పతి కోసం.. సతి వేదన..!
భర్తకు చిన్న గాయమైతేనే భార్య మనసు తల్లడిల్లుతుంది. అలాంటిది తన భర్త రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలై నాలుగు రోజులు ఐసీయూలో, రెండు రోజులు కోమాలోకి వెళ్తే.. చికిత్సలందించినా లాభం లేదని వైద్యులు చెబితే..
బతుకును ఛిద్రం చేసిన రోడ్డు ప్రమాదం
మంచానికే పరిమితమైన శ్రీరాములు
ముదిగుబ్బ, ధర్మవరం పట్టణం, న్యూస్టుడే : భర్తకు చిన్న గాయమైతేనే భార్య మనసు తల్లడిల్లుతుంది. అలాంటిది తన భర్త రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలై నాలుగు రోజులు ఐసీయూలో, రెండు రోజులు కోమాలోకి వెళ్తే.. చికిత్సలందించినా లాభం లేదని వైద్యులు చెబితే.. ఆ భార్య పరిస్థితి వర్ణణాతీతం. దేవుడిపైనే భారం వేసిన ఆమె చివరికి భర్త ప్రాణాలను కాపాడుకుంది. మంచానికే పరిమితమైన భర్త యోగక్షేమాలు చూస్తూ కుటుంబ పోషణ భారమైన ఆ కుటుంబం ఇప్పుడు దాతల సాయం కోసం ఎదురుచూస్తోంది. ముదిగుబ్బ మండలం ఈదులపల్లి గ్రామానికి చెందిన శ్రీరాములు, అక్కమ్మ దంపతులిద్దరూ కూలీ పనులు చేసుకుంటూ జీవనంగడిపేవారు. వీరికి ఇద్దరు కుమార్తెలున్నారు. అప్పు చేసి వారిద్దరికీ వివాహం చేశారు. నిత్యం కూలీపని చేస్తూ వచ్చే ఆదాయంతోనే చేసిన అప్పులకు వడ్డీ చెల్లించి మిగిలిన దాంతోనే కుటుంబ జీవనం గడిపేవారు. సరిగ్గా నాలుగు నెలల క్రితం ఉపాధి కోసం పులివెందులకు వెళ్లి తిరిగి వస్తుండగా దొరిగల్లు ఘాట్ రోడ్డులో బొలెరో వాహనం బోల్తాపడింది. అందులో ప్రయాణిస్తున్న శ్రీరాములకు రెండు కాళ్లు విరిగి, తలకు తీవ్ర గాయాలయ్యాయి. భార్య, బంధువుల సాయంతో బత్తలపల్లి ఆర్డీటీ ఆసుపత్రికి తీసుకెళ్లగా నాలుగు రోజులు ఐసీయూలో పెట్టారు. పరిస్థితి విషమించడంతో రెండు రోజులు కోమాలోకి వెళ్లారు. గుండె నెమ్మదిగా కొట్టుకుంటోందని, చికిత్సలందించినా ఎటువంటి ప్రయోజనం లేదని వైద్యులు చెప్పడంతో భార్య అక్కమ్మ గుండెలవిసేలా ఏడ్చింది. చివరికి ఆపరేషన్ చేసి ఒక కాలు పూర్తిగా తొలగించి, మరొక కాలుకు ఇనుప రాడ్డు వేశారు. మూడు నెలలపాటు ఆసుపత్రిలో చికిత్సలందించారు. భార్య అక్కమ్మ తెలిసిన వారి దగ్గర రూ.3 లక్షల వరకు అప్పు తెచ్చి వైద్యం చేయించారు. అదే సమయంలో తన చిన్న కుమార్తె ప్రశాంతికి పురిటినొప్పులు రావడంతో ఆర్డీటీ ఆసుపత్రిలో చేర్పించారు. బాధను దిగమింగి ఓ వైపు భర్త, మరోవైపు కూతురి బాధ్యతలను చూసుకుంది. నెలకు మాత్రల కోసం రూ.2 వేలు, డ్రెసింగ్, చెకప్ కోసం బత్తలపల్లి ఆర్డీటీ ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఆటో బాడుగు వెయ్యి ఖర్చవుతోంది. నిత్యం కూలీపనికెళ్తేనే కుటుంబ పోషణ సాగేది. భర్త మంచానికే పరిమితం కావడంతో బాగోగులన్నీ భార్య చూసుకుంటోంది. నాలుగు నెలలుగా కూలీపనికి వెళ్లకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. దాతలు ఎవరైనా స్పందించి ఆర్థికసాయమందించాలని అక్కమ్మ కోరుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏడో రోజు జోరుగా నామినేషన్లు
[ 25-04-2024]
ప్రధాన పార్టీలైన తెదేపా, కాంగ్రెస్, వైకాపా, బీఎస్పీ తదితర పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు బుధవారం జోరుగా నామినేషన్ వేశారు. -
విధేయతకు తెదేపా పట్టం
[ 25-04-2024]
అనంతపురం జిల్లా తెదేపా అధ్యక్షుడిగా జి.వెంకట శివుడు యాదవ్ నియమించారు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. -
నిర్మించలేదు.. నిర్వహణ చేతకాదు
[ 25-04-2024]
కల్లబొల్లి మాటలు చెప్పడం తప్ప జగన్ ప్రభుత్వం ఈ ఐదేళ్లలో రైతులకు ఉపయోగపడే పని ఒక్కటీ చేయలేదు. తాను నిర్మించలేదు.. -
అనంత నగరం.. పసుపుమయం
[ 25-04-2024]
అనంతపురం అర్బన్ తెదేపా అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ నామినేషన్ సందర్భంగా బుధవారం అనంతపురం అర్బన్ క్యాంపు కార్యాలయానికి ఉదయం 8 గంటలకే -
వంతెన నిర్మాణాన్ని విస్మరించిన జగన్ సర్కార్
[ 25-04-2024]
వైకాపా పాలనలో భూతద్దం పెట్టి వెతికినా అభివృద్ధి కనిపించదు. తెదేపా హయాంలో తలపెట్టిన పనుల్ని ఐదేళ్లుగా జగన్ ప్రభుత్వం పక్కనపెట్టేసింది. ఉరవకొండ మండలం కైకుంట్ల నుంచి వై.రాంపురం మార్గంలో హంద్రీనీవా -
వైకాపా అసమర్థ అభ్యర్థిని ఓడిస్తేనే అభివృద్ధి: కేశవ్
[ 25-04-2024]
ఉరవకొండ, విడపనకల్లు, వజ్రకరూరు, బెళుగుప్ప, న్యూస్టుడే: వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి అసమర్థుడని, ఆయన్ను ఈ ఎన్నికల్లో ఓడిస్తేనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యం అవుతుందని తెదేపా అభ్యర్థి, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఉద్ఘాటించారు. -
ఐదేళ్ల పాలన చూశాం.. మళ్లీ తప్పు చేయొద్దు
[ 25-04-2024]
పేరూరు డ్యాంకు నీరు తెచ్చాం, బంగారు గనులను తెరిపించి ఉద్యోగాలు కల్పించాం.. అంటూ ప్రకాశ్రెడ్డి అన్ని అబద్ధాలే చెబుతారని మాజీ మంత్రి పరిటాల సునీత ధ్వజమెత్తారు. -
రాయదుర్గం సర్వతోముఖాభివృద్ధికి కృషి : కాలవ
[ 25-04-2024]
రాయదుర్గం సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తానని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కాలవ శ్రీనివాసులు అన్నారు. బుధవారం మధ్యాహ్నం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. -
పెద్దారెడ్డి నామినేషన్.. అంతా పరేషాన్
[ 25-04-2024]
తాడిపత్రి వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి బుధవారం నామినేషన్ వేసేందుకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ప్రధాన రహదారి సీబీ రోడ్డును రెండువైపులా బ్లాక్ చేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. -
ఏడో రోజు 54 నామినేషన్ల దాఖలు
[ 25-04-2024]
జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఏడో రోజు హిందూపురం పార్లమెంటు స్థానానికి ఏడు, ఏడు అసెంబ్లీ స్థానాలకు 47 మొత్తం 54 నామినేషన్లు దాఖలు చేశారు. -
కొండలు కరిగించి.. నిధులు కొల్లగొట్టి
[ 25-04-2024]
అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైకాపా నాయకులు మట్టి వ్యాపారుల అవతారమెత్తి కొండలను కరిగించేశారు. కదిరి ప్రాంతంలోని -
నీరు కుప్పం వెళ్లింది.. చెరువు ఎండింది
[ 25-04-2024]
వైకాపా ప్రభుత్వం హంద్రీనీవా జలాలను కుప్పం తీసుకెళ్లడం ఫలితంగా ముదిగుబ్బ మండలంలోని దొరిగల్లు చెరువు ఎండింది. ఈ చెరువు కింద ఖరీఫ్లో సుమారు 500, రబీలో 200 ఎకరాల వరకు ఆయకట్టు సాగవుతోంది. -
పేరుకే పెద్దాసుపత్రి... ఓపీ సేవలు నామమాత్రం
[ 25-04-2024]
ఉరవకొండ 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీ సేవలు నామమాత్రంగా అందుతున్నాయి. దాంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం