పట్టు రైతుకు ప్రోత్సాహం లేదాయె
మల్బరీ సాగుపై రైతులకు ఆసక్తి ఉన్నా రాయితీలు అందక సమస్యలు ఎదుర్కొంటున్నారు. పట్టు రైతులపై ప్రభుత్వం ఉదాశీనంగా వ్యవహరిస్తోంది. జిల్లాలో రెండేళ్లుగా పట్టుగూళ్ల మార్కెట్లో అందించాల్సిన ప్రోత్సాహక బకాయిలను ప్రభుత్వం చెల్లించలేదు.
రూ.10.30 కోట్ల బకాయి
రైతులు పండించిన పట్టుగూళ్లు
మడకశిర, హిందూపురం అర్బన్, న్యూస్టుడే: మల్బరీ సాగుపై రైతులకు ఆసక్తి ఉన్నా రాయితీలు అందక సమస్యలు ఎదుర్కొంటున్నారు. పట్టు రైతులపై ప్రభుత్వం ఉదాశీనంగా వ్యవహరిస్తోంది. జిల్లాలో రెండేళ్లుగా పట్టుగూళ్ల మార్కెట్లో అందించాల్సిన ప్రోత్సాహక బకాయిలను ప్రభుత్వం చెల్లించలేదు. జిల్లా వ్యాప్తంగా 32 వేల ఎకరాలకు పైగా మల్బరీ పంట సాగవుతోంది. జిల్లాలో అత్యధికంగా బైవోల్టిన్, సీబీ రకం పట్టుగూళ్ల పెంపకం చేపడుతున్నారు. రైతులు ఉత్పత్తి చేసిన బైవోల్టిన్ పట్టుగూళ్లకు జిల్లాలోని మార్కెట్లో విక్రయిస్తే కిలోకు రూ.50 అదనంగా ప్రోత్సాహకం అందిస్తుంది. దీంతో రైతులు కర్ణాటక రాష్ట్రం వెళ్లకుండా హిందూపురం మార్కెట్కు వెళ్తున్నారు. గత రెండేళ్లుగా ప్రోత్సాహకం ఇవ్వకపోవడంతో ఒక్కో రైతుకు దాదాపు రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు బకాయిలు రావాల్సి ఉంది. ఇప్పటికీ దీనిపై అధికారులు సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు.
* హిందూపురం మార్కెట్లో గత రెండేళ్ల నుంచి దాదాపు 3,538 టన్నుల పట్టుగూళ్ల విక్రయం జరిగింది. రైతులకు ప్రోత్సాహకం అందకపోవడంతో ఏడాదిగా కర్ణాటక రాష్ట్రం శిడ్లఘట్ట, రాంనగర్ మార్కెట్కు తరలిస్తున్నారని పట్టు రీలర్లు పేర్కొన్నారు. గతంలో 3 నెలల్లో ప్రోత్సాహకం రైతుల ఖాతాల్లో జమ అయ్యేది. ప్రస్తుతం ఏళ్లుగా బకాయి ఉండటంతో ఇబ్బందిగా మారింది.
* 2019 జులై నుంచి 2020 వరకు 9,428 మంది రైతులు 1,201 టన్నుల గూళ్లు మార్కెట్కు తీసుకెళ్లగా వారికి రూ.4.50 కోట్లు, 2021 ఏప్రిల్ నుంచి 2022 మార్చి వరకు 8 వేల మంది రైతులు 1,276 టన్నులు విక్రయిస్తే వారికి రూ.5.80 కోట్లు ప్రోత్సాహక బకాయిలు ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది.
* మార్కెట్లోని పట్టు రీలర్లకు ఇచ్చే ప్రోత్సాహకం కూడా 2020 సెప్టెంబర్ నుంచి ఇప్పటివరకు రూ.1.75 కోట్లు బకాయిలు రావాల్సి ఉంది. ఇందుకు పట్టు రీలర్లు మార్కెట్ బంద్ చేసి ఆందోళనలు కూడా చేశారు.
రూ.లక్షకు పైగా రావాలి
- నర్సేగౌడు, మల్బరీ రైతు, భక్తరహళ్లి
మల్బరీ రైతులకు కిలో బైవోల్టీన్ పట్టుగూళ్లకు అందించే రూ.50 ప్రోత్సాహకం గత 16 నెలలుగా అందించలేదు. నాకు దాదాపు రూ.1.20 లక్షల వరకు రావాల్సి ఉంది. గతంలో మార్కెట్లో గూళ్లు విక్రయించిన వెంటనే నగదు, ప్రోత్సాహకం ఖాతాలకు వేసేవారు. క్వింటాల్ గూళ్లకు రూ.5వేల ప్రోత్సాహకం ఇచ్చేవారు. ఈ మొత్తంతో కూలీల ఖర్చులు, పట్టుగూళ్లను మార్కెట్కు తరలించేందుకు రవాణాకు సరిపోయేది.
ఉన్నతాధికారులకు నివేదించాం
- సురేష్కుమార్, ఏడీ, పట్టుపరిశ్రమ శాఖ, హిందూపురం
రైతులకు రావాల్సిన ప్రోత్సాహకాల బకాయిలకు సంబంధించి నివేదికను ఇప్పటికే ఉన్నతాధికారులకు పంపించాం. మంజూరైన వెంటనే సంబంధిత రైతుల ఖాతాలకు జమ చేస్తాం. హిందూపురం మార్కెట్లో రైతులు విక్రయించిన పట్టుగూళ్లకు ప్రభుత్వం దాదాపు రూ.10.30 కోట్ల వరకు ప్రోత్సాహక బకాయిలు మంజూరు చేయాల్సి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాష్ట్రంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలుతోంది: వైఎస్ షర్మిల
[ 18-04-2024]
రాష్ట్రంలో లిక్కర్ మాఫియా నడుస్తోందని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. -
సాగు పడిపోయింది జగన్.. సాగనంపేందుకు ‘అనంత’ సిద్ధం
[ 18-04-2024]
అనంతపురం జిల్లా అంటేనే గుర్తొచ్చేది వేరుసెనగ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా పంట పండించేది అనంత జిల్లాలోనే.. ఇక్కడి రైతులకు ప్రధాన పంట వేరుసెనగ. ఇంతటి ప్రాధాన్యం ఉన్న పంట సాగు విస్తీర్ణం ఏటా తగ్గిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. -
నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన ఘట్టం నామినేషన్ల పర్వానికి గురువారం నుంచి తెరలేవనుంది. జిల్లాలో అనంత పార్లమెంటు (లోక్సభ), 8 శాసనసభా స్థానాలకు ఏకకాలంలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. -
లీజు పేరుతో ట్రాక్టర్లు మాయం ఘరానా ముఠా అరెస్టు
[ 18-04-2024]
ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో లీజు పేరిట ట్రాక్టర్లు తీసుకెళ్లి ఇతర ప్రాంతాల్లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్న ఘరానా ముఠా కేసును ఛేదించి కీలక సభ్యులను అరెస్టు చేసినట్లు శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి వెల్లడించారు. -
తెదేపా ప్రతినిధులపై వైకాపా శ్రేణుల దాడి
[ 18-04-2024]
ఉరవకొండలో తెదేపా ప్రతినిధులపై వైకాపా శ్రేణులు దాడికి పాల్పడ్డారు. తెదేపా బూత్ కన్వీనరు నాగభూషణ, నార్పలకు చెందిన అతని మిత్రుడు సంతోశ్తో కలిసి బుధవారం సాయంత్రం డ్రైవర్స్ కాలనీలో ఓటరు జాబితా పరిశీలనకు వెళ్లారు. -
19న చంద్రబాబు ఎన్నికల ప్రచార సభ
[ 18-04-2024]
ణేకల్లులో ఈనెల 19న సాయంత్రం తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో జరిగే ఎన్నికల ప్రచార సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. -
వైద్యం చేయకుండానే రోగుల పేరిట బిల్లులు!
[ 18-04-2024]
డోన్లోని ఒక ప్రైవేట్ వైద్యశాలకు గుత్తితోపాటు సమీప గ్రామాల నుంచి కొంతమంది పేదలను తీసుకెళ్లి ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేసినట్లు బిల్లులు చేసుకోవడం వివాదాస్పదమైంది. విచారణ చేపట్టిన అధికారులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. -
ఎన్నికల వ్యయ పరిశీలకుడి రాక
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం గురువారం మొదలు కానున్న నేపథ్యంలో ఎన్నికల వ్యయ పరిశీలకుడు నితిన్ అగర్వాల్ జిల్లాకు చేరుకున్నారు. -
నేత్రపర్వం.. సీతారాముల తిరుకల్యాణోత్సవం
[ 18-04-2024]
కసాపురంలోని శ్రీనెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో శ్రీరామనవమిని పురస్కరించుకుని సీతారాముల తిరుకల్యాణోత్సవం నేత్రపర్వంగా సాగింది. -
‘చెత్త’నూ తొలగించలేని ప్రభుత్వం
[ 18-04-2024]
-
మడకశిరలో వైకాపాకు షాక్
[ 18-04-2024]
వైకాపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఈర లక్కప్ప సొంత మండలంలోనే ఆ పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు మూకుమ్మడి రాజీనామాలు చేసి గట్టి షాక్ ఇచ్చారు. -
కల్యాణ వైభోగమే..
[ 18-04-2024]
పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో జానకీరాముడి కల్యాణోత్సవం వేలాది మంది భక్తజనం నడుమ వైభవపేతంగా జరిగింది. -
కోడ్ ఉన్నా ఆర్టీసీలో గుట్టుచప్పుడు కాకుండా నియామకం!
[ 18-04-2024]
ఎన్నికల కోడ్ వచ్చి సరిగ్గా నెలరోజులు అవుతున్నా ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థలో నియామకాలు మాత్రం గుట్టుచప్పుడు కాకుండా చేసేస్తున్నారు. -
అప్పు ఇచ్చా.. తిరిగి చెల్లించండి!
[ 18-04-2024]
మొన్నటివరకు కళ్యాణదుర్గంలో అధికారం వెలగబెట్టిన మహిళా ప్రజాప్రతినిధి ఐదేళ్లపాటు ధనార్జనే ధ్యేయంగా పనిచేశారు. డబ్బుల కోసం సొంతపార్టీ నాయకుల్ని సైతం వేధించారు. -
ధర్మవరంలో కూటమి జోరు
[ 18-04-2024]
ధర్మవరంలో రాజకీయ గాలి వేగంగా మారుతోంది. మొన్నటివరకు కూటమి, వైకాపా మధ్య పోటాపోటీగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయిందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. -
నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కీలక ఘట్టం నామపత్రం స్వీకరణ గురువారం నుంచి ప్రారంభంకానుంది. శ్రీసత్యసాయి జిల్లాలోని ఆరు అసెంబ్లీ, ఒక లోక్సభ స్థానాలకు నామపత్రాల స్వీకరణ, ఎన్నికల నోటిఫికేషన్ నేడు వెలువడనుంది. -
నేడు బండారు శ్రావణిశ్రీ నామినేషన్
[ 18-04-2024]
శింగనమల అసెంబ్లీ నియోజకవర్గానికి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ గురువారం నామపత్రాలు దాఖలు చేస్తున్నట్లు ఆ పార్టీ మండల కన్వీనర్ ఆదినారాయణ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కోహ్లీకి అరుదైన గౌరవం.. జైపుర్ మ్యూజియంలో మైనపు విగ్రహం
-
స్టార్ హీరోను కలిసిన రిషబ్ శెట్టి.. ‘కాంతార 2’ కోసమేనా..!
-
102 స్థానాలు.. 16 కోట్ల మంది ఓటర్లు.. తొలిదశ పోలింగ్కు సర్వం సిద్ధం
-
రుణం కోసం ‘చావు తెలివి’.. మృతదేహాన్ని బ్యాంకుకు తీసుకొచ్చి..!
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె