బాబ్బాబు.. ఎమ్మెల్యే ఎదుట సమస్యలు చెప్పకండి!
‘బాబ్బాబు.. ఎమ్మెల్యే గడప గడపకు మన ప్రభుత్వంలో పాల్గొనేందుకు గ్రామాలకు వస్తున్నారు.. ఏవైనా సమస్యలు ఉంటే నాకు చెప్పండి.. నేను పరిష్కరిస్తా. ఎమ్మెల్యే ముందు చెప్పొద్దు’ అంటూ చెన్నేకొత్తపల్లి మండలంలో అధికార పార్టీ నాయకుడు
ఇంటింటికి వెళ్లి బతిమాలుతున్న వైకాపా నాయకుడు
చెన్నేకొత్తపల్లి మండలంలో వెలుగులోకి..
ఈనాడు డిజిటల్, అనంతపురం: ‘బాబ్బాబు.. ఎమ్మెల్యే గడప గడపకు మన ప్రభుత్వంలో పాల్గొనేందుకు గ్రామాలకు వస్తున్నారు.. ఏవైనా సమస్యలు ఉంటే నాకు చెప్పండి.. నేను పరిష్కరిస్తా. ఎమ్మెల్యే ముందు చెప్పొద్దు’ అంటూ చెన్నేకొత్తపల్లి మండలంలో అధికార పార్టీ నాయకుడు ఒకరు గడప గడపకు వెళ్లి ప్రజలను బతిమాలుతున్న విషయం వెలుగు చూసింది. మండలంలోని ఓ గ్రామంలో త్వరలోనే ఎమ్మెల్యే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్నట్లు సమాచారం. ఎమ్మెల్యే ముందు ప్రజలు సమస్యలు చెబితే తాను చిన్నబోయే అవకాశం ఉందని పసిగట్టిన ఓ నేత తన అనుచరులతో కలసి ముందుగానే గడప గడపకు వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుని తనదైన శైలిలో పరిష్కారానికి హామీ ఇస్తున్నట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే సగం పంచాయతీ గ్రామాల్లో సదరు నాయకుడు ఎమ్మెల్యే కంటే ముందుగానే గడప గడపకు కార్యక్రమం పూర్తి చేసినట్లు తెలిసింది.
అసంతృప్తులను బుజ్జగిచేందుకు నేతన్న నేస్తం
సొంత పార్టీలోని అసంతృప్తులను బుజ్జగించేందుకు సదరు నాయకుడు నేతన్న నేస్తం జాబితాలో అధికారులపై ఒత్తిడితెచ్చి వారికి చోటు కల్పించినట్లు విశ్వసనీయ సమాచారం. ఆ గ్రామంలో దాదాపు 120 మందికి నేతన్న నేస్తం అర్హత జాబితాలో చోటు దక్కగా, అందులో సగానికిపైగా అనర్హత ఉన్నవారి పేర్లే ఉన్నాయని స్థానికులు చర్చించుకోవడం గమనార్హం. నేతన్న నేస్తం నగదును రెండు, మూడు రోజుల్లో ముఖ్యమంత్రి మీటనొక్కి లబ్ధిదారుల ఖాతాలకు జమచేసే అవకాశం ఉంది. అర్హత ఉన్నప్పటికీ తమకు జాబితాలో పేర్లు నమోదు చేయలేదని, అధికార అండ ఉన్నవారికి మాత్రమే దక్కిందని నిజమైన లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే వస్తే మీవాళ్లు సైతం సమస్యలు చెప్పకుండా చూడాలని, తనకు అనుకూలంగా ఉన్న కొందరు స్థానిక తెదేపా నాయకులతో వైకాపా నేత లోపాయికారి ఒప్పందం చేసుకున్నట్లు భోగట్టా. తెదేపా నాయకుల అనుయాయుల పేర్లు సైతం జాబితాలో చోటు దక్కించుకున్నట్లు తెలిసింది. అభివృద్ధి చేసి, ప్రభుత్వ సంక్షేమ ఫలాలను అర్హులకు అందించి మెప్పు పొందాలనేగాని ఇలా బతిమాలుకోవడమేంటని స్థానిక నాయకుడి తీరుపై మండల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాడు-నేడు జగన్మాయ
[ 19-04-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రగతి పనులను అటకెక్కించారు. నాడు-నేడు పథకం కింద బడులను ఎంపిక చేశారే తప్ప అభివృద్ధి పనులు పూర్తి చేయడానికి తగిన నిధులు కేటాయించడం లేదు. -
నామినేషన్ల పర్వం ఆరంభం
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల సమరం ఆరంభమైంది. కీలక ఘట్టమైన నామినేషన్ల పర్వం మొదలైంది. -
తండ్రి ఆశయాన్నీ నెరవేర్చలేని జగన్: షర్మిల
[ 19-04-2024]
‘‘హంద్రీనీవా పథకాన్ని పూర్తి చేసి అనంత జిల్లా రైతులకు లక్ష ఎకరాలకు సాగు నీరివ్వాలన్నది దివంగత సీఎం వైఎస్సార్ లక్ష్యం. -
నిర్లక్ష్యపు జాడలో.. నీరెరగని కాలువలు
[ 19-04-2024]
కాలువల్లో నీరు పారినపుడే వ్యవసాయం ఆశాజనకంగా ఉంటుంది. అనంతపురం జిల్లాలో వ్యవసాయానికి కాలువలే ఆయువుపట్టు. -
నేడు బాలకృష్ణ నామినేషన్ పత్రాల దాఖలు
[ 19-04-2024]
హిందూపురం అసెంబ్లీ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే బాలకృష్ణ, ఆయన సతీమణి వసుంధరలు శుక్రవారం మధ్యాహ్నం 12.15 గంటలకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు. -
వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం.. ప్రమాదకరం
[ 19-04-2024]
ఈ నెల 16వ తేదీన ముదిగుబ్బ మండలంలోని మలకవేములక్రాస్లో మిద్దెపై ఆడుకుంటున్న ఎనిమిదేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు 11కేవీ విద్యుత్తు తీగలు తగలడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. -
విశ్రాంత ఉద్యోగుల పాలిట జగనాసురుడు
[ 19-04-2024]
సుమారు 35 ఏళ్ల పాటు సేవలు అందించిన విశ్రాంత ఉద్యోగులకు జగన్ సర్కారు పగలే చుక్కలు చూపిస్తోంది. -
జగన్ పాలనలో అన్నీ కోతలే
[ 19-04-2024]
యువతను ఆకర్షించి అధికారంలోకి వచ్చిన వైకాపా చివరకు.. ఆ వర్గానికే షాకిచ్చింది. -
నామినేషన్ల పర్వం ప్రారంభం
[ 19-04-2024]
మొదటి రోజు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా జరిగింది. కేంద్ర ఎన్నికల కమిషన్ సార్వత్రిక ఎన్నికలు నోటిఫికేషన్ విడుదల కావడంతో గురువారం నామపత్రాల ప్రక్రియ ప్రారంభమైంది. -
నేడు కణేకల్లులో చంద్రబాబు సభ
[ 19-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు శుక్రవారం అనంతపురం జిల్లా కణేకల్లుకు రానున్నారు. -
రైతులను విస్మరించిన వైకాపా ప్రభుత్వం
[ 19-04-2024]
రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వం ఐదేళ్లలో రైతులను పూర్తిగా విస్మరించిందని తెదేపా అభ్యర్థి పయ్యావుల కేశవ్ ఆరోపించారు. -
గ్రామాల అభివృద్ధికే రాజకీయాల్లోకి.. : అమిలినేని
[ 19-04-2024]
గ్రామాల అభివృద్ధి కోసమే రాజకీయాల్లోకి వచ్చానని కళ్యాణదుర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు స్పష్టం చేశారు. -
కోడ్ ఉల్లంఘించి ఫ్లెక్సీల ఏర్పాటు
[ 19-04-2024]
ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి అధికార పార్టీ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. -
గొర్రెల యజమానులతో రెవెన్యూ అధికారి డబ్బుల డిమాండ్
[ 19-04-2024]
గొర్రెల యాజమానుల నుంచి ఓ రెవెన్యూ అధికారి డబ్బులు డిమాండ్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
తాడిపత్రిలో భగ్గుమన్న భానుడు
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలోని తాడిపత్రిలో గురువారం అత్యధికంగా 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు సహదేవరెడ్డి, నారాయణస్వామి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్
-
4 రోజుల నష్టాలకు బ్రేక్.. 599 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
-
భారాస అధినేత కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు
-
మెటా ప్లాట్ఫామ్స్లో ఏఐ.. వాట్సప్లో ఇక చిత్రాలూ రూపొందించొచ్చు!
-
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
-
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల