స్వాతంత్య్ర సమరానికి ఊతం.. గ్రంథాలయం
సాంకేతికత అందుబాటులోకి రాని కాలంలో ప్రాపంచిక జ్ఞానం తెలుసుకోవడానికి పుస్తకాలు, పత్రికలే ఏకైక మార్గం. స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో వాటిని కొని చదివే పరిస్థితి అందరికీ లేదు. అందుకే ఉద్యమ నాయకులు గ్రంథాలయాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. యువతకు చదువు, జ్ఞానాన్ని అందించారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో గ్రంథాలయోద్యమం పెద్దఎత్తున సాగింది. స్థానికంగా గ్రంథాలయాల స్థాపన వయోజన విద్యకు
1883లోనే అనంతలో ఏర్పాటు
ఈనాడు డిజిటల్, అనంతపురం, న్యూస్టుడే, ధర్మవరం
సాంకేతికత అందుబాటులోకి రాని కాలంలో ప్రాపంచిక జ్ఞానం తెలుసుకోవడానికి పుస్తకాలు, పత్రికలే ఏకైక మార్గం. స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో వాటిని కొని చదివే పరిస్థితి అందరికీ లేదు. అందుకే ఉద్యమ నాయకులు గ్రంథాలయాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. యువతకు చదువు, జ్ఞానాన్ని అందించారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో గ్రంథాలయోద్యమం పెద్దఎత్తున సాగింది. స్థానికంగా గ్రంథాలయాల స్థాపన వయోజన విద్యకు ప్రాణాధారమైంది. యువతను స్వాతంత్య్ర ఉద్యమం వైపు నడిపించడానికి కీలకపాత్ర పోషించింది. అక్కడ లభ్యమయ్యే పుస్తకాలు, జాతీయ నాయకుల రచనలు ప్రజల్లో స్వాతంత్య్ర కాంక్షను రగిలించాయి. ప్రజల్ని ఉద్యమం వైపు కార్యోన్ముఖుల్ని చేశాయి.
మొట్టమొదటి సొంత భవనం
స్వాతంత్య్రం అనంతరం 1952 ఏప్రిల్ 2న పప్పూరు రామాచార్యులు తన భవనంలోని రెండు గదుల్లో జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని ప్రారంభించారు. జి.వెంకటస్వామిని ప్రథమ గ్రంథపాలకుడిగా నియమించారు. రామాచార్యులు ఛైర్మన్గా ఎన్నికైన తర్వాత దానికి సొంత భవనం ఉండాలని నిర్ణయించారు. జిల్లా మ్యూజియం భవనం ఖాళీగా, నిరుపయోగంగా ఉండటంతో అందులో ఏర్పాటు చేయాలనుకున్నారు. జిల్లా కలెక్టరును సంప్రదించి ఆ భవనాన్ని మ్యూజియం అథారిటీస్ నుంచి కొనడమే కాకుండా ప్రత్యేక విరాళం కూడా పొందారు. అలా రాష్ట్రంలోనే మొట్టమొదటగా కేంద్ర గ్రంథాలయానికి సొంత భవనం కలిగిన ఘనత అనంతపురానికి దక్కింది.
అనంతపురంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయం
ధర్మవరంలో..
ధర్మవరంలోని ఎడ్వర్డు రీడింగ్ రూమ్
మొట్టమొదటగా ధర్మవరంలో ఎడ్వర్డు కారొనేషన్ పేరుతో 1893లోనే పూర్తిస్థాయి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. ఉన్నత ప్రామాణిక గ్రంథాలతోపాటు అన్ని రకాల దినపత్రికలను అందుబాటులో ఉంచారు. సువిశాల మైదానంలో భవనంతోపాటు కళాజ్యోతి పేరుతో నాటక కళా సంస్థ, క్రీడా ప్రాంగణం, ఉపన్యాస మందిరాన్ని నెలకొల్పారు. ఇది నేటికీ కొనసాగడం విశేషం. ధర్మవరంలో 1915లో శిరిపి ఆంజనేయులు, రామానందుల వెంకటేశయ్య ఆధ్వర్యంలో శ్రీక్రియాశక్తి ఒడయార్ పేరుతో మరొకటి స్థాపించారు. 1960లో దీన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ స్వాధీనం చేసుకుంది. కోటలో బ్రాహ్మణ సమాజం ప్రతినిధులు 1921లో శ్రీసరస్వతీ నిలయం పేరుతో ఇంకొకటి నెలకొల్పారు. నిర్వహణ భారం భరించలేక కొంతకాలానికి దీన్ని ఎడ్వర్డు రీడింగ్ రూమ్ వారికి స్వాధీనం చేశారు. అప్పటినుంచి సంయుక్తంగా ఎడ్వర్డు కారొనేషన్ రీడింగ్ రూమ్ అండ్ సరస్వతీ నిలయం అనే పేరు స్థిరపడింది.
1883లోనే రీడింగ్ రూమ్
జిల్లాకు చెందిన సమరయోధులు పత్రికలు నడపడంతోపాటు గ్రంథాలయాలను ఏర్పాటు చేసి ప్రజల్ని చైతన్యం చేశారు. అనాటి అధికారులు, కొందరు బ్రిటీష్ పాలకులు కూడా వాటిని నెలకొల్పారు. అనంతపురంలో 1883లోనే మొట్టమొదటగా రీడింగ్ రూమ్ను స్థాపించారు. 1884లో పెనుకొండ కేంద్రంగా న్యూస్పేపర్ క్లబ్ వెలిసింది. ప్రారంభ దశలో గ్రంథాలతో నిమిత్తం లేకుండా దిన, వార, మాస పత్రికలతో దీన్ని ఏర్పాటు చేశారు. 1883 నుంచి 1900 వరకు హిందూపురం, గుత్తి, తాడిపత్రి, ధర్మవరం, కంబదూరు, మడకశిర, రాయదుర్గం ప్రాంతాల్లో పఠన మందిరాలు, న్యూస్ పేపర్ క్లబ్లు వెలిశాయి. వీటిని వివిధ స్వచ్ఛంద సంస్థలు ప్రజల నుంచి సేకరించిన విరాళాలతో నిర్వహించాయి.
రపాలికల ఆధ్వర్యంలో..
పురపాలక సంస్థలు అవసరమైన ప్రోత్సాహం ఇచ్చేవి. స్వయంగా పట్టణాల్లో విజ్ఞాన భాండాగారాలను ఏర్పాటు చేశాయి. హిందూపురం పురపాలకసంస్థ అప్పటి ప్రైవేటు లైబ్రరీని 1929లో స్వాధీనం చేసుకుని నిర్వహించింది. 1942లో మరొకటి కొత్తగా నెలకొల్పారు. తాడిపత్రి పురపాలకసంస్థ 1923లో ‘ప్రిన్స్ ఆఫ్ వేల్స్’ పఠన మందిరానికి గ్రంథాల కొనుగోలు నిమిత్తం రూ.100 గ్రాంటు మంజూరు చేసింది. 1938లో ఉచిత పఠనాలయం, గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసింది. అనంత మున్సిపాలిటీ కూడా 1947లో రెండు పఠన మందిరాలు, పుస్తకాలయాలను ఏర్పాటు చేసింది. గుంతకల్లులో రెండు ఏర్పాటు చేసి, అందులో ఒకటి చిన్నారుల కోసం ప్రత్యేకంగా నిర్వహించింది. అనంతపురం జిల్లా బోర్డు ప్రత్యేకంగా నిర్వహించేది. 1944లో జిల్లాబోర్డు తరఫున జిల్లాలోని అన్ని ప్రాథమిక, ఉన్నత పాఠశాలలకు ఉచితంగా గ్రంథాలు, సాంకేతిక పరికరాలను సరఫరా చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏడో రోజు జోరుగా నామినేషన్లు
[ 25-04-2024]
ప్రధాన పార్టీలైన తెదేపా, కాంగ్రెస్, వైకాపా, బీఎస్పీ తదితర పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు బుధవారం జోరుగా నామినేషన్ వేశారు. -
విధేయతకు తెదేపా పట్టం
[ 25-04-2024]
అనంతపురం జిల్లా తెదేపా అధ్యక్షుడిగా జి.వెంకట శివుడు యాదవ్ నియమించారు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. -
నిర్మించలేదు.. నిర్వహణ చేతకాదు
[ 25-04-2024]
కల్లబొల్లి మాటలు చెప్పడం తప్ప జగన్ ప్రభుత్వం ఈ ఐదేళ్లలో రైతులకు ఉపయోగపడే పని ఒక్కటీ చేయలేదు. తాను నిర్మించలేదు.. -
అనంత నగరం.. పసుపుమయం
[ 25-04-2024]
అనంతపురం అర్బన్ తెదేపా అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ నామినేషన్ సందర్భంగా బుధవారం అనంతపురం అర్బన్ క్యాంపు కార్యాలయానికి ఉదయం 8 గంటలకే -
వంతెన నిర్మాణాన్ని విస్మరించిన జగన్ సర్కార్
[ 25-04-2024]
వైకాపా పాలనలో భూతద్దం పెట్టి వెతికినా అభివృద్ధి కనిపించదు. తెదేపా హయాంలో తలపెట్టిన పనుల్ని ఐదేళ్లుగా జగన్ ప్రభుత్వం పక్కనపెట్టేసింది. ఉరవకొండ మండలం కైకుంట్ల నుంచి వై.రాంపురం మార్గంలో హంద్రీనీవా -
వైకాపా అసమర్థ అభ్యర్థిని ఓడిస్తేనే అభివృద్ధి: కేశవ్
[ 25-04-2024]
ఉరవకొండ, విడపనకల్లు, వజ్రకరూరు, బెళుగుప్ప, న్యూస్టుడే: వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి అసమర్థుడని, ఆయన్ను ఈ ఎన్నికల్లో ఓడిస్తేనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యం అవుతుందని తెదేపా అభ్యర్థి, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఉద్ఘాటించారు. -
ఐదేళ్ల పాలన చూశాం.. మళ్లీ తప్పు చేయొద్దు
[ 25-04-2024]
పేరూరు డ్యాంకు నీరు తెచ్చాం, బంగారు గనులను తెరిపించి ఉద్యోగాలు కల్పించాం.. అంటూ ప్రకాశ్రెడ్డి అన్ని అబద్ధాలే చెబుతారని మాజీ మంత్రి పరిటాల సునీత ధ్వజమెత్తారు. -
రాయదుర్గం సర్వతోముఖాభివృద్ధికి కృషి : కాలవ
[ 25-04-2024]
రాయదుర్గం సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తానని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కాలవ శ్రీనివాసులు అన్నారు. బుధవారం మధ్యాహ్నం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. -
పెద్దారెడ్డి నామినేషన్.. అంతా పరేషాన్
[ 25-04-2024]
తాడిపత్రి వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి బుధవారం నామినేషన్ వేసేందుకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ప్రధాన రహదారి సీబీ రోడ్డును రెండువైపులా బ్లాక్ చేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. -
ఏడో రోజు 54 నామినేషన్ల దాఖలు
[ 25-04-2024]
జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఏడో రోజు హిందూపురం పార్లమెంటు స్థానానికి ఏడు, ఏడు అసెంబ్లీ స్థానాలకు 47 మొత్తం 54 నామినేషన్లు దాఖలు చేశారు. -
కొండలు కరిగించి.. నిధులు కొల్లగొట్టి
[ 25-04-2024]
అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైకాపా నాయకులు మట్టి వ్యాపారుల అవతారమెత్తి కొండలను కరిగించేశారు. కదిరి ప్రాంతంలోని -
నీరు కుప్పం వెళ్లింది.. చెరువు ఎండింది
[ 25-04-2024]
వైకాపా ప్రభుత్వం హంద్రీనీవా జలాలను కుప్పం తీసుకెళ్లడం ఫలితంగా ముదిగుబ్బ మండలంలోని దొరిగల్లు చెరువు ఎండింది. ఈ చెరువు కింద ఖరీఫ్లో సుమారు 500, రబీలో 200 ఎకరాల వరకు ఆయకట్టు సాగవుతోంది. -
పేరుకే పెద్దాసుపత్రి... ఓపీ సేవలు నామమాత్రం
[ 25-04-2024]
ఉరవకొండ 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీ సేవలు నామమాత్రంగా అందుతున్నాయి. దాంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ