logo

పంచాయతీకి నిధులు కేటాయించండి

గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని గుంతకల్లు మండలం నాగసముద్రం గ్రామ వైకాపా సర్పంచి నరసింహులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గ్రామంలో పైప్‌లైన్‌ దెబ్బతిని నీటి సమస్య ఏర్పడంతో ఆయన తన సొంత నిధులతో మరమ్మతులు చేయించారు.

Published : 04 Oct 2022 02:35 IST

ప్రభుత్వానికి వైకాపా సర్పంచి  డిమాండు

గుంతకల్లు గ్రామీణం, న్యూస్‌టుడే: గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని గుంతకల్లు మండలం నాగసముద్రం గ్రామ వైకాపా సర్పంచి నరసింహులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గ్రామంలో పైప్‌లైన్‌ దెబ్బతిని నీటి సమస్య ఏర్పడంతో ఆయన తన సొంత నిధులతో మరమ్మతులు చేయించారు. ఈ సందర్భంగా సర్పంచి మాట్లాడుతూ 18 నెలలుగా పంచాయతీ ఖాతాల్లో నిధులు లేకపోవడంతో సమస్యల పరిష్కారానికి ఇబ్బందిగా ఉందని వాపోయారు. పంచాయతీ ఖాతాలోని దాదాపు రూ.14 లక్షలు ప్రభుత్వం తీసుకున్నట్లు తెలిపారు. పైసా నిధులు లేకపోవడంతో నీటి మోటార్లు, పైప్‌లైన్లకు మరమ్మతులు, డ్రైనేజీల శుభ్రం వంటి పనుల కోసం దాదాపు రూ.7లక్షల నుంచి రూ.8 లక్షల వరకు తన సొంత నిధులు ఖర్చు పెట్టినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం సర్పంచుల బాధలు అర్థం చేసుకుని నిధులు మంజూరు చేయాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని