పోలీసుల బాధ్యత.. ఇంటికి భద్రత
లాక్డ్హౌస్ మానిటరింగ్ సిస్టం (ఎల్హెచ్ఎంఎస్) యాప్ను చరవాణిలో ఇన్స్టాల్ చేసుకుని పోలీసులకు సమాచారమిస్తే మీరు ఎక్కడున్నా సరే.. మీ ఇంటి భద్రత అరచేతిలో ఉంటుంది. ప్రజలు తమ విలువైన సొత్తును కాపాడుకునేందుకు పోలీసు
అనంత నేరవార్తలు, న్యూస్టుడే: లాక్డ్హౌస్ మానిటరింగ్ సిస్టం (ఎల్హెచ్ఎంఎస్) యాప్ను చరవాణిలో ఇన్స్టాల్ చేసుకుని పోలీసులకు సమాచారమిస్తే మీరు ఎక్కడున్నా సరే.. మీ ఇంటి భద్రత అరచేతిలో ఉంటుంది. ప్రజలు తమ విలువైన సొత్తును కాపాడుకునేందుకు పోలీసు శాఖ అమలు చేస్తున్న ఈ యాప్ను వినియోగించుకుంటే భరోసా లభిస్తుంది. ఈ యాప్ ద్వారా ప్రజల ఆస్తులు, సొత్తుకు రక్షణ కల్పించడంతో పాటు దొంగల ఆగడాలను అరికట్టే అవకాశం ఉంటుంది.
ఊరు వెళ్లే ముందు చెబితే చాలు
ఎల్హెచ్ఎంఎస్ సదుపాయం పొందాలనుకునేవారు తమ చరవాణిలో గూగుల్ ప్లే స్టోర్ ద్వారా ‘ఎల్హెచ్ఎంఎస్ ఏపీ పోలీస్’ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్లో పేరు, ఫోన్ నెంబరు వివరాలతో రిజిస్టర్ కావాలి. ఇంటికి తాళం వేసి ఊరు వెళ్తున్న సమయంలో యాప్ ద్వారా రిక్వెస్టులో సూచించిన విధంగా సమాచారం అందించాలి. ఏ రోజు.. ఏ సమయంలో ఆ ఇంటి నుంచి వెళ్తున్నారు.. ఎప్పుడు తిరిగి రానున్నారో వివరాలను అందులో పొందుపరిచి సందేశం పంపాలి. అది జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నడిచే కమాండ్ కంట్రోల్కు వెళ్తుంది. అక్కడి నుంచి సంబంధిత పోలీసులకు సమాచారం చేరుతుంది. దీనికి సంబంధించిన సిబ్బంది వెంటనే రిక్వెస్టు పెట్టిన వారి ఇంటికి వెళ్లి, ఎవరికీ కనిపించని ప్రదేశంలో రహస్య కెమెరాను అమర్చుతారు. ఇంటర్నెట్ సదుపాయం కల్పించేందుకు మోడమ్ను సైతం ఏర్పాటు చేస్తారు.
* ఇంట్లో అమర్చిన కెమెరా పోలీస్ కంట్రోల్ రూమ్కు అనుసంధానమై ఉంటుంది. ఆ ఇంట్లోకి ఎవరైనా ప్రవేశిస్తే ఇంట్లో అమర్చిన వ్యవస్థ ద్వారా కంట్రోల్ రూమ్లో పోలీస్ అలారం మోగుతుంది. దీంతో పోలీసులు దొంగతనం జరగకుండా చర్యలు తీసుకుంటారు. ఇంట్లో కదలికలపై ఐదు క్షణాల్లో కంట్రోల్ రూమ్లో అలారం మోగుతుంది. యాప్ ద్వారా రిజిస్టరైన ఇంటి యజమాని ఫోన్కు కూడా హెచ్చరిక వెళ్తుంది.
రాష్ట్రంలో అనంతలోనే తొలిసారి
ఇళ్లలో బిగించే రహస్య కెమెరాలు
ఈ వ్యవస్థను 2017లో మొదటగా అనంతపురం జిల్లాలో ప్రారంభించారు. అప్పటి ఎస్పీ రాజశేఖర్బాబు ప్రతిష్టాత్మంగా తీసుకుని ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. అనంతరం దశలవారీగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించారు. అధికారులు మారినప్పటికీ ఈ సిస్టమ్ను కొనసాగిస్తూనే ఉన్నారు. ఉమ్మడి జిల్లాలోని అనంతపురం, గుంతకల్లు, తాడిపత్రి, కళ్యాణదుర్గం, రాయదుర్గం, కదిరి, హిందూపురం, ధర్మవరం పట్టణాల్లో ఈ వ్యవస్థ అందుబాటులో ఉంది. ఇంతవరకు ఉమ్మడి జిల్లాలో 53,062 మంది ఎల్హెచ్ఎంఎస్ యాప్ను తమ ఫోన్ నెంబర్ల ద్వారా రిజిస్టర్ చేసుకున్నారు. 5,237 మంది ఈ వ్యవస్థను సద్వినియోగం చేసుకున్నారు. దీనికోసం జిల్లా పోలీసు హెడ్క్వార్టర్స్ కంట్రోల్ రూమ్లో ‘ఈ సర్విలెన్స్’ ద్వారా 24 గంటలూ పోలీసులు పర్యవేక్షిస్తుంటారు. ఈ వ్యవస్థకు జాతీయ స్థాయి ‘స్కోచ్’ అవార్డు కూడా దక్కింది.
సద్వినియోగం చేసుకోవాలి
- ఎస్పీ ఫక్కీరప్ప, అనంతపురం
ఎల్హెచ్ఎంఎస్ వ్యవస్థ ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఇది పూర్తిగా ఉచితమనే విషయాన్ని గ్రహించాలి. ఇంటి దొంగతనాలను నియంత్రించేందుకు వీలుగా తాళాలు వేసిన ఇళ్లపై కూడా నిఘా ఉంచుతున్నాం. ఈ వ్యవస్థ ద్వారా మంచి ఫలితాలు సాధించాం. ప్రతి ఒక్కరూ ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సైకో పాలనలో సర్వం నష్టం
[ 20-04-2024]
‘నాకు అనంతపురం కొత్త కాదు, రాయదుర్గమూ కొత్త కాదు, ఎన్నికల్లో మీ అందరిలో చైతన్యం తీసుకురావాలని, ఐదేళ్లు ఒక సైకో పరిపాలనలో మీరేం నష్టపోయారో చెప్పడానికి వచ్చాను. నా జీవితంలో ఎప్పుడూ చూడని స్పందన చూస్తున్నాను. ఇది రాష్ట్రానికి శుభసూచికం.’ అని తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. -
కరెంటు బిల్లు చూస్తేనే షాక్!
[ 20-04-2024]
విద్యుత్తు బిల్లులను చూసి వినియోగదారులు జడుసుకుంటున్నారు. దొడ్డిదారిన వైకాపా ప్రభుత్వం అదనపు భారం మోపడంపై మండిపడుతున్నారు. -
అనంత ప్రాజెక్టులపై కాస్త కనికరమైనా లేదా?
[ 20-04-2024]
అసలే కరవు జిల్లా. నీటి వనరులను ఒడిసి పట్టుకోవడం అనేది ఇక్కడ చాలా కీలకం. -
ట్రాఫిక్ పద్మవ్యూహం.. అభిమన్యుడూ ఛేదించలేడు
[ 20-04-2024]
వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ మొత్తంలో చలాన్లు వేస్తున్న వైకాపా ప్రభుత్వం తన కర్తవ్యాన్ని మాత్రం పూర్తిగా విస్మరించింది. -
పుంజుకున్న నామినేషన్లు
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ల దాఖలు ప్రక్రియ పుంజుకుంది. -
పురంలో బాలయ్య ర్యాలీ
[ 20-04-2024]
ఎమ్మెల్యే బాలకృష్ణ హిందూపురం అసెంబ్లీ స్థానానికి శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా సాయంత్రం పట్టణంలో చేపట్టిన ర్యాలీకి తెదేపా, భాజపా, జనసేన శ్రేణులు భారీగా తరలిరావచ్చారు. -
వైకాపా పాలనలో గార్మెంట్స్ పరిశ్రమ కుదేలు
[ 20-04-2024]
ఉమ్మడి అనంతపురం జిల్లాలో రాయదుర్గం పట్టణం గార్మెంట్స్ పరిశ్రమకు ప్రసిద్ధి.. ఏటా కోట్లలో వ్యాపారం జరిగేది. -
అరాచక పాలనను సాగనంపేందుకు సిద్ధం
[ 20-04-2024]
వైకాపా అరాచక పాలనకు రాష్ట్ర ప్రజలు త్వరలోనే చరమగీతం పాడేందుకు సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. -
ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి
[ 20-04-2024]
ఎన్నికల్లో తనకు అవకాశం కల్పిస్తే మున్సిపాలిటీ అభివృద్ధితోపాటు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు అన్నారు. -
శాశ్వతంగా తాగునీటి సమస్య పరిష్కరిస్తా
[ 20-04-2024]
రుద్రంపేట పంచాయతీ చంద్రబాబు కొట్టాల్లో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని అనంతపురం అర్బన్ తెదేపా అభ్యర్థి దగ్గుపాటిప్రసాద్ హామీ ఇచ్చారు. -
అధికారంలోకి వచ్చేది తెదేపానే
[ 20-04-2024]
తెదేపా శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేసింది. భానుడు సెగలు కక్కుతున్నా లెక్కచేయకుండా వేలాదిమంది కార్యకర్తలు తెదేపా జెండాలను చేతపట్టుకొని భారీగా ర్యాలీ నిర్వహించారు. -
ప్రజాగళం.. పోటెత్తిన జనం
[ 20-04-2024]
కణేకల్లులో శుక్రవారం జరిగిన తెదేపా అధినేత చంద్రబాబు ప్రజాగళం సభకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పోటెత్తారు. -
పక్కాగా అభ్యర్థుల ఖర్చు లెక్కింపు
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు రోజువారి ఖర్చులను పక్కాగా నమోదు చేయాలని కలెక్టర్/డీఈఓ డాక్టర్ వినోద్కుమార్, పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల వ్యయ పరిశీలకులు విలాస్ వి.షిండే, నితిన్ అగర్వాల్, రాందాస్ టి.కాలే పేర్కొన్నారు. -
జడ్జికి సత్కారం
[ 20-04-2024]
స్థానిక సీనియర్ సివిల్ జడ్జి ఎం.శంకరరావు బదిలీపై అనంతపురం వెళుతుండగా శుక్రవారం న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో ఆయనను సత్కరించారు.