logo

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృత్యువాత

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందిన ఘటన గార్లదిన్నె మండలంలోని గుడ్డాలపల్లి సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. అనంతపురం నుంచి కల్లూరు

Published : 13 Aug 2022 04:41 IST

ప్రమాదానికి కారణమైన కారు

గార్లదిన్నె, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందిన ఘటన గార్లదిన్నె మండలంలోని గుడ్డాలపల్లి సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. అనంతపురం నుంచి కల్లూరు వైపు వెళ్తున్న కారు డివైడరును ఢీకొని అవతలి రోడ్డులో ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. దీంతో ద్విచక్రవాహనంపై వెళుతున్న ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడిని 108 వాహనంలో అనంతపురం ఆసుపత్రికి తరలించగా.. అక్కడ మృతిచెందాడు. సంఘటన స్థలంలో ఉన్న ఆర్సీ ఆధారంగా ఒకరు కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా జిల్లా మొలకాలపల్లికి చెందిన భీమప్ప (35), హడెరిగికి చెందిన మోనప్ప (20)గా గుర్తించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని