logo

‘కౌన్సిలర్‌ ఇంటిపై డీఎస్పీ, ఎమ్మెల్యే దాడి చేయించారు’

తాడిపత్రి పురపాలికలో 30వ వార్డు కౌన్సిలరు మల్లికార్జున ఇంటిపై డీఎస్పీ వీఎన్‌కే చైతన్య, ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి దాడి చేయించారని మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆరోపించారు.

Published : 27 Sep 2022 06:12 IST


మాట్లాడుతున్న మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి

తాడిపత్రి, న్యూస్‌టుడే: తాడిపత్రి పురపాలికలో 30వ వార్డు కౌన్సిలరు మల్లికార్జున ఇంటిపై డీఎస్పీ వీఎన్‌కే చైతన్య, ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి దాడి చేయించారని మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆరోపించారు. స్థానికంగా ఆయన నివాసంలో సోమవారం సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుని మాట్లాడారు. కౌన్సిలర్‌ ఇంటిపై దాడి చేసిన తరువాత సోమనపల్లి గ్రామానికి చెందిన నారాయణ కుటుంబ సభ్యులతో కౌన్సిలర్‌పై ఫిర్యాదు ఇప్పించారని అన్నారు. ఎస్సీ సెల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి హోదాలో మల్లికార్జున వారితో మాట్లాడి ఉండవచ్చని, అందుకు బెదిరిస్తున్నాడని బలవంతంగా ఫిర్యాదు ఇప్పించడం అన్యాయం అన్నారు. నారాయణ అనే వ్యక్తి పోలీసులు కొట్టడం వల్లే చనిపోయాడని, అందుకు సంబంధించిన సాక్షాలు ఉన్నా

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని