేపా జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్చౌదరి, ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.ఎస్.రాజు, కళ్యాణదుర్గం ఇన్ఛార్జి ఉమామహేశ్వరనాయుడు, శింగనమల ద్విసభ్య కమిటీ సభ్యులు నరసానాయుడు, కేశవరెడ్డి, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర నాయకుడు లక్ష్మీనరసింహ, తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటప్ప, ప్రధాన కార్యదర్శి పరశురాం, అనంత పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు ధనుంజయనాయుడు పాల్గొన్నారు.
ప్రజలే బుద్ధి చెబుతారు
గోరంట్ల మాధవ్ కమ్మ కులాన్ని తిట్టడం హాస్యాస్పదం అని కమ్మ సంఘం నాయకుడు బాంబే డయింగ్ నాగన్న పేర్కొన్నారు. శుక్రవారం కమ్మ భవనం వద్ద వారు మాట్లాడుతూ ఓ కులాన్ని లక్ష్యంగా తీసుకుని మాట్లాడితే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. తక్షణమే ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండు చేశారు. లేనిపక్షంలో ఎస్పీ, కలెక్టరు దృష్టికి తీసుకెళతామని హెచ్చరించారు.
తప్పును కప్పి పుచ్చుకొనేందుకే
తప్పును కప్పి పుచ్చుకొనేందుకు ఎంపీ మాధవ్ కుల ప్రస్తావన తెస్తున్నారని కమ్మ సేవాసంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మల్లాగుండ్ల రాజు పేర్కొన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ అశ్లీల వీడియో సామాజిక మాధ్యమాల్లో వస్తే సచ్ఛీలతను నిరూపించుకోవాల్సింది పోయి కులప్రస్తావన తీసుకొని రావడం తగదన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు చల్లా లక్ష్మీనారాయణ, రాష్ట్ర రైతు సంఘం నాయకుడు వెంకటేశ్వరనాయుడు పాల్గొన్నారు.
మాధవ్ ఇంటి ముట్టడి భగ్నం
ఎంపీ మాధవ్ ఇంటి ముట్టడికి ప్రయత్నించిన చంద్రదండు అధ్యక్షుడు ప్రకాష్నాయుడును పోలీసులు అడ్డుకున్నారు. ఆయనతోపాటు పలువురు నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాధవ్ నోటిని అదుపులో పెట్టుకోవాలన్నారు. ఎదుటి వారిపై నెపం నెట్టి తప్పించుకోవాలని ప్రయత్నించడం తగదన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాడు-నేడు జగన్మాయ
[ 19-04-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రగతి పనులను అటకెక్కించారు. నాడు-నేడు పథకం కింద బడులను ఎంపిక చేశారే తప్ప అభివృద్ధి పనులు పూర్తి చేయడానికి తగిన నిధులు కేటాయించడం లేదు. -
నామినేషన్ల పర్వం ఆరంభం
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల సమరం ఆరంభమైంది. కీలక ఘట్టమైన నామినేషన్ల పర్వం మొదలైంది. -
తండ్రి ఆశయాన్నీ నెరవేర్చలేని జగన్: షర్మిల
[ 19-04-2024]
‘‘హంద్రీనీవా పథకాన్ని పూర్తి చేసి అనంత జిల్లా రైతులకు లక్ష ఎకరాలకు సాగు నీరివ్వాలన్నది దివంగత సీఎం వైఎస్సార్ లక్ష్యం. -
నిర్లక్ష్యపు జాడలో.. నీరెరగని కాలువలు
[ 19-04-2024]
కాలువల్లో నీరు పారినపుడే వ్యవసాయం ఆశాజనకంగా ఉంటుంది. అనంతపురం జిల్లాలో వ్యవసాయానికి కాలువలే ఆయువుపట్టు. -
నేడు బాలకృష్ణ నామినేషన్ పత్రాల దాఖలు
[ 19-04-2024]
హిందూపురం అసెంబ్లీ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే బాలకృష్ణ, ఆయన సతీమణి వసుంధరలు శుక్రవారం మధ్యాహ్నం 12.15 గంటలకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు. -
వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం.. ప్రమాదకరం
[ 19-04-2024]
ఈ నెల 16వ తేదీన ముదిగుబ్బ మండలంలోని మలకవేములక్రాస్లో మిద్దెపై ఆడుకుంటున్న ఎనిమిదేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు 11కేవీ విద్యుత్తు తీగలు తగలడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. -
విశ్రాంత ఉద్యోగుల పాలిట జగనాసురుడు
[ 19-04-2024]
సుమారు 35 ఏళ్ల పాటు సేవలు అందించిన విశ్రాంత ఉద్యోగులకు జగన్ సర్కారు పగలే చుక్కలు చూపిస్తోంది. -
జగన్ పాలనలో అన్నీ కోతలే
[ 19-04-2024]
యువతను ఆకర్షించి అధికారంలోకి వచ్చిన వైకాపా చివరకు.. ఆ వర్గానికే షాకిచ్చింది. -
నామినేషన్ల పర్వం ప్రారంభం
[ 19-04-2024]
మొదటి రోజు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా జరిగింది. కేంద్ర ఎన్నికల కమిషన్ సార్వత్రిక ఎన్నికలు నోటిఫికేషన్ విడుదల కావడంతో గురువారం నామపత్రాల ప్రక్రియ ప్రారంభమైంది. -
నేడు కణేకల్లులో చంద్రబాబు సభ
[ 19-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు శుక్రవారం అనంతపురం జిల్లా కణేకల్లుకు రానున్నారు. -
రైతులను విస్మరించిన వైకాపా ప్రభుత్వం
[ 19-04-2024]
రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వం ఐదేళ్లలో రైతులను పూర్తిగా విస్మరించిందని తెదేపా అభ్యర్థి పయ్యావుల కేశవ్ ఆరోపించారు. -
గ్రామాల అభివృద్ధికే రాజకీయాల్లోకి.. : అమిలినేని
[ 19-04-2024]
గ్రామాల అభివృద్ధి కోసమే రాజకీయాల్లోకి వచ్చానని కళ్యాణదుర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు స్పష్టం చేశారు. -
కోడ్ ఉల్లంఘించి ఫ్లెక్సీల ఏర్పాటు
[ 19-04-2024]
ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి అధికార పార్టీ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. -
గొర్రెల యజమానులతో రెవెన్యూ అధికారి డబ్బుల డిమాండ్
[ 19-04-2024]
గొర్రెల యాజమానుల నుంచి ఓ రెవెన్యూ అధికారి డబ్బులు డిమాండ్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
తాడిపత్రిలో భగ్గుమన్న భానుడు
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలోని తాడిపత్రిలో గురువారం అత్యధికంగా 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు సహదేవరెడ్డి, నారాయణస్వామి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత