అతి వేగం.. బతుకులు ఛిద్రం
ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉరవకొండ సమీపంలోని బూదగవి, కొట్టాలపల్లి గ్రామాల మధ్య జాతీయ రహదారిపై లారీని ఇన్నోవా కారు ఢీకొన్న ప్రమాదంలో 9 మంది దుర్మరణం చెందారు. మృతుల్లో ఏడుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు.
నెత్తురోడుతున్న రహదారులు
అందుబాటులో లేని స్పీడ్గన్లు
* ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉరవకొండ సమీపంలోని బూదగవి, కొట్టాలపల్లి గ్రామాల మధ్య జాతీయ రహదారిపై లారీని ఇన్నోవా కారు ఢీకొన్న ప్రమాదంలో 9 మంది దుర్మరణం చెందారు. మృతుల్లో ఏడుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు.
* కడప వైద్య కళాశాలలో వైద్యుడిగా పని చేస్తున్న జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఆగస్టులో కారులో అనంతపురం బయలుదేరారు. ముదిగుబ్బ సమీపంలో వేగాన్ని అదుపు చేయలేకపోవడంతో కారు జాతీయ రహదారి పక్కన వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో వైద్యుడు మృతి చెందాడు.
* సెప్టెంబరు 25న గార్లదిన్నె వద్ద 44వ జాతీయ రహదారిపై హైదరాబాద్ వాసులు ప్రయాణిస్తున్న కారు వేగంగా వెళ్లి అల్యూమినియం రెయిలింగ్ను ఢీకొట్టింది. రెయిలింగ్ కారులోకి చొచ్చుకు పోయి తల్లీ కూతుళ్లు దుర్మరణం పాలయ్యారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.
* అదే రోజు పంగల్ రోడ్డు వద్ద రాప్తాడుకు చెందిన వ్యక్తి ద్విచక్ర వాహనంతో డివైడర్కు ఢీకొట్టడంతో తలకు తీవ్రగాయాలై మృతి చెందాడు.
అనంత నేరవార్తలు, న్యూస్టుడే: ర్యాష్ డ్రైవింగ్.. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం వంటి చర్యలతో కొందరు చేజేతులా జీవితంలో విషాదం నింపుకొంటున్నారు. మితిమీరిన వేగంతో వాహనాలు నడుపుతున్న వారితో పాదచారులు, ద్విచక్ర వాహన చోదకులకూ ముప్పువాటిల్లుతోంది. ఇటీవల ఉమ్మడి అనంత జిల్లాలో చోటు చేసుకున్న ప్రమాదాలు ఆందోళన కల్గిస్తున్నాయి. జిల్లాలో తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో నెలకు సగటున 50 మందికి పైగా మృతి చెందుతున్నారు.
ఇటీవల గార్లదిన్నె వద్ద ప్రమాదానికి గురైన కారు
బ్లాక్ స్పాట్లు ఇలా..
500 మీటర్ల రోడ్డు పరిధిలో ఏడాదికి సగటున ఒకటి అంతకంటే ఎక్కువ ప్రమాదాలు జరిగితే వాటిని బ్లాక్స్పాట్లుగా పిలుస్తారు. ఏడాదికి సగటున 1 నుంచి 4 ప్రమాదాలు జరిగితే ‘సి’ కేటగిరి గాను, 5 నుంచి 9 ప్రమాదాలు జరిగితే ‘బి’ కేటగిరి, 10కి పైన ప్రమాదాలు జరిగితే ‘ఏ’ కేటగిరి బ్లాక్స్పాట్లుగా గుర్తిస్తారు. ఉమ్మడి జిల్లాలో 8 పోలీస్ సబ్డివిజన్ల పరిధిలో 106 బ్లాక్ స్పాట్లు ఉన్నాయి. ఎక్కువగా పెనుకొండ డివిజన్లో 25, అనంతపురం 22, తాడిపత్రి 20, ధర్మవరం సబ్డివిజన్లో 19 ఉన్నాయి. ‘బి’కేటగిరి 7, ‘సి’కేటగిరి 99 ఉన్నాయి. ‘ఏ’ కేటగిరివి లేవు.
జిల్లాకు 4 స్పీడ్గన్లే
జాతీయ రహదారులపై వేగంగా దూసుకెళ్లే వాహనాలను నియంత్రించడానికి పోలీసు శాఖ రాడార్ స్పీడ్గన్లను వినియోగిస్తోంది. ఇవి కదులుతున్న వాహనాల కచ్చిత వేగాన్ని గణిస్తాయి. జిల్లాలో కేవలం నాలుగే ఉన్నాయి. ఉరవకొండ, రాప్తాడు, గుత్తి, తాడిపత్రి ప్రాంతాల్లో ఇవి ఉన్నాయి.
44వ హైవేపై ప్రమాదాలు అధికం
గుత్తి నుంచి చిలమత్తూరు వరకు సుమారు 150 కి.మీ. ఉన్న ఎన్హెచ్ 44పై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ హైవేపై 40 బ్లాక్స్పాట్లు ఉన్నాయి. గుత్తి, పామిడి, గార్లదిన్నె, సోములదొడ్డి, తపోవనం, రాప్తాడు, మామిళ్లపల్లి, ఎన్ఎస్గేట్, దామాజిపల్లి, కోన, పాలవెంకటాపురం, పెనుకొండ తదితర ప్రాంతాల కూడళ్లలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.
అవసరం లేని చోట రెయిలింగ్.. జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణకు రెయిలింగ్ (రక్షణ గోడలు) ఏర్పాటు చేస్తున్నారు. అయితే పలు చోట్ల అవసరం లేని చోట ఏర్పాటు చేశారు.
నిధుల్లేవంటూ.. నిర్లక్ష్యం
బ్లాక్స్పాట్లపై రోడ్లు, భవనాల శాఖ, మోటారు వాహనాల శాఖలతో పోలీసు శాఖ సమన్వయం చేసుకుని సంయుక్తంగా తనిఖీ చేసి, శాశ్వతమైన చర్యలు తీసుకోవాలి. వేగ నిరోధకాలు, సూచికబోర్డులు, లైటింగ్, రేడియం స్టిక్కర్లు ఏర్పాటు చేయాలి. రోడ్డుపై శబ్దం వచ్చే రంబుల్ స్ట్రిప్స్ నిర్మించాలి. ఈ నిబంధనలు అంతంత మాత్రమే పాటిస్తున్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే హడావుడి చేసి, అనంతరం వదిలేస్తున్నారు. ప్రధానంగా హైవే, ఆర్ అండ్ బీ అధికారులు బ్లాక్స్పాట్లను గుర్తించినా నిధుల్లేవంటూ తప్పించుకుంటున్నారు.
39 శాతానికి తగ్గించాం
రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేక దృష్టి సారించాం. బ్లాక్స్పాట్లను పర్యవేక్షించి అక్కడ అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాం. గతేడాది సెప్టెంబరుతో పోల్చుకుంటే 39 శాతానికి ప్రమాదాలను తగ్గించగలిగాం.
- ఫక్కీరప్ప కాగినెల్లి, ఎస్పీ, అనంతపురం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏడో రోజు జోరుగా నామినేషన్లు
[ 25-04-2024]
ప్రధాన పార్టీలైన తెదేపా, కాంగ్రెస్, వైకాపా, బీఎస్పీ తదితర పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు బుధవారం జోరుగా నామినేషన్ వేశారు. -
విధేయతకు తెదేపా పట్టం
[ 25-04-2024]
అనంతపురం జిల్లా తెదేపా అధ్యక్షుడిగా జి.వెంకట శివుడు యాదవ్ నియమించారు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. -
నిర్మించలేదు.. నిర్వహణ చేతకాదు
[ 25-04-2024]
కల్లబొల్లి మాటలు చెప్పడం తప్ప జగన్ ప్రభుత్వం ఈ ఐదేళ్లలో రైతులకు ఉపయోగపడే పని ఒక్కటీ చేయలేదు. తాను నిర్మించలేదు.. -
అనంత నగరం.. పసుపుమయం
[ 25-04-2024]
అనంతపురం అర్బన్ తెదేపా అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ నామినేషన్ సందర్భంగా బుధవారం అనంతపురం అర్బన్ క్యాంపు కార్యాలయానికి ఉదయం 8 గంటలకే -
వంతెన నిర్మాణాన్ని విస్మరించిన జగన్ సర్కార్
[ 25-04-2024]
వైకాపా పాలనలో భూతద్దం పెట్టి వెతికినా అభివృద్ధి కనిపించదు. తెదేపా హయాంలో తలపెట్టిన పనుల్ని ఐదేళ్లుగా జగన్ ప్రభుత్వం పక్కనపెట్టేసింది. ఉరవకొండ మండలం కైకుంట్ల నుంచి వై.రాంపురం మార్గంలో హంద్రీనీవా -
వైకాపా అసమర్థ అభ్యర్థిని ఓడిస్తేనే అభివృద్ధి: కేశవ్
[ 25-04-2024]
ఉరవకొండ, విడపనకల్లు, వజ్రకరూరు, బెళుగుప్ప, న్యూస్టుడే: వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి అసమర్థుడని, ఆయన్ను ఈ ఎన్నికల్లో ఓడిస్తేనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యం అవుతుందని తెదేపా అభ్యర్థి, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఉద్ఘాటించారు. -
ఐదేళ్ల పాలన చూశాం.. మళ్లీ తప్పు చేయొద్దు
[ 25-04-2024]
పేరూరు డ్యాంకు నీరు తెచ్చాం, బంగారు గనులను తెరిపించి ఉద్యోగాలు కల్పించాం.. అంటూ ప్రకాశ్రెడ్డి అన్ని అబద్ధాలే చెబుతారని మాజీ మంత్రి పరిటాల సునీత ధ్వజమెత్తారు. -
రాయదుర్గం సర్వతోముఖాభివృద్ధికి కృషి : కాలవ
[ 25-04-2024]
రాయదుర్గం సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తానని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కాలవ శ్రీనివాసులు అన్నారు. బుధవారం మధ్యాహ్నం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. -
పెద్దారెడ్డి నామినేషన్.. అంతా పరేషాన్
[ 25-04-2024]
తాడిపత్రి వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి బుధవారం నామినేషన్ వేసేందుకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ప్రధాన రహదారి సీబీ రోడ్డును రెండువైపులా బ్లాక్ చేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. -
ఏడో రోజు 54 నామినేషన్ల దాఖలు
[ 25-04-2024]
జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఏడో రోజు హిందూపురం పార్లమెంటు స్థానానికి ఏడు, ఏడు అసెంబ్లీ స్థానాలకు 47 మొత్తం 54 నామినేషన్లు దాఖలు చేశారు. -
కొండలు కరిగించి.. నిధులు కొల్లగొట్టి
[ 25-04-2024]
అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైకాపా నాయకులు మట్టి వ్యాపారుల అవతారమెత్తి కొండలను కరిగించేశారు. కదిరి ప్రాంతంలోని -
నీరు కుప్పం వెళ్లింది.. చెరువు ఎండింది
[ 25-04-2024]
వైకాపా ప్రభుత్వం హంద్రీనీవా జలాలను కుప్పం తీసుకెళ్లడం ఫలితంగా ముదిగుబ్బ మండలంలోని దొరిగల్లు చెరువు ఎండింది. ఈ చెరువు కింద ఖరీఫ్లో సుమారు 500, రబీలో 200 ఎకరాల వరకు ఆయకట్టు సాగవుతోంది. -
పేరుకే పెద్దాసుపత్రి... ఓపీ సేవలు నామమాత్రం
[ 25-04-2024]
ఉరవకొండ 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీ సేవలు నామమాత్రంగా అందుతున్నాయి. దాంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా