గంటకు 130 కి.మీ. వేగానికి అంతా సిద్ధం!
రైళ్లు మరింత వేగంగా నడిపేందుకు రంగం సిద్ధమైంది. ముంబయి- చెన్నై రైలు మార్గంలో గుంతకల్లు డివిజన్ పరిధిలో ఉన్న వాడి- గుంతకల్లు, గుంతకల్లు- రేణిగుంట మధ్య మొదట రాయలసీమ ఎక్స్ప్రెస్, చెన్నై మెయిల్ రైళ్లను 130 కి.మీ.ల వేగంతో
ఎల్హెచ్బీ బోగీతో ప్రయాణిస్తున్న చెన్నై మెయిల్ రైలు
గుంతకల్లు, న్యూస్టుడే: రైళ్లు మరింత వేగంగా నడిపేందుకు రంగం సిద్ధమైంది. ముంబయి- చెన్నై రైలు మార్గంలో గుంతకల్లు డివిజన్ పరిధిలో ఉన్న వాడి- గుంతకల్లు, గుంతకల్లు- రేణిగుంట మధ్య మొదట రాయలసీమ ఎక్స్ప్రెస్, చెన్నై మెయిల్ రైళ్లను 130 కి.మీ.ల వేగంతో నడపాలని రైల్వే ఉన్నతాధికారులు ఆలోచిస్తున్నారు. రైళ్లను వేగంగా నడపడానికి డివిజన్ అధికారులు రూ.90 కోట్లు వ్యయం చేసి సంవత్సరం కిందట రెండు సెక్షన్లలో రైల్వేలైన్లను బలోపేతం చేయటం తెలిసిందే. ప్రస్తుతం ఎక్కువ భాగం రైళ్లు ఉక్కుతో తయారుచేసిన బోగీలు ఉన్నవాటిని 110 కి.మీ.ల వేగంతో నడుపుతున్నారు. ఎక్కువ వేగంతో నడపడానికి ఈ బోగీలు పనికి రావని స్టెయిన్లెస్ స్టీల్, అల్యూమినియంతో కపుర్తలతో తయారుచేసిన ఎల్హెచ్బీ (లింక్ హాఫ్మన్ బుష్) బోగీలు కలిగిన రైళ్లను అత్యధిక వేగంతో వాడి-గుంతకల్లు- రేణిగుంట మధ్య నడపాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం ఈ సెక్షన్లో రాయలసీమ, చెన్నై మెయిల్ రైళ్లు మాత్రమే ఎల్హెచ్బీ బోగీలతో ప్రయాణిస్తున్నాయి. మొదట ఈ రెండు రైళ్లను ప్రయోగాత్మకంగా పెంచిన వేగంతో నడపాలని ఉన్నతాధికారులు తీర్మానించారు. తరువాత అంచెలవారీగా మిగిలిన రైళ్లను వేగంగా నడపాలని నిర్ణయం తీసుకున్నారు.
ఎల్హెచ్బీ రైలు బోగీల ప్రత్యేకతలివే..
ఎల్హెచ్బీ బోగీలు తేలికగా ఉంటాయని, ప్రమాదాలు జరిగిన సమయంలో ఒక బోగీ పైకి మరొకటి వెళ్లకుండా ఉంటూ ప్రాణనష్టం కలగజేయవని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. ఈ బోగీలు రైలు పట్టాలపై వెళ్లే సమయంలో ఎక్కువ శబ్దం వెలువడదని, కదలికలు కూడా చాలా తక్కువని చెబుతున్నారు. ఈ బోగీలు చాలావరకు ప్రమాదాలకు గురికావని అధికారవర్గాలు తెలిపాయి. జోనల్ అధికారులు ఎల్హెచ్బీ బోగీలతో గుంతకల్లు డివిజన్ గుండా రైళ్లను నడపాలని రైల్వే బోర్డుకు నివేదించారు. ఒక బోగీలో 80 మంది ప్రయాణించవచ్చు. జర్మనీ సాంకేతిక పరిజ్ఞానంతో ఈ బోగీలను తయారు చేయడానికి కపుర్తల, రాయబరేలి, పెరంబూరుల్లోని కోచ్ల తయారీ కర్మాగారాల్లో తయారు చేస్తున్నారు. రైళ్లను 130 కి.మీ.ల వేగంతో నడపాలని ఎప్పుడు ఆదేశాలు జారీచేసినా.. శిక్షణ పొందిన సిబ్బంది వాటిని నడిపేందుకు సిద్ధంగా ఉన్నారని అధికారులు వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సాగు పడిపోయింది జగన్.. సాగనంపేందుకు ‘అనంత’ సిద్ధం
[ 18-04-2024]
అనంతపురం జిల్లా అంటేనే గుర్తొచ్చేది వేరుసెనగ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా పంట పండించేది అనంత జిల్లాలోనే.. ఇక్కడి రైతులకు ప్రధాన పంట వేరుసెనగ. ఇంతటి ప్రాధాన్యం ఉన్న పంట సాగు విస్తీర్ణం ఏటా తగ్గిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. -
నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన ఘట్టం నామినేషన్ల పర్వానికి గురువారం నుంచి తెరలేవనుంది. జిల్లాలో అనంత పార్లమెంటు (లోక్సభ), 8 శాసనసభా స్థానాలకు ఏకకాలంలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. -
లీజు పేరుతో ట్రాక్టర్లు మాయం ఘరానా ముఠా అరెస్టు
[ 18-04-2024]
ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో లీజు పేరిట ట్రాక్టర్లు తీసుకెళ్లి ఇతర ప్రాంతాల్లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్న ఘరానా ముఠా కేసును ఛేదించి కీలక సభ్యులను అరెస్టు చేసినట్లు శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి వెల్లడించారు. -
తెదేపా ప్రతినిధులపై వైకాపా శ్రేణుల దాడి
[ 18-04-2024]
ఉరవకొండలో తెదేపా ప్రతినిధులపై వైకాపా శ్రేణులు దాడికి పాల్పడ్డారు. తెదేపా బూత్ కన్వీనరు నాగభూషణ, నార్పలకు చెందిన అతని మిత్రుడు సంతోశ్తో కలిసి బుధవారం సాయంత్రం డ్రైవర్స్ కాలనీలో ఓటరు జాబితా పరిశీలనకు వెళ్లారు. -
19న చంద్రబాబు ఎన్నికల ప్రచార సభ
[ 18-04-2024]
ణేకల్లులో ఈనెల 19న సాయంత్రం తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో జరిగే ఎన్నికల ప్రచార సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. -
వైద్యం చేయకుండానే రోగుల పేరిట బిల్లులు!
[ 18-04-2024]
డోన్లోని ఒక ప్రైవేట్ వైద్యశాలకు గుత్తితోపాటు సమీప గ్రామాల నుంచి కొంతమంది పేదలను తీసుకెళ్లి ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేసినట్లు బిల్లులు చేసుకోవడం వివాదాస్పదమైంది. విచారణ చేపట్టిన అధికారులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. -
ఎన్నికల వ్యయ పరిశీలకుడి రాక
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం గురువారం మొదలు కానున్న నేపథ్యంలో ఎన్నికల వ్యయ పరిశీలకుడు నితిన్ అగర్వాల్ జిల్లాకు చేరుకున్నారు. -
నేత్రపర్వం.. సీతారాముల తిరుకల్యాణోత్సవం
[ 18-04-2024]
కసాపురంలోని శ్రీనెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో శ్రీరామనవమిని పురస్కరించుకుని సీతారాముల తిరుకల్యాణోత్సవం నేత్రపర్వంగా సాగింది. -
‘చెత్త’నూ తొలగించలేని ప్రభుత్వం
[ 18-04-2024]
-
మడకశిరలో వైకాపాకు షాక్
[ 18-04-2024]
వైకాపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఈర లక్కప్ప సొంత మండలంలోనే ఆ పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు మూకుమ్మడి రాజీనామాలు చేసి గట్టి షాక్ ఇచ్చారు. -
కల్యాణ వైభోగమే..
[ 18-04-2024]
పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో జానకీరాముడి కల్యాణోత్సవం వేలాది మంది భక్తజనం నడుమ వైభవపేతంగా జరిగింది. -
కోడ్ ఉన్నా ఆర్టీసీలో గుట్టుచప్పుడు కాకుండా నియామకం!
[ 18-04-2024]
ఎన్నికల కోడ్ వచ్చి సరిగ్గా నెలరోజులు అవుతున్నా ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థలో నియామకాలు మాత్రం గుట్టుచప్పుడు కాకుండా చేసేస్తున్నారు. -
అప్పు ఇచ్చా.. తిరిగి చెల్లించండి!
[ 18-04-2024]
మొన్నటివరకు కళ్యాణదుర్గంలో అధికారం వెలగబెట్టిన మహిళా ప్రజాప్రతినిధి ఐదేళ్లపాటు ధనార్జనే ధ్యేయంగా పనిచేశారు. డబ్బుల కోసం సొంతపార్టీ నాయకుల్ని సైతం వేధించారు. -
ధర్మవరంలో కూటమి జోరు
[ 18-04-2024]
ధర్మవరంలో రాజకీయ గాలి వేగంగా మారుతోంది. మొన్నటివరకు కూటమి, వైకాపా మధ్య పోటాపోటీగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయిందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. -
నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కీలక ఘట్టం నామపత్రం స్వీకరణ గురువారం నుంచి ప్రారంభంకానుంది. శ్రీసత్యసాయి జిల్లాలోని ఆరు అసెంబ్లీ, ఒక లోక్సభ స్థానాలకు నామపత్రాల స్వీకరణ, ఎన్నికల నోటిఫికేషన్ నేడు వెలువడనుంది. -
నేడు బండారు శ్రావణిశ్రీ నామినేషన్
[ 18-04-2024]
శింగనమల అసెంబ్లీ నియోజకవర్గానికి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ గురువారం నామపత్రాలు దాఖలు చేస్తున్నట్లు ఆ పార్టీ మండల కన్వీనర్ ఆదినారాయణ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
సీఎం వస్తున్నారు.. మరి జనమో!
-
సమస్య ఓ చోట.. సమర్పించేది మరోచోట.. పాస్పోర్టు దరఖాస్తుదారుల్లో గందరగోళం
-
మేనమామ వేషం... అక్కచెల్లెమ్మలకు మోసం
-
మైక్రోసాఫ్ట్ ఉద్యోగం వదిలి.. ప్రజాసేవకు కదిలి..
-
గౌతమ్.. నన్ను మన్నించురా...
-
నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. ఏపీ, తెలంగాణలో నేటి నుంచే నామినేషన్లు