logo

టైర్‌ పంక్చరై కారు బోల్తా

మండలంలోని వెలగమేకలపల్లి మలుపు వద్ద జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం టైర్‌ పంక్చర్‌ కావడంతో కారు అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులుగా పనిచేస్తున్న చంద్రశేఖర్‌, సురేఖ దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలసి దైవ దర్శనం కోసం మంత్రాలయానికి మధ్యాహ్నం కారులో పయనమయ్యారు.

Published : 02 Oct 2022 02:58 IST

భార్యాభర్త, ఇద్దరు పిల్లలకు గాయాలు

గాయపడిన తల్లి సురేఖను చూసి రోదిస్తున్న చిన్నారి స్వీటీ

సోమందేపల్లి, న్యూస్‌టుడే: మండలంలోని వెలగమేకలపల్లి మలుపు వద్ద జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం టైర్‌ పంక్చర్‌ కావడంతో కారు అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులుగా పనిచేస్తున్న చంద్రశేఖర్‌, సురేఖ దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలసి దైవ దర్శనం కోసం మంత్రాలయానికి మధ్యాహ్నం కారులో పయనమయ్యారు. వెలగమేకలపల్లి మలుపు వద్దకు వేగంగా చేరుకొన్న సమయంలో ఒక్కసారిగా కారు టైర్‌ పంక్చర్‌ కావడంతో అదుపుతప్పి రహదారి పక్కన బోల్తా పడింది. కారులో ఉన్న దంపతులు, పిల్లలు శృతి, స్వీటీ గాయపడ్డారని ఏఎస్సై మురళీమోహన్‌ తెలిపారు. ప్రైవేట్‌ అంబులెన్స్‌ను ఘటనా స్థలానికి రప్పించిన చంద్రశేఖర్‌..భార్యాపిల్లలను చికిత్సకు బెంగళూరుకు తరలించారు. ప్రమాదంలో తల్లి సురేఖకు ముక్కు, గడ్డం కింద గాయాలతో రక్తమోడుతున్న విషయాన్ని గమనించిన చిన్న కుమార్తె స్వీటీ భయంతో రోదించడం పలువురి మనసులను కలచివేసింది. 

ఘటనా స్థలంలో నుజ్జయిన కారు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని