పురస్కారాలకు 353 మంది ఎంపిక
స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా ప్రదానం చేసే ఉత్తమ సేవా అవార్డుల జాబితా వెల్లడైంది. విధి నిర్వహణలో ఉత్తమ పనితీరు కనబరచిన మొత్తం 353 మంది పురస్కారాలకు ఎంపిక అయ్యారు. ఎంపిక జాబితాను ఆదివారం కలెక్టర్ నాగలక్ష్మి ఆమోదం తెలిపారు. 49 మంది జిల్లా అధికారులు, మిగతా
జిల్లా సచివాలయం, న్యూస్టుడే: స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా ప్రదానం చేసే ఉత్తమ సేవా అవార్డుల జాబితా వెల్లడైంది. విధి నిర్వహణలో ఉత్తమ పనితీరు కనబరచిన మొత్తం 353 మంది పురస్కారాలకు ఎంపిక అయ్యారు. ఎంపిక జాబితాను ఆదివారం కలెక్టర్ నాగలక్ష్మి ఆమోదం తెలిపారు. 49 మంది జిల్లా అధికారులు, మిగతా వారు వివిధ కేడర్లల్లో పని చేస్తున్న డివిజన్, మండల అధికారులు, ఉద్యోగులు ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది జనవరి 26న గణతంత్ర దినోత్సవం రోజున 707 మందికి పురస్కారాలు అందజేశారు. జిల్లా విభజన తర్వాత ఆ సంఖ్య సగానికి తగ్గినా ఎక్కువ మందిని ఎంపిక చేసినట్లే. ఎప్పటిలాగే పోలీసు, రెవెన్యూ శాఖలో పని చేసే వారికే ఎక్కువ పురస్కారాలు అందనున్నాయి. రెవెన్యూ శాఖలో 29 మంది ఉన్నారు. ఆర్డీ మున్సిపల్ శాఖ పరిధిలో 19 మంది, డీఎంహెచ్ఓ, డీఆర్డీఏ పరిధిలో 12 మంది చొప్పున ఎంపిక చేశారు. విద్యుత్తు శాఖలో తొమ్మిది, జడ్పీ, హౌసింగ్, బీసీ సంక్షేమంలో ఆరుగురు ప్రకారం ఉన్నారు. మిగతా శాఖల్లో ఒకటి నుంచి ఐదు మంది లోపు ఉన్నారు. ఈసారి ప్రప్రథమంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగులు 41 మందిని పురస్కారాలకు ఎంపిక చేశారు.
పోలీసుశాఖలో...
అనంత నేరవార్తలు, న్యూస్టుడే: 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీసు శాఖలో ఉత్తమ సేవలు అందించిన పలువురు అధికారులు, సిబ్బంది ప్రశంసాపత్రాలకు ఎంపికయ్యారు. పోలీసు శాఖలో మొత్తం 72 మంది, అగ్నిమాపక శాఖ నుంచి నలుగురు, ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ నుంచి 22 మంది ఎంపికయ్యారు. గుంతకల్లు డీఎస్పీ నర్సింగప్ప, తాడిపత్రి డీఎస్పీ చైతన్య, దిశ డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులు, సీసీఎస్ డీఎస్పీ మహబూబ్బాషా, ట్రాఫిక్ డీఎస్పీ ప్రసాదరెడ్డి పురస్కారం అందుకోనున్నారు. సీఐలు కత్తి శ్రీనివాసులు, జాకీర్హుస్సేన్, బి.శేఖర్, యుగంధర్, వెంకటరమణ, ఎస్సైలు శ్రీకాంత్, పి.వెంకటేశ్వర్లు, గురుప్రసాద్రెడ్డి, ధరణిబాబు, యేషేంద్ర కుమార్ ఎంపికయ్యారు. అగ్నిమాపక శాఖలో అనంతపురం ఏడీఎఫ్వో అశ్వర్థ, ఎస్ఎఫ్వో మోహన్బాబుతో పాటు సిబ్బంది ప్రశంసకు అర్హత సాధించారు.
పైరవీలకే సిఫారసు!
ఎప్పటి మాదిరిగానే ఈసారి అధికారులకు నచ్చిన వారికే అవార్డులకు సిఫారసు చేసినట్లు తేటతెల్లమవుతోంది. గతంలో అనేక సార్లు స్వాతంత్య్ర, గణతంత్ర వేడుకల్లో పురస్కారాలు పొందిన వారి పేర్లు కూడా ఈసారి ఉన్నాయి. పైరవీ చేసిన ఉద్యోగులకే జిల్లా అధికారులు సిఫార్సు చేసినట్లు స్పష్టమవుతోంది. నెల క్రితం బదిలీపై వచ్చిన వారు సైతం అవార్డుల జాబితాలో ఉన్నారు. ఉత్తమ పనితీరు కనబరిచిన చాలా మందికి అన్యాయం జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. నచ్చిన వారినే ఎంపిక చేయొద్దని కలెక్టర్ నాగలక్ష్మి స్వయంగా అధికారుల సమీక్షలో ఆదేశించినా ఫలితం లేదని తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోండి
[ 24-04-2024]
ఎన్నికల విధులకు నియామకం పొందిన ఉద్యోగ, ఉపాధ్యాయులందరూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించు కోవాలని కలెక్టర్ డాక్టర్ వినోద్కుమార్ పేర్కొన్నారు. -
ఇసుకంతైనా భయం లేదు.. దోపిడీ ఆగదు
[ 24-04-2024]
ఆస్తిని పంచుకున్నట్లు.. ప్రకృతి వనరులైన నదులు, వాగులు, వంకలను వైకాపా నాయకులు పంచేసుకున్నారు. జగన్ అండతో నదుల్ని వాటాలేసుకుని మరీ అక్రమ రవాణా కొనసాగించారు. ఉమ్మడి అనంత జిల్లాలోని పెన్నా, చిత్రావతి, వేదవతి, జయమంగళి తదితర నదుల్ని నామరూపాల్లేకుండా చేశారు. -
నమ్మండి.. జగనన్న కాలనీనే..
[ 24-04-2024]
వజ్రకరూరు మండలంలోని చాబాల, ధర్మపురి, గూళ్యపాళ్యం, కమలపాడు, పీసీప్యాపిలి గ్రామాల్లోని జగనన్న కాలనీలు ముళ్లపొదలతో నిండిపోయాయి. గడేహోతూరులో 73 ఇళ్లు, వజ్రకరూరులో 578 పట్టాలకుగాను 121, కొనకొండ్లలో 830కుపైగా పట్టాలు పంపిణీ చేస్తే 181 ఇళ్లు పూర్తయ్యాయి. -
ఒకే రోజు యాభై నామినేషన్లు
[ 24-04-2024]
జిల్లాలో పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. మంగళవారం ఒక్కరోజే అసెంబ్లీ స్థానాలకు ఏకంగా యాభై నామినేషన్లు దాఖలు కావడం విశేషం. పార్లమెంటు స్థానానికి రెండు వచ్చాయి. -
దేవుడి భూమినీ గుల్ల చేశారు
[ 24-04-2024]
జిల్లాలోని పెద్దవడుగూరుకు కూతవేటు దూరంలో ఉన్న నెలగొండరాయుడుస్వామి ఆలయానికి సంబంధించిన సర్వే సంఖ్య 777-ఎలోని 21.04 ఎకరాల ఎర్రనేల భూముల్లో వైకాపా నేతల కన్ను పడింది. -
రైల్వే స్టేషన్లలో తక్కువ ధరకే భోజనం
[ 24-04-2024]
రైలులో ప్రయాణించే ప్రయాణికులకు కొన్ని రైల్వే స్టేషన్లలో తక్కువ ధరకు భోజనాన్ని అందించే కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించామని సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ మనోజ్ తెలిపారు. -
జగన్ .. ఇంకా పరిహారం ఇవ్వలే
[ 24-04-2024]
భైరవానితిప్ప ప్రాజెక్టుకు సంబంధించి రూ.542కోట్లు వ్యయం అవుతుంది. ఇందులో తొలుత రైతుల నుంచి భూమిని సేకరిస్తేనే కాలువ పనులకు అడుగులు ముందుకు పడతాయి. 1,406 ఎకరాల భూమిని సేకరించడానికి పరిహారంగా రూ.208కోట్లు మంజూరు చేస్తున్నాను. -
ఉద్యాన రైతుల ఊపిరితీస్తున్న జగన్!
[ 24-04-2024]
రాష్ట్రంలోనే ఉమ్మడి అనంతపురం జిల్లా ఉద్యాన పంటలకు ప్రసిద్ధి. ప్రధానంగా చీనీ, దానిమ్మ సాగు ఎక్కువ. గత తెదేపా హయాంలో ఆయా పంటల సాగుకు పెద్దఎత్తున ప్రోత్సహించారు. -
విజయీభవ..
[ 24-04-2024]
ఉరవకొండ, రాప్తాడు నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించాలని తెదేపా అధినేత చంద్రబాబు సూచించారు. మంగళవారం విజయనగరం జిల్లా ఎస్.కోట పర్యటనలో ఉన్న చంద్రబాబును పయ్యావుల కేశవ్, పరిటాల సునీత కలిశారు. -
చేపా..చేపా.. నువ్వెందుకు ఈదలేదు!
[ 24-04-2024]
వైకాపా ప్రభుత్వంలో అన్నదాతలకే కాదు.. చేపల పెంపకానికీ నీటి కష్టాలు వెంటాడుతున్నాయి. గతేడాదే మత్స్య క్షేత్రాల్లో చేపల పిల్లల ఉత్పత్తి చేపట్టారు. ఇప్పటికే ప్రాజెక్టులు, చెరువుల్లో చేపల పెంపకం చేపట్టాల్సి ఉంది. -
ఉపాధి హామీ పనుల్లో అక్రమాలు
[ 24-04-2024]
దయ్యాలకుంటపల్లి గ్రామంలో ఉపాధి హామీ పనుల్లో అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. గ్రామ శివారులో గువ్వలగొండి కొండలో ఫాం పాండు పనులు చేస్తున్నారు. -
కోడ్ ఉల్లంఘిస్తున్నా.. చర్యలు సున్నా
[ 24-04-2024]
ఉద్యోగులు యథేచ్ఛగా వైకాపా ప్రచారంలో పాల్గొంటున్నా అధికారులకు కన్పించడం లేదు. కోడ్ ఉల్లంఘించే వారిపై పరిశీలించి సొంతంగా చర్యలు తీసుకోవడానికి భయపడే పరిస్థితి ఉంది. -
జగన్ పాలనలో .. ఉద్యానాలు కనుమరుగు
[ 24-04-2024]
జగన్ ప్రభుత్వంలో పట్టణవాసికి ఆహ్లాదాన్ని అందించాల్సిన ఉద్యానవనాలు ఉనికిని కోల్పోయాయి. వీటిని సంరక్షించాల్సిన పురపాలికలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. కొత్త పార్కుల ఏర్పాటును గాలికి వదిలేశారు. -
తెదేపాను గెలిపిద్దాం.. భవిష్యత్తును బాగుచేద్దాం
[ 24-04-2024]
సైకిల్ గుర్తుకు ఓటేసి తెదేపాను గెలిపిద్దాం.. భవిష్యత్తు తరాలను బాగుచేద్దామని తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని విజయనగర్ కాలనీలో మంగళలవారం ఆయన పర్యటించారు. -
ధర్మవరంలో కూటమి సందడి
[ 24-04-2024]
భాజపా ఎమ్మెల్యే అభ్యర్థి సత్యకుమార్ నామినేషన్ కార్యక్రమం మంగళవారం అట్టహాసంగా సాగింది. తెదేపా, భాజపా, జనసేన కార్యకర్తలు, నాయకులు భారీ సంఖ్యలో హాజరు కావడంతో పట్టణం కాషాయం, పసుపుమయంగా మారిపోయింది. -
కొండను తవ్వి.. వంకలు పూడ్చి
[ 24-04-2024]
వైకాపా నాయకుల అండతో కొందరు కొండలను మాయం చేస్తున్నారు. మట్టిని ఇష్టానుసారంగా తవ్వి ఆక్రమణలకు తెగబడుతున్నారు. కనగానపల్లి మండలం దాదులూరు రెవెన్యూ పంచాయతీలో ఉన్న కుర్లపల్లి గ్రామ సమీపంలో ఓ రియల్టర్ (భూ వ్యాపారస్థుడు) కొన్నేళ్ల క్రితం భూముల్ని కొనుగోలు చేశాడు. -
లేపాక్షికి యునెస్కో గుర్తింపు తెస్తాం
[ 24-04-2024]
తెదేపా ప్రభుత్వంలో పర్యాటక ఉత్సవాలను నిర్వహించి లేపాక్షి ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో మారుమోగేలా చేశామని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పేర్కొన్నారు. అటువంటి లేపాక్షిని ప్రస్తుత ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
-
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..