logo

ద్విచక్ర వాహనాలు ఢీకొని ఒకరి మృతి

రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతిచెందగా మరో ఇద్దరు గాయపడిన ఘటన ఆదివారం నల్లమాడ మండలం పులగంపల్లి క్రాస్‌ వద్ద చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. గోరంట్ల మండలం ముత్తరాయిని తండాకు చెందిన శంకర్‌నాయక్‌ (30), భార్య గీతాబాయి, కుమార్తె మోక్షితతో కలిసి ద్విచక్రవాహనంపై

Published : 15 Aug 2022 05:22 IST

నల్లమాడ న్యూస్‌టుడే: రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతిచెందగా మరో ఇద్దరు గాయపడిన ఘటన ఆదివారం నల్లమాడ మండలం పులగంపల్లి క్రాస్‌ వద్ద చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. గోరంట్ల మండలం ముత్తరాయిని తండాకు చెందిన శంకర్‌నాయక్‌ (30), భార్య గీతాబాయి, కుమార్తె మోక్షితతో కలిసి ద్విచక్రవాహనంపై కదిరికి వెళ్తున్నారు. దారిలో పులగంపల్లి క్రాస్‌ వద్దకు రాగానే కదిరి వైపు నుంచి ఎదురుగా వస్తున్న మరో ద్విచక్రవాహనం పరస్పరం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో శంకర్‌ నాయక్‌ తలకు బలమైన గాయం కాగా గీతాబాయి ముఖం, చేతులు, తలకు గాయాలయ్యాయి. మరో ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న అమడగూరు మండలం మహమ్మదాబాద్‌కు చెందిన అంజినప్ప కాలు విరిగి తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందిన వెంటనే ఎస్‌ఐ వలీబాషా తమ సిబ్బందితో ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను 108లో కదిరి ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని