ప్రహసనంగా బియ్యం పంపిణీ
కేంద్ర ప్రభుత్వం హెచ్చరికతో రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు ఒకటో తేదీ నుంచి ఉచిత బియ్యం పంపిణీ ప్రారంభించింది. ఇదే సమయంలో ప్రతి నెలా వాహనాల ద్వారా అందించే
చౌకధర దుకాణంలో వేలిముద్ర వేస్తున్న లబ్ధిదారు
జిల్లా వ్యవసాయం, న్యూస్టుడే: కేంద్ర ప్రభుత్వం హెచ్చరికతో రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు ఒకటో తేదీ నుంచి ఉచిత బియ్యం పంపిణీ ప్రారంభించింది. ఇదే సమయంలో ప్రతి నెలా వాహనాల ద్వారా అందించే సరకుల పంపిణీ ఎక్కడా కనిపించడం లేదు. ఉచిత బియ్యం మాత్రమే సరఫరా అయ్యాయని, ప్రతినెల పంపిణీ చేసే బియ్యం జిల్లాకు చేరలేదని అధికారవర్గాల సమాచారం. ఉచిత బియ్యంతో పాటు 36 వేల మెట్రిక్ టన్నుల పీడీఎస్ బియ్యం అవసరం. ఈనెల 11వ తేదీ నాటికి పౌరసరఫరాల శాఖ అధికారుల లెక్కల ప్రకారం ఉమ్మడి జిల్లాలో ఆహార భద్రతా చట్టం ప్రకారం మొత్తం 11,34,699 కార్డులదారులకు గాను 8,92,343 మందికి ఉచిత బియ్యం పంపిణీ చేశారు. ఇంకా 2,42,356 మంది లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సి ఉంది.
11 రోజులుగా అనంతపురం జిల్లాలో 76.6 శాతం, శ్రీసత్యసాయి జిల్లాలో 80 శాతం పంపిణీ చేసినట్లు అధికారుల గణాంకాలను బట్టి తెలుస్తోంది. అనంతపురంలో 57 శాతం, బ్రహ్మసముద్రం 55.1, కుందుర్పి 49.4, కంబదూరు 61.1, అమరాపురంలో 57.7 శాతం మాత్రమే పంపిణీ జరిగింది.
* ఉమ్మడి జిల్లాలో మొత్తం 12,08,293 కార్డులు ఉన్నాయి. ఆహార భద్రతా చట్టం పరిధిలోకి 11,34,699 కార్డులు వచ్చాయి. మొత్తం 73,594 మంది లబ్ధిదారులకు ఉచిత బియ్యం కోత పెట్టారు. అందులో అనంతపురం జిల్లాలో 40,296, శ్రీసత్యసాయి జిల్లాలో 33,298 మంది ఉన్నారు.
* అనంతపురం జిల్లాలో మొత్తం 6,49,672 కార్డులకు 10 వేల మెట్రిక్ టన్నులు, శ్రీసత్యసాయి జిల్లాలో మొత్తం 5,58,621 కార్డులకు 8 వేల మెట్రిక్ టన్నుల పీడీఎస్ బియ్యం, ఇతర సరకులు పంపిణీ చేయాలి. ప్రస్తుతం ఉచిత బియ్యం పంపిణీ మాత్రమే జరుగుతోంది.
* ప్రతినెలా పంపిణీ చేసే బియ్యం గుర్తించి లబ్ధిదారులు ప్రశ్నిస్తే.. ఉచిత బియ్యం ఇస్తున్నాం కదా? అంటూ డీలర్లు దబాయిస్తున్నారు
పీడీఎస్ బియ్యంపై సమాచారమే లేదు
సాధారణంగా చౌకధరల దుకాణాల ద్వారా పంపిణీ చేసే బియ్యం, ఇతర సరకులు ఈ-పాస్ యంత్రం ద్వారా అందజేస్తారు. కార్డుదారుడు వేలి ముద్ర వేసి సరకులు తీసుకోవాలి. ఎంత మంది లబ్ధిదారులకు సరకులు పంపిణీ చేశారన్నది ఏ రోజుకు ఆరోజు ఆన్లైన్లో సమాచారం ఉంటుంది. అనంతపురం జిల్లాలో ఎన్ని కార్డులకు పంపిణీ చేశారన్న సమాచారం లేదు. శ్రీసత్యసాయి జిల్లాలో మాత్రం 42 శాతం పంపిణీ చేసినట్లు ఆ జిల్లా అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.
ఆపరేటర్ల రాజీనామాతో ఆటంకం
ఉమ్మడి జిల్లాలో ఇంటింటికీ రేషన్ సరకులు పంపిణీ చేసే వాహన ఆపరేటర్లు 84 మంది రాజీనామా చేశారు. దీంతో పంపిణీకి ఆటంకం ఏర్పడింది. అనంతపురం జిల్లాలో 40, శ్రీసత్యసాయి జిల్లాలో 44మంది ఆపరేటర్లు రాజీనామా చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. సమీప వాహన ఆపరేటర్లకు అదనపు బాధ్యతలు అప్పగించడంతో పంపిణీలో జాప్యం జరుగుతోంది.
గడువు పెంచాలని కోరుతున్నాం..
- శోభారాణి, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి
ఉచిత, పీడీఎస్ బియ్యం ఒకేసారి పంపిణీ చేయాలి. ఒకేసారి ఈ-పాస్లో నమోదు చేయడం కష్టంగా ఉంది. సమాచారం కూడా ఆన్లైన్లో కనిపించడం లేదు. ఈ నెల 15 నాటికి పంపిణీ పూర్తి కాదు. గడువు పెంచాలని ఉన్నతాధికారులను కోరుతున్నాం. ఆహార భద్రతా చట్టం పరిధిలోని కార్డుదారులకు ఉచిత బియ్యంతో పాటు, సాధారణ పీడీఎస్ బియ్యం, ఇతర సరకులు అందిస్తాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమాధికారులతో మాట్లాడి వాహన ఆపరేటర్ల నియామకానికి చర్యలు తీసుకుంటున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సాగు పడిపోయింది జగన్.. సాగనంపేందుకు ‘అనంత’ సిద్ధం
[ 18-04-2024]
అనంతపురం జిల్లా అంటేనే గుర్తొచ్చేది వేరుసెనగ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా పంట పండించేది అనంత జిల్లాలోనే.. ఇక్కడి రైతులకు ప్రధాన పంట వేరుసెనగ. ఇంతటి ప్రాధాన్యం ఉన్న పంట సాగు విస్తీర్ణం ఏటా తగ్గిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. -
నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన ఘట్టం నామినేషన్ల పర్వానికి గురువారం నుంచి తెరలేవనుంది. జిల్లాలో అనంత పార్లమెంటు (లోక్సభ), 8 శాసనసభా స్థానాలకు ఏకకాలంలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. -
లీజు పేరుతో ట్రాక్టర్లు మాయం ఘరానా ముఠా అరెస్టు
[ 18-04-2024]
ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో లీజు పేరిట ట్రాక్టర్లు తీసుకెళ్లి ఇతర ప్రాంతాల్లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్న ఘరానా ముఠా కేసును ఛేదించి కీలక సభ్యులను అరెస్టు చేసినట్లు శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి వెల్లడించారు. -
తెదేపా ప్రతినిధులపై వైకాపా శ్రేణుల దాడి
[ 18-04-2024]
ఉరవకొండలో తెదేపా ప్రతినిధులపై వైకాపా శ్రేణులు దాడికి పాల్పడ్డారు. తెదేపా బూత్ కన్వీనరు నాగభూషణ, నార్పలకు చెందిన అతని మిత్రుడు సంతోశ్తో కలిసి బుధవారం సాయంత్రం డ్రైవర్స్ కాలనీలో ఓటరు జాబితా పరిశీలనకు వెళ్లారు. -
19న చంద్రబాబు ఎన్నికల ప్రచార సభ
[ 18-04-2024]
ణేకల్లులో ఈనెల 19న సాయంత్రం తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో జరిగే ఎన్నికల ప్రచార సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. -
వైద్యం చేయకుండానే రోగుల పేరిట బిల్లులు!
[ 18-04-2024]
డోన్లోని ఒక ప్రైవేట్ వైద్యశాలకు గుత్తితోపాటు సమీప గ్రామాల నుంచి కొంతమంది పేదలను తీసుకెళ్లి ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేసినట్లు బిల్లులు చేసుకోవడం వివాదాస్పదమైంది. విచారణ చేపట్టిన అధికారులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. -
ఎన్నికల వ్యయ పరిశీలకుడి రాక
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం గురువారం మొదలు కానున్న నేపథ్యంలో ఎన్నికల వ్యయ పరిశీలకుడు నితిన్ అగర్వాల్ జిల్లాకు చేరుకున్నారు. -
నేత్రపర్వం.. సీతారాముల తిరుకల్యాణోత్సవం
[ 18-04-2024]
కసాపురంలోని శ్రీనెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో శ్రీరామనవమిని పురస్కరించుకుని సీతారాముల తిరుకల్యాణోత్సవం నేత్రపర్వంగా సాగింది. -
‘చెత్త’నూ తొలగించలేని ప్రభుత్వం
[ 18-04-2024]
-
మడకశిరలో వైకాపాకు షాక్
[ 18-04-2024]
వైకాపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఈర లక్కప్ప సొంత మండలంలోనే ఆ పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు మూకుమ్మడి రాజీనామాలు చేసి గట్టి షాక్ ఇచ్చారు. -
కల్యాణ వైభోగమే..
[ 18-04-2024]
పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో జానకీరాముడి కల్యాణోత్సవం వేలాది మంది భక్తజనం నడుమ వైభవపేతంగా జరిగింది. -
కోడ్ ఉన్నా ఆర్టీసీలో గుట్టుచప్పుడు కాకుండా నియామకం!
[ 18-04-2024]
ఎన్నికల కోడ్ వచ్చి సరిగ్గా నెలరోజులు అవుతున్నా ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థలో నియామకాలు మాత్రం గుట్టుచప్పుడు కాకుండా చేసేస్తున్నారు. -
అప్పు ఇచ్చా.. తిరిగి చెల్లించండి!
[ 18-04-2024]
మొన్నటివరకు కళ్యాణదుర్గంలో అధికారం వెలగబెట్టిన మహిళా ప్రజాప్రతినిధి ఐదేళ్లపాటు ధనార్జనే ధ్యేయంగా పనిచేశారు. డబ్బుల కోసం సొంతపార్టీ నాయకుల్ని సైతం వేధించారు. -
ధర్మవరంలో కూటమి జోరు
[ 18-04-2024]
ధర్మవరంలో రాజకీయ గాలి వేగంగా మారుతోంది. మొన్నటివరకు కూటమి, వైకాపా మధ్య పోటాపోటీగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయిందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. -
నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కీలక ఘట్టం నామపత్రం స్వీకరణ గురువారం నుంచి ప్రారంభంకానుంది. శ్రీసత్యసాయి జిల్లాలోని ఆరు అసెంబ్లీ, ఒక లోక్సభ స్థానాలకు నామపత్రాల స్వీకరణ, ఎన్నికల నోటిఫికేషన్ నేడు వెలువడనుంది. -
నేడు బండారు శ్రావణిశ్రీ నామినేషన్
[ 18-04-2024]
శింగనమల అసెంబ్లీ నియోజకవర్గానికి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ గురువారం నామపత్రాలు దాఖలు చేస్తున్నట్లు ఆ పార్టీ మండల కన్వీనర్ ఆదినారాయణ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
రాహుల్ స్పూన్ ఫీడింగ్ కిడ్.. సురక్షిత స్థానాలనే ఎంచుకుంటున్నారు: ఆజాద్
-
ఎన్కౌంటర్ల ‘లక్ష్మణ్’.. మావోయిస్టులకు సింగం
-
మిస్టర్.. కామెంట్ చేసేముందు మాటలు జాగ్రత్త: నటుడికి నభా నటేశ్ రిప్లై
-
గూగుల్లో మరోసారి ఉద్యోగుల తొలగింపు.. తోషిబాలోనూ 5,000 మంది!
-
ఆ లక్ష్యంతోనే బరిలోకి దిగాం : రిషభ్ పంత్
-
సాఫ్ట్వేర్ ఉద్యోగి ఫిర్యాదు.. కేసీఆర్ అన్న కుమారుడిపై మరో కేసు