చెప్పేవి నీతులు.. దోచేవి గుట్టలు!
అధికారులు అవినీతి చేస్తే ఆయన ఏమాత్రం సహించరు.. అక్కడికక్కడే కడిగేస్తారు.. అవినీతిరహిత పాలన అంటూ ప్రసంగిస్తారు. ఇదంతా చూసి ఆయనేదో నిజాయతీపరుడు అనుకుంటే తప్పులో కాలేసినట్లే. అదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే. మరోవైపు ధర్మవరం నియోజకవర్గ పరిధిలో భూముల్ని ఆక్రమించినట్లు
వైకాపా నాయకుడి భూ దందా
చెరువు, గుట్ట పోరంబోకు కబ్జా
వైకాపా నాయకుడు ఆక్రమించిన ఎర్రగుట్ట
ఈనాడు డిజిటల్, అనంతపురం: అధికారులు అవినీతి చేస్తే ఆయన ఏమాత్రం సహించరు.. అక్కడికక్కడే కడిగేస్తారు.. అవినీతిరహిత పాలన అంటూ ప్రసంగిస్తారు. ఇదంతా చూసి ఆయనేదో నిజాయతీపరుడు అనుకుంటే తప్పులో కాలేసినట్లే. అదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే. మరోవైపు ధర్మవరం నియోజకవర్గ పరిధిలో భూముల్ని ఆక్రమించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో సగానికి పైగా ప్రభుత్వ భూములే ఉన్నట్లు సమాచారం. ధర్మవరం, ముదిగుబ్బ మండలాల్లో ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులు పదుల ఎకరాల్లో ప్రభుత్వ భూముల్ని మింగేశారు. ధర్మవరం సమీపంలో చెరువు ఆనుకుని ఉన్న గుట్టను కబ్జా చేశారు. పేదరైతుల్ని బెదిరించి అసైన్డ్ భూముల్ని బలవంతంగా లాక్కున్నారు. దీంతోపాటు పొలాలకు ఆనుకుని ఉన్న గుట్టపోరంబోకు, చెరువు పోరంబోకు భూముల్ని కలిపేసుకుని పంటలు పండిస్తున్నారు. ఇదంతా బహిరంగంగానే జరుగుతున్నా అటు రెవెన్యూ, ఇటు జలవనరుల శాఖ అధికారులు నోరు మెదపడం లేదు.
విశ్రాంత ఉద్యోగి సహకారంతో..
ఎర్రగుట్టపై ఉన్న పొలాలను లాగేసుకోవడానికి రెవెన్యూ రికార్డులను తారుమారు చేసినట్లు తెలుస్తోంది. ధర్మవరానికి చెందిన ఓ విశ్రాంత రెవెన్యూ ఉద్యోగి సహకారం తీసుకున్నట్లు సమాచారం. 902 నుంచి 909 వరకు ఉన్న సర్వే నంబర్లలో సుమారు 20 సబ్ డివిజన్లను కొత్తగా సృష్టించి, సుమారు 20 ఎకరాల పొలాన్ని తన స్వాధీనంలోకి తెచ్చుకున్నారని ప్రచారం జరుగుతోంది. గుట్ట ఆనుకుని ఉన్న పట్టా భూముల్ని యజమానులను బెదిరించి తక్కువ ధరకు తీసుకున్నట్లు తెలిసింది. ఇవన్నీ కుటుంబ సభ్యులు, అనుచరులు, బినామీల పేరుతో రాయించేసుకున్నారు.
పిత్రార్జితంగా మార్చారు
ఎర్రగుట్ట సర్వే నంబర్లలో సుమారు 20 ఎకరాలను తన కుటుంబంలోని మహిళ పేరుతో ఆన్లైన్లో నమోదు చేశారు. ఇందులో పదెకరాలు కొనుగోలు చేయగా.. మరో 8 ఎకరాలు ఆమెకు పిత్రార్జితంగా వచ్చినట్లు రికార్డుల్లో చూపారు. సదరు మహిళది కర్నూలు జిల్లా కాగా ఇక్కడికి ఇచ్చి వివాహం చేశారు. కర్నూలు జిల్లాకు చెందిన మహిళ తండ్రికి ఇక్కడ గుట్టపై భూమి ఎలా సంక్రమించిందనేది ప్రశ్నగా మారింది.
చెరువు కబ్జా
ఎర్రగుట్టకు ఆనుకుని ఉన్న చెరువును సుమారు 15 ఎకరాల వరకు పూడ్చి తన స్వాధీనంలోకి తెచ్చుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. బయటి వ్యక్తులెవరూ అక్కడికి వెళ్లకుండా బందోబస్తు ఏర్పాటు చేసుకున్నారు. ఆయన పడవ ప్రయాణం సరదా కోసం రెండేళ్లుగా ఆయకట్టుకు నీరు విడుదల చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. గత మూడేళ్లలో ఒక్కసారి మాత్రమే నీరు విడుదల చేసినట్లు రైతులు చెబుతున్నారు.
రికార్డులు లేకుండానే రిజిస్ట్రేషన్లు?
ఎర్రగుట్ట విస్తరించి ఉన్న ధర్మవరం పొలం పరిధిలోని 904, 905, 908, 909 సర్వే నంబర్లు, పోతులనాగేపల్లి పరిధిలోని 42, 43 సర్వే నంబర్లు, మల్లాకాలువ పరిధిలోని 1, 4 సర్వే నంబర్లు ఎవరికి, ఎప్పుడు అసైన్డ్ చేశారనే వివరాలను అధికారులు వెల్లడించడం లేదు. కొందరు సమాచారహక్కు చట్టం ద్వారా వివరాలు కోరగా.. వీటికి సంబంధించి తమ వద్ద ఎలాంటి రికార్డులు లభ్యం కాలేదని రెవెన్యూ అధికారులు లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు. రికార్డులు లేకుండా ఆ భూములను ఎలా రిజిస్ట్రేషన్ చేశారనేది ప్రశ్నగా మారింది.
రైతులను బెదిరించి..
ధర్మవరం రెవెన్యూ పొలం పరిధిలో 902, 903, 904, 905, 906, 908, 909 సర్వే నంబర్లలో ఎర్రగుట్ట ఉంది. దీంతోపాటు పోతులనాగేపల్లి పొలం పరిధిలోని 42, 43 సర్వే నంబర్లలో గుట్ట విస్తరించి ఉంది. ఇందులో మోటుమర్ల, కత్తేకొట్టాల గ్రామాలకు సంబంధించి పేద రైతులకు 1976, 1977 సంవత్సరాల్లో డి-పట్టాలు ఇచ్చారు. ఎర్రగుట్ట, చెరువుకు మధ్యలో ఉన్న ఈ భూముల్ని తరాలుగా సాగు చేసుకుంటున్నారు. వైకాపా అధికారంలోకి వచ్చాక కీలక నాయకుడి కన్ను పడింది. పేద రైతుల్ని బెదిరించి ఎకరాకు రూ.లక్ష ఇచ్చి పొలాలను రాయించుకున్నట్లు తెలిసింది. ఇలా 45 ఎకరాల వరకు బలవంతంగా లాక్కున్నట్లు సమాచారం. దౌర్జన్యాన్ని ప్రశ్నించిన కొందరు యువకులపై తప్పుడు కేసులు బనాయించి పోలీసుల ద్వారా బెదిరింపులకు దిగినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది.
రుణాల పేరుతో లింకు డాక్యుమెంట్లు
ఎర్రగుట్టపై భూముల్ని రిజిస్ట్రేషన్ చేయించడానికి అక్రమంగా లింకు డాక్యుమెంట్లు సృష్టించారనే ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్కు చెందిన ఓ ఫైనాన్స్ కంపెనీ నుంచి సదరు సర్వే నంబర్లపై రుణాలు తీసుకున్నట్లు డాక్యుమెంట్లు తయారు చేశారు. రుణాలు తిరిగి చెల్లించకపోవడంతో వాటిని వేలంలో సదరు నాయకుడి కుటుంబ సభ్యులు కొన్నట్లు రికార్డులు సృష్టించారు. వాటిని ఆధారంగా అసైన్డ్ భూముల్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరిశ్రమలు తేవడం తెదేపా బ్రాండ్.. తరిమికొట్టడం జగన్ బ్రాండ్: చంద్రబాబు
[ 28-03-2024]
రాయలసీమ ద్రోహి ఎవరో ప్రజలే తేల్చాలని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
ఉమ్మడి జిల్లాలో చంద్రబాబు పర్యటన నేడు
[ 28-03-2024]
తెదేపా అధినేత చంద్రబాబు గురువారం ఉమ్మడి అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. రాప్తాడు, బుక్కరాయసముద్రం, కదిరి ప్రాంతాల్లో ప్రజాగళం పేరిట పర్యటించనున్నారు. -
జలకళ ఏదీ జగన్?
[ 28-03-2024]
జలకళ పథకాన్ని సీఎం జగన్ అట్టహాసంగా ప్రారంభించారు. దరఖాస్తు చేసుకున్న రైతుల్లో అర్హులందరికీ పొలాల్లో బోర్లు తవ్విస్తాం అని ఊదరగొట్టారు. పథకం ప్రారంభమైన కొన్ని రోజులకే మడమ తిప్పారు. -
ధర్మవరం భాజపాకే కూటమి అభ్యర్థిగా సత్యకుమార్
[ 28-03-2024]
-
పోలింగ్ కేంద్రం పక్కనే కోడ్ ఉల్లంఘన
[ 28-03-2024]
అక్కడా.. ఇక్కడా ఎందుకు? డైరెక్టుగా పోలింగ్ కేంద్రం పక్కనే కోడ్ ఉల్లంఘన జరుగుతున్నా.. పట్టించుకునేవారే కరవయ్యారు. -
సీఎం సభకు బస్సులు.. ప్రయాణికుల పాట్లు
[ 28-03-2024]
సీఎం జగన్ ఇతర జిల్లాల్లోని ఎన్నికల పర్యటన సందర్భంగా కళ్యాణదుర్గం డిపో నుంచి 26 బస్సులను తరలించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
ఐదేళ్లయినా అధికారులిక్కడే..
[ 28-03-2024]
మున్సిపల్ విభాగంలో పలువురు కీలక అధికారులు ఒకేచోట మూడేళ్లు దాటినా అక్కడే ఉంటున్నారు. అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నందువల్లే వారిని బదిలీ చేయడం లేదన్న విమర్శ ఉంది. -
మంచినీరు వృథా.. వ్యధ..
[ 28-03-2024]
ఉరవకొండ పట్టణంలో గ్రామీణ నీటి సరఫరా (ఆర్డబ్ల్యూఎస్) అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రజలు కష్టాలు ఎదుర్కొంటున్నారు. -
భూగర్భ మురుగు కాలువ వ్యవస్థకు మోక్షమెన్నడు?
[ 28-03-2024]
గుంతకల్లు మున్సిపాలిటీలో సమగ్ర భూగర్భ మురుగు కాలువల వ్యవస్థ ఏర్పాటుకు సంబంధించిన నివేదిక మూలనపడింది. పట్టణంలో రోడ్లు బాగున్నా.. సరైన కాలువలు లేకపోవడంతో మురుగు రోడ్లపై ప్రవహిస్తుంది. -
తాగునీటి సమస్య పరిష్కరించకుండా విమర్శలా?
[ 28-03-2024]
నగర ప్రజలంతా తీవ్ర తాగునీటి ఎద్దడితో అల్లాడుతుంటే సమస్యను పరిష్కరించకుండా వైకాపా నాయకులు తెదేపాపై అనవసర విమర్శలు చేస్తున్నారని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు గౌస్మోహిద్దీన్ మండిపడ్డారు. -
అనంత నగరపాలక కార్యాలయంలో సినిమా చిత్రీకరణ
[ 28-03-2024]
అనంత నగరపాలక కార్యాలయ ఆవరణలో సినిమా చిత్రీకరణపై విమర్శలు వస్తున్నాయి. బుధవారం సాయంత్రం నగరపాలక కార్యాలయంలో సెట్టింగ్లతో సినిమా తీశారు. -
30 నుంచి భవిత కేంద్రాల్లో శిబిరాలు
[ 28-03-2024]
ఏపీ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో జల్లాలో గుర్తించిన భవిత కేంద్రాల్లో దివ్యాంగ పిల్లలకు అసెస్మెంట్ శిబిరాలు నిర్వహించనున్నట్లు అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ మీనాక్షి తెలిపారు. -
సి-విజిల్ ఫిర్యాదులు పరిష్కరించండి
[ 28-03-2024]
ఎన్నికల నియమావళి మేరకు ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన వాణిజ్య స్థలాలతోపాటు, కార్యాలయాల్లో ఎటువంటి రాజకీయ పార్టీల ప్రకటనలు హోర్డింగ్లు, పోస్టర్లు, బ్యానర్లను అనుమతించవద్దని కలెక్టర్ అరుణ్బాబు ఆదేశించారు. -
ఖాద్రీశుడి సమ్మోహనం
[ 28-03-2024]
కదిరి లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం మోహినీ అలంకారంలో ఖాద్రీశుడు దర్శనమిచ్చారు. ఆలయం నుంచి బయలుదేరిన స్వామి తిరువీధుల్లో విహరించారు. -
రూ.1.67 కోట్ల మళ్లింపుపై కేసు
[ 28-03-2024]
కదిరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వ్యవసాయ విభాగంలో క్షేత్రస్థాయి అధికారి (ఫీల్డ్ ఆఫీసర్) వెంకటనాయుడు ఓడీ ఖాతా నుంచి సేవింగ్ ఖాతాలకు సుమారు రూ.1.67 కోట్లు మళ్లించిన వ్యవహారంపై కదిరి పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. -
సైబర్ పోలీసుల అదుపులో చిలమత్తూరు యువకుడు
[ 28-03-2024]
హైదరాబాద్ సైబర్ క్రైం బ్రాంచ్ పోలీసులు బుధవారం శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం సంజీవరాయనపల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. -
నలుగురు ఉద్యోగుల సస్పెన్షన్
[ 28-03-2024]
ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి రాజకీయ ప్రచారంలో పాల్గొన్న నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ ఓ ప్రకటనలో తెలిపారు. -
ముగ్గురు వాలంటీర్ల తొలగింపు
[ 28-03-2024]
ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా మంగళవారం వైకాపా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న స్థానిక గ్రామ వాలంటీర్లు శివయ్య, రమేశ్, మహబూబ్ బాషాలను విధుల నుంచి తొలగిస్తూ బుధవారం ఎంపీడీవో విజయలలిత ఉత్తర్వులు జారీ చేశారు. -
పది పరీక్షలకు 2,203 మంది గైర్హాజరు
[ 28-03-2024]
జిల్లా వ్యాప్తంగా పదో తరగతి ప్రధాన పరీక్షలు బుధవారం జరిగిన సాంఘికశాస్త్రం పరీక్షతో ముగిసాయి.
తాజా వార్తలు (Latest News)
-
మేం మాటల మనుషులం కాదు.. చేసి చూపిస్తాం: బాలకృష్ణ
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!