సమరయోధుల త్యాగాలు చిరస్మరణీయం
స్వాతంత్య్ర స్ఫూర్తి భావితరాలకు దీప్తి కావాలన్నదే ఆజాదీకా అమృత్ మహోత్సవాల ప్రధాన ఉద్దేశమని కలెక్టర్ బసంత్కుమార్ పేర్కొన్నారు. మంగళవారం పెడపల్లిలో స్వాతంత్య్ర సమరయోధుడు చిదంబరరెడ్డి కుటుంబసభ్యులకు సన్మానం చేశారు.
పుట్టపర్తి గ్రామీణం: రమణారెడ్డిని సత్కరిస్తున్న కలెక్టర్ బసంత్కుమార్
పుట్టపర్తి గ్రామీణం: స్వాతంత్య్ర స్ఫూర్తి భావితరాలకు దీప్తి కావాలన్నదే ఆజాదీకా అమృత్ మహోత్సవాల ప్రధాన ఉద్దేశమని కలెక్టర్ బసంత్కుమార్ పేర్కొన్నారు. మంగళవారం పెడపల్లిలో స్వాతంత్య్ర సమరయోధుడు చిదంబరరెడ్డి కుటుంబసభ్యులకు సన్మానం చేశారు. ఆయన కుమారుడు రమణారెడ్డి కుటుంబాన్ని సత్కరించారు. ఆర్డీవో భాగ్యరేఖ, తహసీల్దార్ భాస్కరనారాయణ, ఎంపీడీవో అశోక్కుమార్రెడ్డి పాల్గొన్నారు.
కదిరి పట్టణం: రెవెన్యూ అధికారులు మంగళవారం స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబ సభ్యులను సత్కరించారు. స్వాతంత్య్ర సమరయోధుడు, 1957-67 మధ్య హిందూపురం పార్లమెంటు సభ్యుడిగా సేవలందించిన కె.వి.రామకృష్ణారెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. రామకృష్ణారెడ్డి కుమారుడు, మాజీ శాసనసభ్యుడు డాక్టర్ కడపల మోహన్రెడ్డిని సత్కరించారు. ఆర్డీవో రాఘవేంద్ర, తహసీల్దార్ ముకుంద పాల్గొన్నారు.
కదిరి పట్టణం: మాజీ ఎమ్మెల్యే మోహన్రెడ్డికి సన్మానం
హిందూపురం అర్బన్: స్వాతంత్య్ర సమర యోధుల త్యాగాలు చిరస్మరణీయమని పెనుకొండ సబ్కలెక్టర్ నవీన్ అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా మంగళవారం హిందూపురం పట్టణం నానెప్పనగర్లో నివాసం ఉన్న స్వాతంత్య్ర సమరయోధుడు కల్లూరు సుబ్బారావు కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అనంతరం పురపాలక సంఘం పరిధిలోని కొట్నూరు ఇందిరమ్మ కాలనీలో అద్దె ఇంట్లో నివాసమున్న స్వాతంత్య్ర సమరయోధుడు పీరూసాబ్ భార్యను సన్మానించారు. కార్యక్రమంలో వన్టౌన్ సీఐ ఇస్మాయిల్, ఇన్ఛార్జి తహసీల్దారు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
పెనుకొండ పట్టణం : పెనుకొండలోని స్వాత్రంత్య సమరయోధుడు పంచాంగం శేషశయనం కుమారులు సుదేంద్రబాబు, నరసింహశర్మ, మనమడు సోమశేఖర్బాబును పెనుకొండ ఎంపీడీవో శివశంకరప్ప, తహసీల్దార్ స్వర్ణలత, నరపంచాయతీ కమిషనర్ వంశీకృష్ణభార్గవ్ సన్మానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏడో రోజు జోరుగా నామినేషన్లు
[ 25-04-2024]
ప్రధాన పార్టీలైన తెదేపా, కాంగ్రెస్, వైకాపా, బీఎస్పీ తదితర పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు బుధవారం జోరుగా నామినేషన్ వేశారు. -
విధేయతకు తెదేపా పట్టం
[ 25-04-2024]
అనంతపురం జిల్లా తెదేపా అధ్యక్షుడిగా జి.వెంకట శివుడు యాదవ్ నియమించారు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. -
నిర్మించలేదు.. నిర్వహణ చేతకాదు
[ 25-04-2024]
కల్లబొల్లి మాటలు చెప్పడం తప్ప జగన్ ప్రభుత్వం ఈ ఐదేళ్లలో రైతులకు ఉపయోగపడే పని ఒక్కటీ చేయలేదు. తాను నిర్మించలేదు.. -
అనంత నగరం.. పసుపుమయం
[ 25-04-2024]
అనంతపురం అర్బన్ తెదేపా అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ నామినేషన్ సందర్భంగా బుధవారం అనంతపురం అర్బన్ క్యాంపు కార్యాలయానికి ఉదయం 8 గంటలకే -
వంతెన నిర్మాణాన్ని విస్మరించిన జగన్ సర్కార్
[ 25-04-2024]
వైకాపా పాలనలో భూతద్దం పెట్టి వెతికినా అభివృద్ధి కనిపించదు. తెదేపా హయాంలో తలపెట్టిన పనుల్ని ఐదేళ్లుగా జగన్ ప్రభుత్వం పక్కనపెట్టేసింది. ఉరవకొండ మండలం కైకుంట్ల నుంచి వై.రాంపురం మార్గంలో హంద్రీనీవా -
వైకాపా అసమర్థ అభ్యర్థిని ఓడిస్తేనే అభివృద్ధి: కేశవ్
[ 25-04-2024]
ఉరవకొండ, విడపనకల్లు, వజ్రకరూరు, బెళుగుప్ప, న్యూస్టుడే: వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి అసమర్థుడని, ఆయన్ను ఈ ఎన్నికల్లో ఓడిస్తేనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యం అవుతుందని తెదేపా అభ్యర్థి, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఉద్ఘాటించారు. -
ఐదేళ్ల పాలన చూశాం.. మళ్లీ తప్పు చేయొద్దు
[ 25-04-2024]
పేరూరు డ్యాంకు నీరు తెచ్చాం, బంగారు గనులను తెరిపించి ఉద్యోగాలు కల్పించాం.. అంటూ ప్రకాశ్రెడ్డి అన్ని అబద్ధాలే చెబుతారని మాజీ మంత్రి పరిటాల సునీత ధ్వజమెత్తారు. -
రాయదుర్గం సర్వతోముఖాభివృద్ధికి కృషి : కాలవ
[ 25-04-2024]
రాయదుర్గం సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తానని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కాలవ శ్రీనివాసులు అన్నారు. బుధవారం మధ్యాహ్నం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. -
పెద్దారెడ్డి నామినేషన్.. అంతా పరేషాన్
[ 25-04-2024]
తాడిపత్రి వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి బుధవారం నామినేషన్ వేసేందుకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ప్రధాన రహదారి సీబీ రోడ్డును రెండువైపులా బ్లాక్ చేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. -
ఏడో రోజు 54 నామినేషన్ల దాఖలు
[ 25-04-2024]
జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఏడో రోజు హిందూపురం పార్లమెంటు స్థానానికి ఏడు, ఏడు అసెంబ్లీ స్థానాలకు 47 మొత్తం 54 నామినేషన్లు దాఖలు చేశారు. -
కొండలు కరిగించి.. నిధులు కొల్లగొట్టి
[ 25-04-2024]
అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైకాపా నాయకులు మట్టి వ్యాపారుల అవతారమెత్తి కొండలను కరిగించేశారు. కదిరి ప్రాంతంలోని -
నీరు కుప్పం వెళ్లింది.. చెరువు ఎండింది
[ 25-04-2024]
వైకాపా ప్రభుత్వం హంద్రీనీవా జలాలను కుప్పం తీసుకెళ్లడం ఫలితంగా ముదిగుబ్బ మండలంలోని దొరిగల్లు చెరువు ఎండింది. ఈ చెరువు కింద ఖరీఫ్లో సుమారు 500, రబీలో 200 ఎకరాల వరకు ఆయకట్టు సాగవుతోంది. -
పేరుకే పెద్దాసుపత్రి... ఓపీ సేవలు నామమాత్రం
[ 25-04-2024]
ఉరవకొండ 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీ సేవలు నామమాత్రంగా అందుతున్నాయి. దాంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
-
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్
-
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు