దసరాకు రైలెక్కలేం!
పేద, మధ్య తరగతి వర్గాలకు రైలు ప్రయాణం అందుబాటులో ఉంది. బస్సు, ప్రైవేటు వాహనాలతో పోల్చితే సగం ధరకే ఊరెళ్లడానికి వీలవుతుంది. ప్యాసింజర్ రైలులో ఛార్జీ తక్కువగా ఉంటుంది. అయితే మూడు, నాలుగు నెలల ముందే రిజర్వు చేసుకుంటేనే సీటు లభిస్తుంది.
అనంత రైల్వే స్టేషన్లో ప్రయాణికుల రద్దీ
అనంతపురం(రైల్వే), న్యూస్టుడే: పేద, మధ్య తరగతి వర్గాలకు రైలు ప్రయాణం అందుబాటులో ఉంది. బస్సు, ప్రైవేటు వాహనాలతో పోల్చితే సగం ధరకే ఊరెళ్లడానికి వీలవుతుంది. ప్యాసింజర్ రైలులో ఛార్జీ తక్కువగా ఉంటుంది. అయితే మూడు, నాలుగు నెలల ముందే రిజర్వు చేసుకుంటేనే సీటు లభిస్తుంది. ముంబయి, న్యూదిల్లీ రైళ్లకు మూడు నెలలు ముందుగా రిజర్వేషన్ చేసుకోవాల్సిందే. హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు వైపు వెళ్లాలంటే కనీసం నెల రోజులు ముందుగా రిజర్వు చేసుకోవాలి. ఇక సెలవు రోజుల్లో పరిస్థితి దయనీయంగా ఉంటుంది. రద్దీ రోజుల్లో ప్రత్యేక రైళ్లు నడపాలని డిమాండు ఉన్నా అనంతపురం జిల్లా మీదుగా ఒకటి, రెండు రైళ్లు కూడా రావడం లేదు. ప్రస్తుతం దసరాకు ఊరెళ్దామనుకుంటే రైళ్లన్నీ వెయిటింగ్ జాబితాలో ఉన్నాయి.
విజయవాడ వెళ్లాలంటే కష్టమే
జిల్లాకు చెందిన విద్యార్థులు సుమారు 25 వేల మంది విజయవాడ, గుంటూరులో ఇంటర్మీడియట్ చదువుతున్నారు. సెలవులు రాగానే తల్లిదండ్రులు విజయవాడకు వెళ్లి పిల్లలను తీసుకురావాలి. సెలవులు ముగిసిన తర్వాత వదలాలి. విజయవాడ వెళ్లే రైళ్లలో సీట్లు ఈనెల 17 వరకు ఖాళీ లేవు. ధర్మవరం రైలులో కొన్ని రోజుల్లో మాత్రమే ఖాళీలు ఉన్నాయి. దీంతో తల్లిదండ్రులు ముగ్గురు, నలుగురు కలుసుకొని ప్రైవేటు వాహనాలను అద్దెకు తీసుకుని విజయవాడకు బయలుదేరారు.
* ప్రశాంతి ఎక్స్ప్రెస్(18464) రైలులో ఈనెల 17 వరకు స్లీపర్, 3ఏసీ, 2 ఏసీలోనూ ఖాళీలు లేవు. తిరుగు ప్రయాణంలో 18463లో స్లీపర్, 3 ఏసీ, 2ఏసీ 12 వరకు సీట్లు లేవు.
* కొండవీడు ఎక్స్ప్రెస్(17212)లో విజయవాడ వెళ్లడానికి ఈనెల 25 వరకు వెయిటింగ్ లిస్టు ఉంది. తిరుగు ప్రయాణంలో 17211 విజయవాడ నుంచి అనంతపురం రావడానికి 17 వరకు సీట్లు లేవు.
* ధర్మవరం-విజయవాడ(17216) రైలుకు స్లీపర్ కోచ్లో ఈనెల 13 వరకు ఖాళీలు లేవు. 3ఏసీ కోచ్లో 3,4 మాత్రమే ఖాళీలు ఉన్నాయి. 11వ తేదీ వరకు వెయిటింగ్ జాబితా ఉంది.
హైదరాబాద్ వైపూ అంతే..
జిల్లాకు చెందిన యువత ఎక్కువమంది ఉపాధి నిమిత్తం హైదరాబాద్లో స్థిరపడ్డారు. కొన్ని దశాబ్దాలుగా హైదరాబాద్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని కావడంతో జిల్లా వాసులకు అక్కడ సంబంధాలు ఉన్నాయి. అక్కడ్నుంచి పండగ వేళ జిల్లాకు వచ్చి వెళుతుంటారు. సాఫ్ట్వేర్ ఇంజినీర్లతోపాటు ప్రైవేటు పరిశ్రమలు, ఆసుపత్రుల్లో పనిచేస్తున్న సిబ్బంది అధికంగా ఉన్నారు. హైదరాబాద్ నుంచి అనంతపురం మీదుగా కాచిగూడ-యశ్వంతపూర్, కాచిగూడ-మైసూరు మధ్య రెండు రైళ్లు రోజూ నడుస్తున్నాయి. కాచిగూడ-మైసూర్(12786) రైలులో ఈనెల 11 వరకు సీట్లు లేవు. కాచిగూడ-యశ్వంతపూర్(17604)లోనూ 12 వరకు ఖాళీల్లేవ్.
ఇతర పట్టణాలకూ..
జిల్లా కేంద్రం నుంచి ఇతర పట్టణాలకు ప్రయాణం భారంగా మారుతోంది. అనంతపురం నుంచి ముంబయి, న్యూదిల్లీ వైపు రైళ్లలోనూ అక్టోబరు నెలాఖరు దాకా ఖాళీలు లేవు. ముంబయికి వెళ్లే లోకమాన్యతిలక్ కుర్లా(11014) రైలులో అక్టోబరు 30 వరకు సీట్లు ఖాళీ లేవు. న్యూదిల్లీ వైపు వెళ్లే 12627 రైలులో అక్టోబరు 30 దాకా ఏ కోచ్లలోనూ ఖాళీలు లేవు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాడు-నేడు జగన్మాయ
[ 19-04-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రగతి పనులను అçËకెక్కించారు. నాడు-నేడు పథకం కింద బడులను ఎంపిక చేశారే తప్ప అభివృద్ధి పనులు పూర్తి చేయడానికి తగిన నిధులు కేటాయించడం లేదు. -
నామినేషన్ల పర్వం ఆరంభం
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల సమరం ఆరంభమైంది. కీలక ఘట్టమైన నామినేషన్ల పర్వం మొదలైంది. -
తండ్రి ఆశయాన్నీ నెరవేర్చలేని జగన్: షర్మిల
[ 19-04-2024]
‘‘హంద్రీనీవా పథకాన్ని పూర్తి చేసి అనంత జిల్లా రైతులకు లక్ష ఎకరాలకు సాగు నీరివ్వాలన్నది దివంగత సీఎం వైఎస్సార్ లక్ష్యం. -
నిర్లక్ష్యపు జాడలో.. నీరెరగని కాలువలు
[ 19-04-2024]
కాలువల్లో నీరు పారినపుడే వ్యవసాయం ఆశాజనకంగా ఉంటుంది. అనంతపురం జిల్లాలో వ్యవసాయానికి కాలువలే ఆయువుపట్టు. -
నామపత్రాల్లో అభ్యర్థుల ఆస్తిపాస్తులు
[ 19-04-2024]
నామినేషన్ మొదలైన తొలిరోజు పలు పార్టీల అభ్యర్థులు వారి ఆస్తిపాస్తులు, విద్యార్హత, కేసుల వివరాలను నామపత్రాల్లో దాఖలు పర్చారు. -
నేడు బాలకృష్ణ నామినేషన్ పత్రాల దాఖలు
[ 19-04-2024]
హిందూపురం అసెంబ్లీ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే బాలకృష్ణ, ఆయన సతీమణి వసుంధరలు శుక్రవారం మధ్యాహ్నం 12.15 గంటలకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు. -
వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం.. ప్రమాదకరం
[ 19-04-2024]
ఈ నెల 16వ తేదీన ముదిగుబ్బ మండలంలోని మలకవేములక్రాస్లో మిద్దెపై ఆడుకుంటున్న ఎనిమిదేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు 11కేవీ విద్యుత్తు తీగలు తగలడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. -
విశ్రాంత ఉద్యోగుల పాలిట జగనాసురుడు
[ 19-04-2024]
సుమారు 35 ఏళ్ల పాటు సేవలు అందించిన విశ్రాంత ఉద్యోగులకు జగన్ సర్కారు పగలే చుక్కలు చూపిస్తోంది. -
జగన్ పాలనలో అన్నీ కోతలే
[ 19-04-2024]
యువతను ఆకర్షించి అధికారంలోకి వచ్చిన వైకాపా చివరకు.. ఆ వర్గానికే షాకిచ్చింది. -
నామినేషన్ల పర్వం ప్రారంభం
[ 19-04-2024]
మొదటి రోజు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా జరిగింది. కేంద్ర ఎన్నికల కమిషన్ సార్వత్రిక ఎన్నికలు నోటిఫికేషన్ విడుదల కావడంతో గురువారం నామపత్రాల ప్రక్రియ ప్రారంభమైంది. -
నేడు కణేకల్లులో చంద్రబాబు సభ
[ 19-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు శుక్రవారం అనంతపురం జిల్లా కణేకల్లుకు రానున్నారు. -
రైతులను విస్మరించిన వైకాపా ప్రభుత్వం
[ 19-04-2024]
రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వం ఐదేళ్లలో రైతులను పూర్తిగా విస్మరించిందని తెదేపా అభ్యర్థి పయ్యావుల కేశవ్ ఆరోపించారు. -
గ్రామాల అభివృద్ధికే రాజకీయాల్లోకి.. : అమిలినేని
[ 19-04-2024]
గ్రామాల అభివృద్ధి కోసమే రాజకీయాల్లోకి వచ్చానని కళ్యాణదుర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు స్పష్టం చేశారు. -
కోడ్ ఉల్లంఘించి ఫ్లెక్సీల ఏర్పాటు
[ 19-04-2024]
ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి అధికార పార్టీ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. -
గొర్రెల యజమానులతో రెవెన్యూ అధికారి డబ్బుల డిమాండ్
[ 19-04-2024]
గొర్రెల యాజమానుల నుంచి ఓ రెవెన్యూ అధికారి డబ్బులు డిమాండ్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
తాడిపత్రిలో భగ్గుమన్న భానుడు
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలోని తాడిపత్రిలో గురువారం అత్యధికంగా 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు సహదేవరెడ్డి, నారాయణస్వామి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్