logo

సీఐపై విచారణకు ఆదేశాలు

హిందూపురం మండల పోలీసుస్టేషన్‌ సీఐ జి.టి.నాయుడుపై విచారణ జరిపి అతనిపై తీసుకొన్న చర్యలపై నివేదిక ఇవ్వాలని జాతీయ బాలల హక్కుల సంఘం జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. ఈ మేరకు నోటీసును కలెక్టర్‌తో పాటు ఫిర్యాదు చేసిన గ్రామీణ మండలం

Published : 17 Aug 2022 03:54 IST

హిందూపురం పట్టణం, న్యూస్‌టుడే: హిందూపురం మండల పోలీసుస్టేషన్‌ సీఐ జి.టి.నాయుడుపై విచారణ జరిపి అతనిపై తీసుకొన్న చర్యలపై నివేదిక ఇవ్వాలని జాతీయ బాలల హక్కుల సంఘం జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. ఈ మేరకు నోటీసును కలెక్టర్‌తో పాటు ఫిర్యాదు చేసిన గ్రామీణ మండలం రామచంద్రాపురానికి చెందిన బాలురికి పంపారు. గతంలో గ్రామానికి చెందిన బాలురను స్టేషన్‌కు పిలిపించి సీఐ మందలించిన విషయం వివాదస్పదంగా మారింది. దీనిపై ఆధారాలతో సహా బాలుర తల్లిదండ్రులు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంఘానికి ఫిర్యాదు చేశారు. ఆ వివరాలను కలెక్టర్‌కు పంపి, 20 రోజుల్లో విచారణ పూర్తి చేయడంతో పాటు తీసుకొన్న చర్యల నివేదికను తమకు పంపాలని ఆదేశించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని