రహస్య స్థావరం..సేవా మందిరం!
స్వాతంత్య్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడుతున్న రోజులవి.. బ్రిటీష్ పాలకులు సైనికుల ద్వారా ఎప్పటికప్పుడు ఉద్యమాన్ని అణచివేస్తున్న కాలమది.. జాతీయ నాయకుల సందేశాలు, ఉద్యమ వ్యూహాల్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లడానికి అనేక అడ్డంకులు ఎదురయ్యేవి..
బాపూ సూచనతో ఆశ్రమం
విద్యార్థి దశనుంచే దేశభక్తి
ఈనాడు డిజిటల్, అనంతపురం, న్యూస్టుడే, పరిగి, హిందూపురం అర్బన్: స్వాతంత్య్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడుతున్న రోజులవి.. బ్రిటీష్ పాలకులు సైనికుల ద్వారా ఎప్పటికప్పుడు ఉద్యమాన్ని అణచివేస్తున్న కాలమది.. జాతీయ నాయకుల సందేశాలు, ఉద్యమ వ్యూహాల్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లడానికి అనేక అడ్డంకులు ఎదురయ్యేవి.. పత్రికలు మినహా పెద్ద సమాచార వ్యవస్థ లేదు.. ఇలాంటి పరిస్థితుల్లో స్థానిక నాయకులే కీలక పాత్ర పోషించారు. నిఘా వ్యవస్థ నుంచి తప్పించుకుని వ్యూహాల్ని అమలు చేయడానికి ప్రత్యేక ప్రదేశాలను ఎంచుకున్నారు. సైనికుల కంట పడకుండా రహస్య సమావేశాలు ఏర్పాటు చేసుకుని సమాలోచనలు జరిపారు. స్వచ్ఛంద సంస్థలు, విద్యాలయాలను వేదికలుగా మార్చుకున్నారు. అందులో పరిగి మండలంలోని సేవా మందిరం ముఖ్యమైనది.
స్వాతంత్య్ర సమరయోధులు కల్లూరు సుబ్బారావు, తమిళనాడుకు చెందిన చక్రవర్తి రాజగోపాలచారి నాయకత్వంలో ఊరికి దూరంగా పెన్నానది ఒడ్డున ఉన్న సేవామందిరంలో రహస్యంగా సమావేశాలు నిర్వహించారు. బ్రిటీష్ పాలకుల కంట పడకుండా కొన్నాళ్లు ఇక్కడే అజ్ఞాతవాసం చేశారు. కర్ణాటక ప్రాంతానికి చెందిన నాయకులు కూడా ఇక్కడికి వచ్చేవారు. 1942లో కర్ణాటకలోని శిరా తాలుకాకు చెందిన ఏఎం.లింగణ్ణ ఈ భవనంలో ఓ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి, దానికి సేవా మందిరం అని పేరుపెట్టారు. అంతకుముందు ఆయన సబర్మతి ఆశ్రమానికి వెళ్లి గాంధీని కలిశారు. మీతో కలిసి పనిచేస్తానని చెప్పగా.. నీ అవసరం ఇక్కడి కంటే మీ ప్రాంతంలోనే ఎక్కువగా ఉందని.. అక్కడ ఆశ్రమం ఏర్పాటు చేయాలని గాంధీజీ సూచించారు. గాంధీ సూచన మేరకు ఇక్కడ ఆశ్రమాన్ని స్థాపించారు.
సేవ పేరుతో చైతన్యం
ఖద్దరు ఉద్యమ ప్రచారానికి సేవా మందిరాన్ని వినియోగించుకున్నారు. విదేశీ వస్తువులను బహిష్కరించి, స్థానికంగా తయారు చేసిన వస్త్రాలనే ధరించాలని ఇక్కడ్నుంచే ప్రచారం చేశారు. సేవా మందిరంలోని ప్రతి ఒక్కరూ ఖద్దరు టోపీ ధరించేలా నిబంధనలు విధించారు. సేవా కార్యక్రమాలను విరివిగా నిర్వహించారు. సేవ పేరుతోనే ప్రజల్లో స్వాతంత్య్ర ఉద్యమంపై చైతన్యం నింపారు. ఈ ఆశ్రమంలో ఇప్పటికీ ఖద్దరు సంస్కృతి పాటిస్తున్నారు. విద్యార్థులందరూ దేశభక్తి చాటేలా ఖద్దరు టోపీలు ధరిస్తున్నారు.
గాంధీ బాటలో నడిచి..
గుమ్మఘట్ట మండలం శిరిగేదొడ్డి గ్రామానికి చెందిన దామోదర్సింగ్ కొంతకాలం రాయదుర్గం అరబిక్ కళాశాలలో హిందీ బోధకుడిగా పనిచేశారు. తెల్లదొరల పాలన నుంచి భారత్కు విముక్తి కల్పించేందుకు మహాత్మాగాంధీ అడుగు జాడల్లో నడిచారు. పలు సమావేశాలు, సభల్లో పాల్గొన్నారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని 3 నెలలు బళ్లారి జైల్లో శిక్ష అనుభవించారు. వంటకాలు చేయడంలో ఆయన సిద్ధహస్తులు. జైలులో ఎంతోమంది స్వాతంత్య్ర సమరయోధులకు వంట చేసి, వడ్డించారు. 2000లో కర్నూలు జిల్లా ఆదోని వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన తుది శ్వాస విడిచారు. ఆర్.దామోదర్సింగ్ను 1995లో అప్పటి రాష్ట్రపతి నారాయణ్, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు సత్కరించారు. ఫ్రీడం ఫైటర్ అవార్డు ఆనాటి ప్రభుత్వం
అందించింది. - గుమ్మఘట్ట
విద్యాలయాలే ఉద్యమ వేదికలు
ఉద్యమంలో గుత్తికి చెందిన కేశవ పిళ్లై ప్రముఖ పాత్ర వహించారు. విద్యార్థి దశ నుంచే దేశభక్తి పెంపొందించాలనే ఉద్దేశంతో గుత్తి, రాయదుర్గం, అనంతపురం ప్రాంతాల్లో పాఠశాలలను ఏర్పాటు చేశారు. 1929లో గుత్తిలో ప్రాథమిక పాఠశాలను సొంత నిధులతో నిర్మించారు. విద్యాబోధనతోపాటు పిల్లలకు దేశభక్తి పెంపొందించారు. జాతీయోద్యమ కార్యాచరణపై నాయకులతో కలిసి పాఠశాలల్లోనే రహస్య సమావేశాలు నిర్వహించారు. ప్రస్తుతం ఇక్కడ కోట సచివాలయం ఏర్పాటు చేశారు. - గుత్తి
జరిమానా సొమ్ముతో పాఠశాల నిర్మాణం
బ్రిటీష్ కాలంలో అనంతపురం నుంచి బళ్లారికి పెద్దఎత్తున సరకు రవాణా చేసేవారు. స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో రవాణాను అడ్డుకునేందుకు 1946లో విడపనకల్లు మండలం కొట్టాలపల్లి వద్ద వంతెనను గ్రామస్థులంతా కూల్చేశారు. దీనికి ప్రతిఫలంగా గ్రామంపై బ్రిటీషు ప్రభుత్వం రూ.5 వేలు జరిమానా విధించింది. అందరూ చందాలు వేసుకుని జరిమానా చెల్లించారు. స్వాతంత్య్రం తర్వాత 1951లో భారత ప్రభుత్వం గ్రామస్థులు కట్టిన జరిమానాను తిరిగి చెల్లించింది. ఆ నగదుతోనే అప్పట్లో ఊరిలో పాఠశాలను నిర్మించారు. - ఉరవకొండ
గ్రామోద్యమ నిర్మాణంలో దిట్ట
బత్తలపల్లి మండలం అప్రాచెరువుకు చెందిన చెన్నప్ప సామాజిక దురాచారాలకు వ్యతిరేకంగా పిడికిలి బిగించారు. గాంధీ ఉపన్యాసాలకు ఆకర్షితులై స్వాతంత్య్ర ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. క్విట్ఇండియా, సత్యాగ్రహం వంటి ఉద్యమాలను ఊరూరా తీసుకెళ్లారు. తన ఉపన్యాసాలతో గ్రామీణులను ఆకట్టుకున్నారు. 1930లో ఖద్దరు దుస్తులు ధరించి స్వగ్రామంలో రచ్చబండపై ఉపన్యసించారు. దీంతో బ్రిటీషు పాలకుల దృష్టిలో పడ్డారు. 1941 జనవరి 25న అరెస్టు చేసి బళ్లారి జిల్లా అలీపుర జైలులో పెట్టారు. కుల నిర్మూలన, పేద విద్యార్థులకు వసతి కల్పనకు పోరాటం చేశారు. వినోబాబావే భూదాన ఉద్యమానికి స్పందించి కొంత భూమిని దానం చేశారు. - జిల్లా సచివాలయం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోండి
[ 24-04-2024]
ఎన్నికల విధులకు నియామకం పొందిన ఉద్యోగ, ఉపాధ్యాయులందరూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించు కోవాలని కలెక్టర్ డాక్టర్ వినోద్కుమార్ పేర్కొన్నారు. -
ఇసుకంతైనా భయం లేదు.. దోపిడీ ఆగదు
[ 24-04-2024]
ఆస్తిని పంచుకున్నట్లు.. ప్రకృతి వనరులైన నదులు, వాగులు, వంకలను వైకాపా నాయకులు పంచేసుకున్నారు. జగన్ అండతో నదుల్ని వాటాలేసుకుని మరీ అక్రమ రవాణా కొనసాగించారు. ఉమ్మడి అనంత జిల్లాలోని పెన్నా, చిత్రావతి, వేదవతి, జయమంగళి తదితర నదుల్ని నామరూపాల్లేకుండా చేశారు. -
నమ్మండి.. జగనన్న కాలనీనే..
[ 24-04-2024]
వజ్రకరూరు మండలంలోని చాబాల, ధర్మపురి, గూళ్యపాళ్యం, కమలపాడు, పీసీప్యాపిలి గ్రామాల్లోని జగనన్న కాలనీలు ముళ్లపొదలతో నిండిపోయాయి. గడేహోతూరులో 73 ఇళ్లు, వజ్రకరూరులో 578 పట్టాలకుగాను 121, కొనకొండ్లలో 830కుపైగా పట్టాలు పంపిణీ చేస్తే 181 ఇళ్లు పూర్తయ్యాయి. -
ఒకే రోజు యాభై నామినేషన్లు
[ 24-04-2024]
జిల్లాలో పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. మంగళవారం ఒక్కరోజే అసెంబ్లీ స్థానాలకు ఏకంగా యాభై నామినేషన్లు దాఖలు కావడం విశేషం. పార్లమెంటు స్థానానికి రెండు వచ్చాయి. -
దేవుడి భూమినీ గుల్ల చేశారు
[ 24-04-2024]
జిల్లాలోని పెద్దవడుగూరుకు కూతవేటు దూరంలో ఉన్న నెలగొండరాయుడుస్వామి ఆలయానికి సంబంధించిన సర్వే సంఖ్య 777-ఎలోని 21.04 ఎకరాల ఎర్రనేల భూముల్లో వైకాపా నేతల కన్ను పడింది. -
రైల్వే స్టేషన్లలో తక్కువ ధరకే భోజనం
[ 24-04-2024]
రైలులో ప్రయాణించే ప్రయాణికులకు కొన్ని రైల్వే స్టేషన్లలో తక్కువ ధరకు భోజనాన్ని అందించే కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించామని సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ మనోజ్ తెలిపారు. -
జగన్ .. ఇంకా పరిహారం ఇవ్వలే
[ 24-04-2024]
భైరవానితిప్ప ప్రాజెక్టుకు సంబంధించి రూ.542కోట్లు వ్యయం అవుతుంది. ఇందులో తొలుత రైతుల నుంచి భూమిని సేకరిస్తేనే కాలువ పనులకు అడుగులు ముందుకు పడతాయి. 1,406 ఎకరాల భూమిని సేకరించడానికి పరిహారంగా రూ.208కోట్లు మంజూరు చేస్తున్నాను. -
ఉద్యాన రైతుల ఊపిరితీస్తున్న జగన్!
[ 24-04-2024]
రాష్ట్రంలోనే ఉమ్మడి అనంతపురం జిల్లా ఉద్యాన పంటలకు ప్రసిద్ధి. ప్రధానంగా చీనీ, దానిమ్మ సాగు ఎక్కువ. గత తెదేపా హయాంలో ఆయా పంటల సాగుకు పెద్దఎత్తున ప్రోత్సహించారు. -
విజయీభవ..
[ 24-04-2024]
ఉరవకొండ, రాప్తాడు నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించాలని తెదేపా అధినేత చంద్రబాబు సూచించారు. మంగళవారం విజయనగరం జిల్లా ఎస్.కోట పర్యటనలో ఉన్న చంద్రబాబును పయ్యావుల కేశవ్, పరిటాల సునీత కలిశారు. -
చేపా..చేపా.. నువ్వెందుకు ఈదలేదు!
[ 24-04-2024]
వైకాపా ప్రభుత్వంలో అన్నదాతలకే కాదు.. చేపల పెంపకానికీ నీటి కష్టాలు వెంటాడుతున్నాయి. గతేడాదే మత్స్య క్షేత్రాల్లో చేపల పిల్లల ఉత్పత్తి చేపట్టారు. ఇప్పటికే ప్రాజెక్టులు, చెరువుల్లో చేపల పెంపకం చేపట్టాల్సి ఉంది. -
ఉపాధి హామీ పనుల్లో అక్రమాలు
[ 24-04-2024]
దయ్యాలకుంటపల్లి గ్రామంలో ఉపాధి హామీ పనుల్లో అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. గ్రామ శివారులో గువ్వలగొండి కొండలో ఫాం పాండు పనులు చేస్తున్నారు. -
కోడ్ ఉల్లంఘిస్తున్నా.. చర్యలు సున్నా
[ 24-04-2024]
ఉద్యోగులు యథేచ్ఛగా వైకాపా ప్రచారంలో పాల్గొంటున్నా అధికారులకు కన్పించడం లేదు. కోడ్ ఉల్లంఘించే వారిపై పరిశీలించి సొంతంగా చర్యలు తీసుకోవడానికి భయపడే పరిస్థితి ఉంది. -
జగన్ పాలనలో .. ఉద్యానాలు కనుమరుగు
[ 24-04-2024]
జగన్ ప్రభుత్వంలో పట్టణవాసికి ఆహ్లాదాన్ని అందించాల్సిన ఉద్యానవనాలు ఉనికిని కోల్పోయాయి. వీటిని సంరక్షించాల్సిన పురపాలికలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. కొత్త పార్కుల ఏర్పాటును గాలికి వదిలేశారు. -
తెదేపాను గెలిపిద్దాం.. భవిష్యత్తును బాగుచేద్దాం
[ 24-04-2024]
సైకిల్ గుర్తుకు ఓటేసి తెదేపాను గెలిపిద్దాం.. భవిష్యత్తు తరాలను బాగుచేద్దామని తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని విజయనగర్ కాలనీలో మంగళలవారం ఆయన పర్యటించారు. -
ధర్మవరంలో కూటమి సందడి
[ 24-04-2024]
భాజపా ఎమ్మెల్యే అభ్యర్థి సత్యకుమార్ నామినేషన్ కార్యక్రమం మంగళవారం అట్టహాసంగా సాగింది. తెదేపా, భాజపా, జనసేన కార్యకర్తలు, నాయకులు భారీ సంఖ్యలో హాజరు కావడంతో పట్టణం కాషాయం, పసుపుమయంగా మారిపోయింది. -
కొండను తవ్వి.. వంకలు పూడ్చి
[ 24-04-2024]
వైకాపా నాయకుల అండతో కొందరు కొండలను మాయం చేస్తున్నారు. మట్టిని ఇష్టానుసారంగా తవ్వి ఆక్రమణలకు తెగబడుతున్నారు. కనగానపల్లి మండలం దాదులూరు రెవెన్యూ పంచాయతీలో ఉన్న కుర్లపల్లి గ్రామ సమీపంలో ఓ రియల్టర్ (భూ వ్యాపారస్థుడు) కొన్నేళ్ల క్రితం భూముల్ని కొనుగోలు చేశాడు. -
లేపాక్షికి యునెస్కో గుర్తింపు తెస్తాం
[ 24-04-2024]
తెదేపా ప్రభుత్వంలో పర్యాటక ఉత్సవాలను నిర్వహించి లేపాక్షి ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో మారుమోగేలా చేశామని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పేర్కొన్నారు. అటువంటి లేపాక్షిని ప్రస్తుత ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదన్నారు.