వినూత్న ప్రయెగం.. రైతుకు తగ్గిన భారం
వ్యవసాయ పనులకు గతంలోలా కూలీలు దొరకటం లేదు. వివిధ కారణాలతో జీవనోపాధికి బెంగళూరు, ఇతర నగరాల్లోని పరిశ్రమల్లో పనిచేయడానికి లేదా ఉపాధి పనులకు వెళ్తున్నారు. కూలీల ఖర్చు పెరిగింది.
హిందూపురం గ్రామీణం, న్యూస్టుడే: వ్యవసాయ పనులకు గతంలోలా కూలీలు దొరకటం లేదు. వివిధ కారణాలతో జీవనోపాధికి బెంగళూరు, ఇతర నగరాల్లోని పరిశ్రమల్లో పనిచేయడానికి లేదా ఉపాధి పనులకు వెళ్తున్నారు. కూలీల ఖర్చు పెరిగింది. ఈ నేపథ్యంలో రైతుల ఉపయోగపడేలా హిందూపురం బిట్ ఇంజినీరింగ్ కళాశాల చివరి సంవత్సరం విద్యార్థులు సోలార్ పలకల ఆధారంతో తక్కువ ఖర్చుతో కలుపు మొక్కల తొలగింపు, విత్తనాలు విత్తే యంత్రాలను రూపొందించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎ.రమేష్, అధ్యాపకుడు సుదర్శన్ పర్యవేక్షణలో కళాశాల సమీపంలోని పొలంలో వీటిని ఉపయోగించి ప్రయోగాత్మకంగా పంటలను సాగుచేసి సత్ఫలితాలు సాధించారు.
భవిష్యత్తులో మరిన్ని యంత్రాలు తయారుచేస్తాం
సమాజానికి దోహదమయ్యేలా మాకున్న పరిజ్ఞానంతో సోలార్ పలకలను ఉపయోగించి పొలంలో విత్తనాలు విత్తే యంత్రాన్ని తయారుచేశాం. ఎకరా పొలంలో మొక్కజొన్న విత్తనాలను విత్తి సాగు చేస్తున్నాం. కావాల్సిన పరికరాలు మోటారు, బ్యాటరీ, ఇనుపచక్రాలు, సర్క్యులేట్, రాడ్స్, బాడీప్రేమ్, సోలార్ ప్యానల్, స్విచ్లు, రెండు ఇనుప మడకలు. ఇందుకు రూ.6 వేలు ఖర్చు అయ్యింది. బయట మార్కెట్లో కొనాలంటే రూ.20 వేలు అవుతుంది. ఎకరా పొలంలో ఈ యంత్రం ద్వారా విత్తనాలు విత్తుకోవడానికి ఐదుగురు కూలీలు సరిపోతారు. భవిష్యత్తులో మరెన్నో యంత్రాలను ప్రాజెక్టు రూపంలో తయారుచేయాలన్నదే మా లక్ష్యం.
- ప్రీతంరెడ్డి, సాయిరాం, ఈసీఈ, చివరి ఏడాది
రూ.2,500కే కలుపు తొలగించే యంత్రం
సోలార్ పలకల ఆధారంగా మేము తయారుచేసిన కలుపు తీసే యంత్రానికి కేవలం రూ.2,500 ఖర్చు మాత్రమే అయ్యింది. బయట మార్కెట్లో రూ.10వేలకు పైగానే పెట్టుకోవాలి. కావాల్సిన పరికరాలు మోటారు, బ్యాటరీ, సోలార్ ప్యానల్, కంట్రోలర్, సర్క్యులేట్, ఐరన్రాడ్స్, బ్లేడ్, స్విచ్. రైతుల చరవాణులకు ఈ యంత్రంలో కల్పించిన స్వీచ్తో రీఛార్జి చేసుకోవచ్చు. ఎకరా పొలంలో కలుపుతీయాలంటే ఐదుగురు కూలీలు కావాలి. వారికి రూ.2,500 ఇవ్వాలి. ఈ యంత్రం ద్వారా ఎకరా పొలంలో ఒక కూలీ మాత్రమే కలుపును తొలగించవచ్చు. లేదంటే రైతే స్వయంగా కలుపుతీసుకుంటే కూలి ఖర్చు మిగులుతుంది. భవిష్యత్తులో రైతులకు ఉపయోగేపడే మరిన్ని యంత్రాలను తయారు చేయాలన్నదే మా ఆకాంక్ష.
- ఆదర్శ్, ఆంజనేయులు, ఈసీఈ, చివరి ఏడాది
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధూప, దీప నైవేద్యం.. జగనాధీనం
[ 23-04-2024]
దేవాలయాలపై ముఖ్యమంత్రి జగన్ తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారు. తీసుకోవడమేకానీ.. ఇవ్వడం తెలియదన్నట్లుగా.. ఆలయాల నుంచి వచ్చిన కోట్ల రూపాయల ఆదాయాన్ని ఖజానాలో జమ చేసుకున్నారుగాని.. తిరిగి పైసా విదిల్చ లేదు. -
ఎన్నికల మస్కట్గా ‘వేరుసెనగ విత్తనం’
[ 23-04-2024]
ఇక నుంచి జిల్లా ఎన్నికల మస్కట్గా ‘వేరుసెనగ విత్తనం’ ఆకృతిని అధికారికంగా గుర్తించారు. ఈ విషయాన్ని కలెక్టర్ వినోద్కుమార్ ప్రకటించారు. ఉత్తమ ఎన్నికల మస్కట్ పోటీల వివరాలను సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ప్రకటించారు. -
ఊపందుకున్న నామినేషన్లు
[ 23-04-2024]
జిల్లాలో సోమవారం 37 సెట్ల నామపత్రాలు దాఖలయ్యాయి. ఇందులో అనంత లోక్సభకు 7 ఎనిమిది, అసెంబ్లీ స్థానాలకు 30 సెట్ల ప్రకారం నామినేషన్లు వచ్చాయి. -
పదిలో 24వ స్థానం
[ 23-04-2024]
పదో తరగతి పరీక్షా ఫలితాల్లో అనంతపురం జిల్లా వెనుకబడింది. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 24వ స్థానానికి పరిమితమైంది. 80.93 శాతం ఉత్తీర్ణత సాధించినా జిల్లాల వారీగా పరిశీలిస్తే చివరన ఉంది. -
గ్రానైట్ పరిశ్రమలపై గునపం
[ 23-04-2024]
చంద్రబాబు ప్రభుత్వం గ్రానైట్ పరిశ్రమలపై రాయితీ విపరీతంగా పెంచేసింది. రూ.2,300 ఉన్న రాయల్టీని వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత తగ్గిస్తాం. కరెంటు ఛార్జీల భారం లేకుండా చేస్తాం. పెద్దఎత్తున రాయితీ ఇచ్చి కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేసేలా కృషి చేస్తాం. -
ఆస్తి పాస్తులు
[ 23-04-2024]
అభ్యర్థి: కాలవ శ్రీనివాసులు -
తోయండి.. ఇది జగన్మొండి
[ 23-04-2024]
వైకాపా ఐదేళ్ల నిర్లక్ష్య పాలన.. ఉరవకొండ ఆర్టీసీ డిపో అధికారుల వైఖరి కారణంగా తరచూ బస్సులు నడి రోడ్డుపై ఆగిపోతున్నాయి. కళ్యాణదుర్గం నుంచి ఉరవకొండకు వస్తున్న పల్లె వెలుగు బస్సు పట్టణంలోని ప్రధాన రహదారిపై డిపో సమీపంలో గేర్లు పడక ఆగిపోయింది. -
బోధించడం పాపమా.. గురువులపై క్రూరత్వమా?
[ 23-04-2024]
నవ సమాజ నిర్మాతలు గురువులు.. ఎందుకో జగన్కు వీరంటేనే గిట్టదు. తనకు విద్యాబుద్ధులు నేర్పిందీ ఒక గురువే అన్న జ్ఞానాన్ని విస్మరించి.. వారిని శత్రువుల్లా చూస్తూ దండెత్తుతున్నాడు. -
‘అనంత’కు కలిసిరాని నాయకగణం
[ 23-04-2024]
వైకాపా ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి నాయకగణం కలిసి రాలేదు. ఇన్నాళ్లు ఎడ మొహం పెడ మొహంతో ఉన్నా నామినేషన్ సమయానికి అంతా కలిసి వస్తారని చెప్పుకొంటూ వచ్చారు. కానీ అదేం జరగలేదు. -
అరాచక ప్రభుత్వాన్ని సాగనంపండి: కేశవ్
[ 23-04-2024]
రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వం ఐదేళ్లుగా అరాచక పాలన సాగించిందని, వచ్చే ఎన్నికల్లో ఇంటికి సాగనంపాలని ఉరవకొండ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. -
భర్తీలో వెనుకబాటు.. పాలన నగుబాటు
[ 23-04-2024]
విద్యుత్తు శాఖ సెక్షన్ కార్యాలయాల్లో ఏఈలు లేకపోవటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జగన్ ఐదేళ్ల పాలనలో ఎస్పీడీసీఎల్ పరిధిలో అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) పోస్టుల నియామకం చేపట్టకపోవటంతో క్షేత్రస్థాయిలో ఏఈ పోస్టులు ఎక్కువ ఖాళీలు ఏర్పడ్డాయి. -
పదో తరగతి ఫలితాల్లో విద్యార్థుల సత్తా
[ 23-04-2024]
పదో తరగతి పరీక్ష ఫలితాల్లో విద్యార్థులు సత్తా చాటారు. కళ్యాణదుర్గం మండలంలో 69.12శాతం ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 27మంది విద్యార్థులు 500పైగా మార్కులు సాధించారు. -
ధర్మవరంలో వైకాపాకు ఝలక్
[ 23-04-2024]
ధర్మవరం నియోజకవర్గంలో వైకాపాలో బీసీ నాయకులుగా మెలిగిన వారు ఆ పార్టీకే ఝలక్ ఇస్తున్నారు. కొంతకాలంగా ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డితో విభేదాలున్న నాయకులు ఒక్కొక్కొరు పార్టీ నుంచి బయటకు వస్తున్నారు. -
తెదేపాతో అర్హులందరికీ సంక్షేమం: సునీత
[ 23-04-2024]
తెదేపాలో చేరిన వారు భయపడాల్సిన పనిలేదు. పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని మాజీ మంత్రి పరిటాల సునీత భరోసా ఇచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM