logo

‘రాష్ట్రాన్ని దోచుకుంటోన్న వైకాపా’

వైకాపా ప్రభుత్వం ప్రజలను అన్నివిధాలా దోచుకుంటోందని భాజపా జిల్లా అధ్యక్షుడు వజ్ర భాస్కర్‌రెడ్డి ఆరోపించారు. పార్టీ అధిష్ఠానం మేరకు చేపట్టిన పోరుయాత్ర ఆదివారం పట్టణంలోని 11వ వార్డులో ముగిసింది.

Published : 03 Oct 2022 05:14 IST

ప్రసంగిస్తున్న భాజపా జిల్లా అధ్యక్షుడు వజ్ర భాస్కర్‌రెడ్డి

హిందూపురం అర్బన్‌ న్యూస్‌టుడే: వైకాపా ప్రభుత్వం ప్రజలను అన్నివిధాలా దోచుకుంటోందని భాజపా జిల్లా అధ్యక్షుడు వజ్ర భాస్కర్‌రెడ్డి ఆరోపించారు. పార్టీ అధిష్ఠానం మేరకు చేపట్టిన పోరుయాత్ర ఆదివారం పట్టణంలోని 11వ వార్డులో ముగిసింది. ఈ కార్యక్రమానికి హాజరైన భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ ఇసుక, లిక్కర్‌ మాఫియాలుగా, భూకబ్జాలకు పాల్పడుతూ వైకాపా నాయకులు రాష్ట్రాన్ని భ్రష్టుపట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం కష్టాల్లో ఉన్న ప్రజలకు బియ్యం అందజేయమంటే రాష్ట్ర ప్రభుతానికి చేతకాలేదన్నారు. ప్రజల సమస్యలు పట్టించుకోవటం లేదని, అందువల్ల తాము పోరుయాత్ర చేపట్టాల్సి వచ్చిందన్నారు. ఈ సందర్భంగా ఆంజనేయస్వామి దేవాలయంలో మొక్కలు నాటారు. అంతకుముందు గాంధీచౌక్‌లోని మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పార్థసారథి, రమేష్‌రెడ్డి, ఆదర్శకుమార్‌, కరణం నగేష్‌, రమణమూర్తి, దివాకర్‌, అంజలి, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని