logo

కులాల మధ్య చిచ్చు పెడుతున్న ముఖ్యమంత్రి

కులాల మధ్య చిచ్చు పెట్టి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి చోద్యం చూస్తున్నారని చంద్రదండు వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రకాష్‌నాయుడు పేర్కొన్నారు. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ను సస్పెండ్‌ చేయాలని డిమాండు చేస్తూ

Published : 09 Aug 2022 04:07 IST

దిష్టిబొమ్మను దహనం చేస్తున్న చంద్రదండు ప్రకాష్‌నాయుడు తదితరులు

అనంతపురం (రాణినగర్‌), న్యూస్‌టుడే: కులాల మధ్య చిచ్చు పెట్టి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి చోద్యం చూస్తున్నారని చంద్రదండు వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రకాష్‌నాయుడు పేర్కొన్నారు. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ను సస్పెండ్‌ చేయాలని డిమాండు చేస్తూ సోమవారం అనంతపురంలో నిరసన, ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా పోలీసులు ప్రకాష్‌నాయుడును అరెస్టు చేసేందుకు ప్రయత్నించగా ఆయన తీవ్రంగా ప్రతిఘటించారు.  బలవంతంగా అదుపులోకి తీసుకొన్నారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ ఎంపీ మాధవ్‌ను వైకాపా నుంచి సస్పెండ్‌ చేసి, పదవికి రాజీనామా చేయించి ముఖ్యమంత్రి తన నిజాయతీని నిరూపించుకోవాలని డిమాండు చేశారు. కార్యక్రమంలో గురుమూర్తి, నారాయణస్వామి, దివాకర్‌నాయుడు, జాకీర్‌, యేసు, ఆదిలక్ష్మి, పెద్దక్క తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని