logo

Nara Lokesh: శివయ్య ధైర్యానికి హ్యాట్సాఫ్‌: నారా లోకేశ్‌

నికార్సైన కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి బలమని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. రెండు రోజుల కిందట ఎం.అగ్రహారం గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చేపట్టిన గుడ్‌మార్నింగ్‌ కార్యక్రమంలో గ్రామానికి చెందిన తెదేపా నాయకుడు శివయ్య ‘మీ పథకాలు మాకొద్దు’ అంటూ ఎమ్మెల్యే ఇస్తున్న బుక్‌లెట్‌ను తీసుకునేందుకు నిరాకరించాడు.

Updated : 03 Oct 2022 09:16 IST

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ చేసిన ట్వీట్‌ చిత్రం

తాడిమర్రి, న్యూస్‌టుడే: నికార్సైన కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి బలమని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. రెండు రోజుల కిందట ఎం.అగ్రహారం గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చేపట్టిన గుడ్‌మార్నింగ్‌ కార్యక్రమంలో గ్రామానికి చెందిన తెదేపా నాయకుడు శివయ్య ‘మీ పథకాలు మాకొద్దు’ అంటూ ఎమ్మెల్యే ఇస్తున్న బుక్‌లెట్‌ను తీసుకునేందుకు నిరాకరించాడు. ఈ సంఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

ఈ ఘటనపై ‘ఈనాడు- ఈటీవీ’ల్లో కథనాలు వచ్చాయి. దీనిపై ఆదివారం నారా లోకేశ్‌ ట్విటర్‌ ద్వారా స్పందించారు. శివయ్య లాంటి నికార్సైన కార్యకర్తలే తెదేపా బలమని అన్నారు. ఆ కుటుంబానికి అందుతున్న పథకాలను ఆపాలని అధికారులను ఆదేశించే హక్కు ఎమ్మెల్యేకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. బీసీ కుటుంబానికి పథకాలను ఆపేయడం జగన్‌ నియంత పాలనకు నిదర్శనమని అన్నారు. ఈ ట్వీట్‌ ప్రస్తుతం ధర్మవరం రాజకీయ వర్గాల్లో చర్చనీయంగా మారింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని