3 నెలలుగా చెబుతున్నా మారరా?
‘అర్జీ పరిష్కరించిన తర్వాత బాధితుడితో కలిసి తీసుకున్న ఫొటోలు అప్లోడ్ చేయాల్సిందే. ఇందుకు సంబంధించి మూడు నెలలుగా చెబుతున్నా మార్పు రాలేదు. వచ్చే వారంలోగా విధిగా మార్పు కనిపించాలి.
సమస్యలు వింటున్న కలెక్టర్ నాగలక్ష్మి, జేసీ కేతన్గార్గ్
జిల్లా సచివాలయం, న్యూస్టుడే: ‘అర్జీ పరిష్కరించిన తర్వాత బాధితుడితో కలిసి తీసుకున్న ఫొటోలు అప్లోడ్ చేయాల్సిందే. ఇందుకు సంబంధించి మూడు నెలలుగా చెబుతున్నా మార్పు రాలేదు. వచ్చే వారంలోగా విధిగా మార్పు కనిపించాలి. లేదంటే శాఖాపరంగా చర్య తప్పదు’ అని జిల్లా అధికారులపై కలెక్టర్ నాగలక్ష్మి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టరేట్ రెవెన్యూ భవన్లో ప్రజా స్పందన కార్యక్రమం జరిగింది. కలెక్టర్తోపాటు.. జేసీ కేతన్గార్గ్ ఇతర అధికారులు వినతులు స్వీకరించారు. అనంతరం కలెక్టర్, జేసీలు అధికారులతో మాట్లాడారు. మండల స్థాయిలో ప్రజాప్రతినిధులను ప్రభుత్వ కార్యక్రమాలకు ఆహ్వానించే విషయంలో ప్రోటోకాల్ పాటించాని సూచించారు.
12న యువ ఉత్సవ్
అక్టోబరు 12న అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో ‘యువ ఉత్సవ్-2022’ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. ఇందుకు సంబంధించిన గోడపత్రాలను ఆవిష్కరించారు. ఉపన్యాసం, సాంస్కృతిక బృంద కార్యక్రమాలు, చిత్రలేఖనం, ఫొటోగ్రఫీ, పద్యాలు.. వంటి అంశాల్లో పోటీలు నిర్వహించాలన్నారు.
అంటువ్యాధులపై అప్రమత్తం
వర్షాకాలంలో అంటువ్యాధులు విస్తృతంగా ప్రబలే ప్రమాదం ఉందని, క్షేత్ర స్థాయిలో జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రజల్లో అవగాహన పెంచేందుకు గోడపత్రాలను ఆవిష్కరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు: మధ్యప్రదేశ్ సీఎం
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!