Anantapur news : కళ్లముందే కబ్జా!
ముదిగుబ్బ మండలంలో భూ ఆక్రమణలు ఆగడం లేదు. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు పాగా వేస్తున్నారు. స్థానిక నాయకులు కొందరు బృందంగా ఏర్పడి కబ్జాలకు పాల్పడుతున్నారు. వీటిని అడ్డుకోవాల్సిన రెవెన్యూ అధికారులు అక్రమార్కులతో చేతులు కలుపుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రూ.కోటి విలువైన స్థలం ఆక్రమణ
ముదిగుబ్బలో ఆగని దందా
సర్వే నంబరు 1190-3లోని ప్రభుత్వ స్థలంలో చేపడుతున్న నిర్మాణం
ఈనాడు డిజిటల్, అనంతపురం: ముదిగుబ్బ మండలంలో భూ ఆక్రమణలు ఆగడం లేదు. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు పాగా వేస్తున్నారు. స్థానిక నాయకులు కొందరు బృందంగా ఏర్పడి కబ్జాలకు పాల్పడుతున్నారు. వీటిని అడ్డుకోవాల్సిన రెవెన్యూ అధికారులు అక్రమార్కులతో చేతులు కలుపుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా గుంజేపల్లి రెవెన్యూ గ్రామ పరిధి సర్వే నంబరు 1190-3లోని ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించారు. సమీపంలోని స్టేడియానికి వెళ్లే 50 అడుగుల దారిని సైతం కలిపేసుకుని హోటల్ నిర్మాణం సాగిస్తున్నారు. జాతీయ రహదారికి ఆనుకుని కబ్జా పర్వం కొనసాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సుమారు 25 సెంట్ల ప్రభుత్వ స్థలంలో నిర్మాణం చేపడుతున్నారు. దీని విలువ సుమారు రూ.కోటి వరకు ఉంటుందని అంచనా.
మొదటికొచ్చిన ఆక్రమణల పర్వం
ముదిగుబ్బ కేంద్రంగా గతంలో పెద్దఎత్తున ప్రభుత్వ భూమిని ఆక్రమించి లేఅవుట్లు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. వీటిపై ‘ఈనాడు’లో వరుస కథనాలు రావడంతో రెవెన్యూ అధికారులు స్పందించి స్థలాలను స్వాధీనం చేసుకున్నారు. అప్పట్లో పనిచేసిన అధికారి కఠినంగా వ్యవహరించడంతో స్థానిక అధికార పార్టీ నాయకులు ఆయన్ను వేరే ప్రాంతానికి బదిలీ చేయించారు. తర్వాత తమకు అనుకూలమైన వారికి పోస్టింగ్ ఇప్పించుకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. వారి సహకారంతోనే ఆక్రమణల పర్వం కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. గుంజేపల్లి పరిధిలోని 1330, 896, 1036, 2060 సర్వే నంబర్లలో భూముల్ని ఆక్రమించి క్రయవిక్రయాలు జరిపారు. వీటిపై వార్తలు రావడంతో అధికారులు ఆయా స్థలాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ స్థలాల్లోనూ మళ్లీ కార్యకలాపాలు ప్రారంభించారు. ఆక్రమణల పర్వం మళ్లీ మొదటికొచ్చింది.
విచారణ చేపడతాం
నాగేంద్ర, తహసీల్దార్, ముదిగుబ్బ
గుంజేపల్లి పరిధిలోని సర్వే నంబరు1190-3లో దారిని ఆక్రమించిన విషయం ఇటీవలే నా దృష్టికి వచ్చింది. నేను కూడా ఇటీవలే బాధ్యతలు చేపట్టడంతో పూర్తి అవగాహన లేదు. వెంటనే విచారణ జరుపుతాం. ఆక్రమణలు నిజమని తేలితే స్థలాన్ని స్వాధీనం చేసుకుని బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.
గతంలో అడ్డుకున్నా..
గుంజేపల్లి సర్వే నంబరు 1190లో మొత్తం మూడు సబ్డివిజన్లలో కలిపి 12.1 ఎకరాల భూమి ఉంది. ఇందులో 1190-3లో గ్రామకంఠంగా ఆన్లైన్లో చూపిస్తోంది. దీన్ని కొంతమంది పేదలకు గతంలో ఇళ్ల పట్టాలు మంజూరు చేశారు. ఈ స్థలానికి ఆనుకుని ఉన్న 826 సర్వే నంబరులోని స్థలాన్ని స్టేడియం నిర్మాణానికి కేటాయించారు. జాతీయ రహదారి నుంచి స్టేడియానికి వెళ్లడానికి సర్వే నంబరు 1190-3 మీదుగా 50 అడుగుల రహదారి ఉన్నట్లు గ్రామ పటంలో స్పష్టంగా తెలుస్తోంది. కొన్ని నెలల కిందట రహదారిని ఆక్రమించి పునాదులు తీస్తుండటంతో కొందరు స్థానికులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు విచారణ చేపట్టడంతో కొద్దిరోజులు నిర్మాణాన్ని నిలిపేశారు. మళ్లీ నెలరోజులుగా జోరుగా హోటల్ నిర్మాణం జరుగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాట తప్పాడు.. మడత పెట్టాడు
[ 26-04-2024]
ఒకసారి మాట ఇస్తే.. ఆ మాట కోసం ఎంత దూరమైనా వెళ్లాలి అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కబుర్లు చెప్పిన జగన్... అధికార పగ్గాలు చేపట్టాక ఇచ్చిన హామీలు ఏరోజూ గుర్తుకు రాలేదు. -
నిరుద్యోగుల ఆశలపై నీళ్లు
[ 26-04-2024]
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గుంతకల్లుతో పాటు వివిధ ప్రాంతాల్లోని హిందీ పండిట్ శిక్షణ కేంద్రాలను మూసేసింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
ప్రతి చేనుకు నీరందిస్తాం..
[ 26-04-2024]
మాజీ మంత్రి పరిటాల సునీత నామినేషన్ కార్యక్రమం గురువారం అట్టహాసంగా సాగింది. -
కృష్ణా జలాలతో చెరువులు నింపుతా
[ 26-04-2024]
ఐదేళ్ల అధికారంలో ఉన్న వైకాపా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అభివృద్ధి చేసిందేమీలేదని, మంత్రి ఉష, ఎంపీ రంగయ్య రెండు వర్గాలుగా విడిపోయి నాశనం చేశారని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ధ్వజమెత్తారు. -
సైకో పోవాలి.. సైకిల్ గెలవాలి
[ 26-04-2024]
తెదేపా అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ నామినేషన్ ఘట్టానికి తెలుగు సైన్యం కదలివచ్చింది. -
ఉరవకొండలో దాహం కేకలు
[ 26-04-2024]
జగన్ ప్రభుత్వంలో వరుస నాలుగేళ్లుగా ఉరవకొండలో తాగునీటి సమస్య కొనసాగుతోంది. -
గోసంరక్షణ పట్టని జగన్
[ 26-04-2024]
ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు దైవానుగ్రహానికి గోదానం, గోసంరక్షణకు విరాళం ఇస్తున్నారు. -
రోడ్లు, వంతెనలు శిథిలం..కళ్లకు కనిపిస్తున్నా కదలం!
[ 26-04-2024]
ఏ రాష్ట్ర ప్రగతి అయినా రోడ్లను చూస్తేనే అర్థం అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో రోడ్ల స్థితిగతులు జగన్ పాలనను వేలెత్తి చూపుతున్నాయి. -
సుక్క వెయ్.. చిందెయ్!
[ 26-04-2024]
రాయదుర్గం నియోజకవర్గ ఎమ్మెల్యే వైకాపా అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి నామినేషన్ ర్యాలీకి జన సమీకరణకు ఆ పార్టీ నాయకులు అష్టకష్టాలు పడ్డారు. -
జేఈఈ మెయిన్స్లో విద్యార్థుల ప్రతిభ
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్లో అనంత విద్యార్థులు ప్రతిభ చాటుకున్నారు. -
జగనన్నా.. మహిళా సంక్షేమం ఎక్కడా?
[ 26-04-2024]
నా చెల్లి, నా అక్క అంటూ వేదికలెక్కి హామీలిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళా సంక్షేమాన్ని మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారు. -
అరాచక శక్తులకు అండగా నిలుస్తారా?
[ 26-04-2024]
అసమర్థులు, అరచాక శక్తులకు అండగా నిలుస్తారా? అభివృద్ధి చేసేవారికి అండగా నిలుస్తారా? అంటూ ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ప్రజలను ప్రశ్నించారు. -
ముగిసిన నామినేషన్ల దాఖలు ప్రక్రియ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఘట్టం ముగిసింది. వారం రోజుల కోలాహలానికి తెర పడింది. -
వైకాపాను ఓడించాలి: మాదిగ సంఘాల ఐక్యవేదిక
[ 26-04-2024]
మాదిగలను మోసం చేసిన సీఎం జగన్ను ఓడించేందుకు కూటమికి మద్దతుగా నిలుస్తున్నట్లు ఆ సంఘాల ఐక్య వేదిక ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా