క్రికెటర్ల చిరునామా కదిరి
కదిరి కరవు ప్రాంతమే అయినా.. క్రీడాకారులకు కొరత లేదన్నట్లు క్రికెట్లో దూసుకుపోతున్నారు ఇక్కడి యువకులు.
ఉత్తమ ప్రదర్శనతో రాణిస్తున్న యువకులు
ఏపీఎల్, అండర్-19లో స్థానం
- న్యూస్టుడే, కదిరి
కదిరి కరవు ప్రాంతమే అయినా.. క్రీడాకారులకు కొరత లేదన్నట్లు క్రికెట్లో దూసుకుపోతున్నారు ఇక్కడి యువకులు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో క్రికెట్కు కేరాఫ్గా కదిరి నిలుస్తోంది. గతంలో ప్రసాద్రెడ్డి, షాబుద్దీన్ వంటి రంజీ ఆటగాళ్లను అందించిన ప్రాంతం నుంచి ప్రస్తుతం ఏపీఎల్లో అధిక రెమ్యునరేషన్తో ఎంపికైన గిరినాథరెడ్డితో పాటు సంతోష్ లాంటి క్రీడాకారులు ఈ ప్రాంతంవారే కావడం గమనార్హం. అండర్-19 క్రికెట్కు ఇద్దరు, అండర్-16లో ఒకరు స్థానం సాధించి ఉత్తమ ఆటతీరును ప్రదర్శిస్తున్నారు. ఆంధ్రాజట్టులో రాణించి, జాతీయ జట్టులో స్థానం దక్కించుకోవాలన్న పట్టుదలతో క్రికెటర్లు నిరంతర సాధనతో ప్రతిపోటీలోనూ సత్తాచాటుతూ అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. ఆర్డీటీ, జిల్లా క్రికెట్ సంఘం అందించిన ప్రోత్సాహమే తమను ముందుకు నడిపిస్తోందంటున్న క్రీడాకారుల ఆశలు, ఆశయాలు ఇలా..
ఉన్నతస్థాయి క్రికెటర్ కావడమే లక్ష్యం
క్రికెట్లో ఉన్నత స్థాయిలో ఆడాలన్నదే లక్ష్యమని రేవంత్రెడ్డి అంటున్నాడు. ఇతను కదిరిలో న్యాయవాది రామచంద్రరెడ్డి, గృహిణి చంద్రకళ తనయుడు. 8వ తరగతిలో క్రికెట్ను ఆర్డీటీ, ఏడీసీఏ శిక్షణ సబ్సెంటర్లో ప్రారంభించాడు. ఏసీఏ ఆధ్వర్యంలో జరిగిన పాఠశాల టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన గుర్తింపు ఉంది. 2018లో నిర్వహించిన ఏపీ స్కూల్గేమ్స్లో అనంతపురం జిల్లాకు, ఏసీఏ ఆధ్వర్యంలో జరిగిన అంతర్జిల్లాల అండర్-16 పోటీలకు ఆడాడు. కరోనా భయానక పరిస్థితుల్లోనూ సాధన చేసినా మ్యాచ్ల నిర్వహణ లేక జట్ల ఎంపిక కాలేదు. తర్వాత పాల్గొన్న లీగ్లు, టోర్నీలలో నిలకడగా ఆడుతూ అండర్-19 జిల్లా జట్టుకు ఎంపికయ్యాడు.
విరాట్ కోహ్లియే ఆదర్శంగా నిశ్చయ్
అండర్-16 జిల్లా క్రికెట్ జట్టుకు ఎంపికైన నిశ్చయ్ కదిరికి చెందిన ధన్వి, స్వప్నల కుమారుడు. క్రికెట్లో విరాట్ కోహ్లిపై అభిమానం, గిరినాథరెడ్డిని స్పూర్తిగా తీసుకున్నాడు. రాష్ట్రజట్టులో రాణించి, జాతీయజట్టులో స్థానం పొందాలన్నదే లక్ష్యంగా ఆడుతున్నాడు. తొమ్మిదో తరగతి చదువుతున్న ఈ విద్యార్థి 2011లో క్రికెట్ను ప్రారంభించాడు. బౌలర్గా ప్రత్యేకత కలిగిన ఇతను ఆల్రౌండర్గా ప్రతిభ చాటుతున్నాడు. ఏడీసీఏ ఆధ్వర్యంలో 2021లో జరిగిన అనంత ప్రీమియర్ లీగ్తో వెలుగులోకి వచ్చాడు. మొదటి మ్యాచ్లోనే ఐదు వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత 2022 అనంత ప్రీమియర్ లీగ్లో 25 వికెట్లు తీశాడు. అత్యధిక వికెట్లు సాధించిన ఉత్తమ బౌలర్గా అవార్డు అందుకున్నాడు. జిల్లా క్రికెట్ సంఘం నిర్వహించే అనంత ప్రీమియర్ లీగ్లో కదిరి అండర్-15 జట్టు ఫైనల్కు చేరటంలో కీలక పాత్ర పోషించాడు. ప్రాబబుల్లో రాణించి అండర్-16 జిల్లా జట్టుకు ఎంపికయ్యాడు.
ఆల్రౌండర్గా..
వేసవి శిక్షణ శిబిరంతో క్రికెట్ను ప్రారంభించిన సాయిప్రణీత్ ప్రైవేటు స్కూల్ బస్సు డ్రైవరు శ్రీనివాసులు, గృహిణి అలివేలు కుమారుడు. ప్రథమ ఇంటర్ చదువుతున్న కుర్రాడు జాతీయ జట్టులో స్థానం పొందాలన్న లక్ష్యంతో ఆటపై దృష్టి సారించాడు. మొదట ఏసీఏ స్కూల్ టోర్నీలో లెగ్ స్పిన్నర్గా విశేష ప్రదర్శనతో 24 వికెట్లు తీయడమేగాక పరుగులు సాధించటంలోనూ ప్రత్యేకత చాటుకున్నాడు. తద్వారా 2018లో మంగళగిరిలోని ఏసీఏ రాష్ట్రశిక్షణ శిబిరానికి ఎంపికయ్యాడు. 2019లో సీఎం కప్లో రాణించటంతో మహారాష్ట్రలో జరిగిన అంతర్రాష్ట్ర పోటీల్లో పాల్గొనేందుకు రాష్ట్రజట్టులో స్థానం పొందాడు. ఏపీఎల్లో సత్తాచాటి 2021లో అండర్-16 జిల్లా జట్టుకు ఎంపికయ్యాడు. 2022లో ఫైనల్లో సెంచురీతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రాపబుల్ మ్యాచ్లలో చక్కని పరుగులు సాధించడమేగాక ఉత్తమ ఆటతీరుతో అండర్-19 అంతర్జిల్లాల క్రికెట్ టోర్నీలో ఆడే జిల్లా జట్టుకు ఎంపికయ్యాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాట తప్పాడు.. మడత పెట్టాడు
[ 26-04-2024]
ఒకసారి మాట ఇస్తే.. ఆ మాట కోసం ఎంత దూరమైనా వెళ్లాలి అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కబుర్లు చెప్పిన జగన్... అధికార పగ్గాలు చేపట్టాక ఇచ్చిన హామీలు ఏరోజూ గుర్తుకు రాలేదు. -
నిరుద్యోగుల ఆశలపై నీళ్లు
[ 26-04-2024]
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గుంతకల్లుతో పాటు వివిధ ప్రాంతాల్లోని హిందీ పండిట్ శిక్షణ కేంద్రాలను మూసేసింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
ప్రతి చేనుకు నీరందిస్తాం..
[ 26-04-2024]
మాజీ మంత్రి పరిటాల సునీత నామినేషన్ కార్యక్రమం గురువారం అట్టహాసంగా సాగింది. -
కృష్ణా జలాలతో చెరువులు నింపుతా
[ 26-04-2024]
ఐదేళ్ల అధికారంలో ఉన్న వైకాపా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అభివృద్ధి చేసిందేమీలేదని, మంత్రి ఉష, ఎంపీ రంగయ్య రెండు వర్గాలుగా విడిపోయి నాశనం చేశారని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ధ్వజమెత్తారు. -
సైకో పోవాలి.. సైకిల్ గెలవాలి
[ 26-04-2024]
తెదేపా అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ నామినేషన్ ఘట్టానికి తెలుగు సైన్యం కదలివచ్చింది. -
ఉరవకొండలో దాహం కేకలు
[ 26-04-2024]
జగన్ ప్రభుత్వంలో వరుస నాలుగేళ్లుగా ఉరవకొండలో తాగునీటి సమస్య కొనసాగుతోంది. -
గోసంరక్షణ పట్టని జగన్
[ 26-04-2024]
ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు దైవానుగ్రహానికి గోదానం, గోసంరక్షణకు విరాళం ఇస్తున్నారు. -
రోడ్లు, వంతెనలు శిథిలం..కళ్లకు కనిపిస్తున్నా కదలం!
[ 26-04-2024]
ఏ రాష్ట్ర ప్రగతి అయినా రోడ్లను చూస్తేనే అర్థం అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో రోడ్ల స్థితిగతులు జగన్ పాలనను వేలెత్తి చూపుతున్నాయి. -
సుక్క వెయ్.. చిందెయ్!
[ 26-04-2024]
రాయదుర్గం నియోజకవర్గ ఎమ్మెల్యే వైకాపా అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి నామినేషన్ ర్యాలీకి జన సమీకరణకు ఆ పార్టీ నాయకులు అష్టకష్టాలు పడ్డారు. -
జేఈఈ మెయిన్స్లో విద్యార్థుల ప్రతిభ
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్లో అనంత విద్యార్థులు ప్రతిభ చాటుకున్నారు. -
జగనన్నా.. మహిళా సంక్షేమం ఎక్కడా?
[ 26-04-2024]
నా చెల్లి, నా అక్క అంటూ వేదికలెక్కి హామీలిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళా సంక్షేమాన్ని మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారు. -
అరాచక శక్తులకు అండగా నిలుస్తారా?
[ 26-04-2024]
అసమర్థులు, అరచాక శక్తులకు అండగా నిలుస్తారా? అభివృద్ధి చేసేవారికి అండగా నిలుస్తారా? అంటూ ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ప్రజలను ప్రశ్నించారు. -
ముగిసిన నామినేషన్ల దాఖలు ప్రక్రియ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఘట్టం ముగిసింది. వారం రోజుల కోలాహలానికి తెర పడింది. -
వైకాపాను ఓడించాలి: మాదిగ సంఘాల ఐక్యవేదిక
[ 26-04-2024]
మాదిగలను మోసం చేసిన సీఎం జగన్ను ఓడించేందుకు కూటమికి మద్దతుగా నిలుస్తున్నట్లు ఆ సంఘాల ఐక్య వేదిక ప్రకటించింది.