Anantapur News : రైతే.. యజమాని!
ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదు. మరోవైపు మార్కెట్లో వస్తువుల ధరలు సామాన్యుడి నడ్డి విరగ్గొడుతున్నాయి. రైతుకు, వినియోగదారుడికి మధ్య దళారీ జేబులోకి సొమ్మంతా వెళ్లిపోతోంది.
ప్రాసెసింగ్ యూనిట్
ఈనాడు డిజిటల్, అనంతపురం, న్యూస్టుడే, ఉరవకొండ: ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదు. మరోవైపు మార్కెట్లో వస్తువుల ధరలు సామాన్యుడి నడ్డి విరగ్గొడుతున్నాయి. రైతుకు, వినియోగదారుడికి మధ్య దళారీ జేబులోకి సొమ్మంతా వెళ్లిపోతోంది. ఈ దోపిడీని అరికట్టాలంటే రైతే వ్యాపారిగా మారాలి. అన్నదాతలను సంఘటితం చేసి, ఆహార పరిశ్రమల వైపు నడిపించాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగా వాల్మార్ట్ ఫౌండేషన్, ఇక్రిశాట్, ఏఎఫ్ ఎకాలజీ సంస్థలు కృషి చేస్తున్నాయి. అనంతపురం జిల్లా కూడేరు మండలం ముద్దలాపురంలో వ్యవసాయ ఉత్పత్తుల సెకండరీ ప్రాసెసింగ్ యూనిట్ను ఏర్పాటు చేశారు. ‘రైతు నేస్తం ఫుడ్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్’ పేరుతో రూ.5 కోట్లు వెచ్చించి యూనిట్ను నెలకొల్పారు. జిల్లాలోని 8 మండలాలకు చెందిన 6 వేల మంది రైతులను భాగస్వాములుగా చేశారు. స్థానికంగా పండే వేరుసెనగ, తృణ ధాన్యాలతో వివిధ రకాల ఆహార ఉత్పత్తులను తయారు చేసి, వచ్చిన లాభాలను రైతులకు పంచనున్నారు. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్దన్రెడ్డి చేతుల మీదుగా బుధవారం ఈ యూనిట్ను ప్రారంభించనున్నారు.
మహిళలే బోర్డు డైరెక్టర్లు
అనంతపురం-బళ్లారి జాతీయ రహదారికి ఆనుకుని ముద్దలాపురం వద్ద ఎకరా విస్తీర్ణంలో ప్రాసెసింగ్ యూనిట్ను నిర్మించారు. పరిశ్రమ నిర్మాణానికి రూ.3.50 కోట్లు ఖర్చు చేయగా.. రూ.1.50 కోట్లతో యంత్ర సామగ్రి కొనుగోలు చేశారు. ఇందులో వేరుసెనగ, చిరుధాన్యాలు, పప్పుదినుసులు వంటి వ్యవసాయ ఉత్పత్తులను ప్రాసెసింగ్ చేస్తారు. వేరుసెనగ ద్వారా నూనె, చిక్కీలు, చిరుధాన్యాల నుంచి రెడీ టు కుక్ ప్యాకెట్లు, బిస్కెట్లు తయారు చేస్తారు. వీటిని మార్కెటింగ్ చేయడానికి ఇక్రిశాట్తోపాటు ప్రముఖ ఆన్లైన్ షాపింగ్ సంస్థ ఫ్లిప్కార్ట్ సహకారం అందించనున్నాయి. పరిశ్రమను నడపటానికి 10 మంది రైతులు బోర్డు డైరెక్టర్లుగా నియమించారు. వీరంతా మహిళా రైతులే కావడం విశేషం. వీరికి హైదరాబాద్లోని ఇక్రిశాట్ అగ్రి బిజినెస్ విభాగంలో ఏడాదిపాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. రెండేళ్ల వరకు పరిశ్రమను ఇక్రిశాట్ పర్యవేక్షిస్తుంది. తర్వాత పూర్తి బాధ్యతలను మహిళా రైతులకే అప్పగిస్తారు.
యూనిట్లో పనిచేస్తున్న మహిళలు
క్వింటాకు రూ.వెయ్యి అదనపు ఆదాయం
ఉమ్మడి అనంతపురం జిల్లాలో 50 శాతానికిపైగా రైతులు వేరుసెనగ పండిస్తున్నారు. ఈ ఏడాది ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో వ్యాపారులు కుమ్మక్కై ధరలు తగ్గించేశారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రాసెసింగ్ యూనిట్లో వాల్యూ యాడెడ్ ఉత్పత్తులు తయారు చేయడం ద్వారా క్వింటాకు రూ.వెయ్యి వరకు అదనపు ఆదాయం వస్తుందని ఎకాలజీ సెంటర్ ప్రతినిధులు చెబుతున్నారు. వేరుసెనగ నుంచి నూనె తీయగా మిగిలిన వ్యర్థాలను కూడా కిలో రూ.30 చొప్పున విక్రయించుకోవచ్చు. ఈ యూనిట్లో రోజుకు 6 వేల నుంచి 10 వేల వరకు బిస్కెట్లు, 500 లీటర్ల నుంచి వెయ్యి లీటర్ల నూనె తయారు చేస్తారు. వీటితోపాటు పల్లీ మసాలాలు, బేకరీల్లో దొరికే బూందీ లాంటివి కూడా తయారు చేస్తారు. ఇందులో 30 నుంచి 50 మంది వరకు స్థానికులకు ఉపాధి కలగనుంది. భాగస్వాములైన రైతుల నుంచే కాకుండా ఇతరుల నుంచీ పంటను కొనుగోలు చేయవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాడు-నేడు జగన్మాయ
[ 19-04-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రగతి పనులను అçËకెక్కించారు. నాడు-నేడు పథకం కింద బడులను ఎంపిక చేశారే తప్ప అభివృద్ధి పనులు పూర్తి చేయడానికి తగిన నిధులు కేటాయించడం లేదు. -
నామినేషన్ల పర్వం ఆరంభం
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల సమరం ఆరంభమైంది. కీలక ఘట్టమైన నామినేషన్ల పర్వం మొదలైంది. -
తండ్రి ఆశయాన్నీ నెరవేర్చలేని జగన్: షర్మిల
[ 19-04-2024]
‘‘హంద్రీనీవా పథకాన్ని పూర్తి చేసి అనంత జిల్లా రైతులకు లక్ష ఎకరాలకు సాగు నీరివ్వాలన్నది దివంగత సీఎం వైఎస్సార్ లక్ష్యం. -
నిర్లక్ష్యపు జాడలో.. నీరెరగని కాలువలు
[ 19-04-2024]
కాలువల్లో నీరు పారినపుడే వ్యవసాయం ఆశాజనకంగా ఉంటుంది. అనంతపురం జిల్లాలో వ్యవసాయానికి కాలువలే ఆయువుపట్టు. -
నామపత్రాల్లో అభ్యర్థుల ఆస్తిపాస్తులు
[ 19-04-2024]
నామినేషన్ మొదలైన తొలిరోజు పలు పార్టీల అభ్యర్థులు వారి ఆస్తిపాస్తులు, విద్యార్హత, కేసుల వివరాలను నామపత్రాల్లో దాఖలు పర్చారు. -
నేడు బాలకృష్ణ నామినేషన్ పత్రాల దాఖలు
[ 19-04-2024]
హిందూపురం అసెంబ్లీ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే బాలకృష్ణ, ఆయన సతీమణి వసుంధరలు శుక్రవారం మధ్యాహ్నం 12.15 గంటలకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు. -
వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం.. ప్రమాదకరం
[ 19-04-2024]
ఈ నెల 16వ తేదీన ముదిగుబ్బ మండలంలోని మలకవేములక్రాస్లో మిద్దెపై ఆడుకుంటున్న ఎనిమిదేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు 11కేవీ విద్యుత్తు తీగలు తగలడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. -
విశ్రాంత ఉద్యోగుల పాలిట జగనాసురుడు
[ 19-04-2024]
సుమారు 35 ఏళ్ల పాటు సేవలు అందించిన విశ్రాంత ఉద్యోగులకు జగన్ సర్కారు పగలే చుక్కలు చూపిస్తోంది. -
జగన్ పాలనలో అన్నీ కోతలే
[ 19-04-2024]
యువతను ఆకర్షించి అధికారంలోకి వచ్చిన వైకాపా చివరకు.. ఆ వర్గానికే షాకిచ్చింది. -
నామినేషన్ల పర్వం ప్రారంభం
[ 19-04-2024]
మొదటి రోజు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా జరిగింది. కేంద్ర ఎన్నికల కమిషన్ సార్వత్రిక ఎన్నికలు నోటిఫికేషన్ విడుదల కావడంతో గురువారం నామపత్రాల ప్రక్రియ ప్రారంభమైంది. -
నేడు కణేకల్లులో చంద్రబాబు సభ
[ 19-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు శుక్రవారం అనంతపురం జిల్లా కణేకల్లుకు రానున్నారు. -
రైతులను విస్మరించిన వైకాపా ప్రభుత్వం
[ 19-04-2024]
రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వం ఐదేళ్లలో రైతులను పూర్తిగా విస్మరించిందని తెదేపా అభ్యర్థి పయ్యావుల కేశవ్ ఆరోపించారు. -
గ్రామాల అభివృద్ధికే రాజకీయాల్లోకి.. : అమిలినేని
[ 19-04-2024]
గ్రామాల అభివృద్ధి కోసమే రాజకీయాల్లోకి వచ్చానని కళ్యాణదుర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు స్పష్టం చేశారు. -
కోడ్ ఉల్లంఘించి ఫ్లెక్సీల ఏర్పాటు
[ 19-04-2024]
ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి అధికార పార్టీ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. -
గొర్రెల యజమానులతో రెవెన్యూ అధికారి డబ్బుల డిమాండ్
[ 19-04-2024]
గొర్రెల యాజమానుల నుంచి ఓ రెవెన్యూ అధికారి డబ్బులు డిమాండ్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
తాడిపత్రిలో భగ్గుమన్న భానుడు
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలోని తాడిపత్రిలో గురువారం అత్యధికంగా 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు సహదేవరెడ్డి, నారాయణస్వామి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు