logo

Anantapur: బాలికపై హత్యాయత్నం ఘటనలో గ్రామ వాలంటీరు?

ఈ నెల 1న కళ్యాణదుర్గం మండలం బోయలపల్లి గ్రామ సమీపంలో ఓ బాలికపై భాస్కర్‌ అనే యువకుడు కారుతో ఢీకొట్టి హత్యాయత్నం చేసిన ఘటన పాఠకులకు విదితమే.

Updated : 06 Aug 2022 09:38 IST

అనంత నేరవార్తలు, న్యూస్‌టుడే: ఈ నెల 1న కళ్యాణదుర్గం మండలం బోయలపల్లి గ్రామ సమీపంలో ఓ బాలికపై భాస్కర్‌ అనే యువకుడు కారుతో ఢీకొట్టి హత్యాయత్నం చేసిన ఘటన పాఠకులకు విదితమే. ఇప్పటికే నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపారు. బాలికను వేధింపులకు గురి చేసిన వారిలో నిందితుడికి మామ వరసయ్యే (బుక్కరాయసముద్రం మండలం అమ్మవారిపేట) కుళ్లాయప్ప ముఖ్యుడని తెలిసింది. ఇతను ప్రస్తుతం అమ్మవారిపేటలో గ్రామ వాలంటీరుగా పనిచేస్తున్నాడు. బాలికను కళ్యాణదుర్గంలో కిడ్నాప్‌ చేసి కారులో తీసుకెళ్లడంలో కీలకపాత్ర పోషించినట్లు పేర్కొన్నారు. కారులో బాలికపై దాడిచేసి భాస్కర్‌ను పెళ్లి చేసుకోవాలని బెదిరించాడని, వదిలేయమని వేడుకున్నా భాస్కర్‌తో పాటు కుళ్లాయప్ప అనుచితంగా ప్రవర్తించారని బాధితురాలు చెప్పినట్లు సమాచారం. కేసులో సదరు వాలంటీరు లేకుండా ఓ వైకాపా నాయకుడు పోలీసులపై ఒత్తిడి చేశాడని తెలిసింది. వాలంటీర్‌పై గతంలో బుక్కరాయసముద్రం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైనట్లు సమాచారం. అతనిపై కేసు నమోదు చేసి శిక్షించాలని బాధితురాలి బంధువులు డిమాండ్‌ చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని