logo

అత్యవసర వాహనానికే ఆపద

రావులచెరువు గ్రామానికి చెందిన కుళ్లాయప్పకు డయాలసిస్‌ చేయించడానికి అనంతపురం తీసుకెళ్లాలని 108 వాహనానికి సమాచారం అందించారు. సోమవారం ధర్మవరం నుంచి బయలుదేరిన 108 వాహనం చిన్నూరు, ధర్మపురి గ్రామ మధ్యలో వంతెన వద్ద కుడివైపు టైర్లు పగిలిపోయాయి.

Published : 04 Oct 2022 02:35 IST

టైరు పగలడంతో ఆగిపోయిన 108 వాహనం

ధర్మవరం పట్టణం, న్యూస్‌టుడే: రావులచెరువు గ్రామానికి చెందిన కుళ్లాయప్పకు డయాలసిస్‌ చేయించడానికి అనంతపురం తీసుకెళ్లాలని 108 వాహనానికి సమాచారం అందించారు. సోమవారం ధర్మవరం నుంచి బయలుదేరిన 108 వాహనం చిన్నూరు, ధర్మపురి గ్రామ మధ్యలో వంతెన వద్ద కుడివైపు టైర్లు పగిలిపోయాయి. పాత టైర్లు కావడంతో వెనుక టైరు లోపల ఉన్న కడ్డీలు బయటకు వచ్చాయి. స్టెపినీ టైరు కూడా లేకపోవడంతో వాహనాన్ని అక్కడే నిలిపేశారు. అనంతరం కొత్తచెరువు మండలం 108 వాహనాన్ని రప్పించి రోగిని తీసుకెళ్లారు. అత్యవసర వాహనానికే ఆపద వచ్చిందని ప్రజలు చర్చించుకుంటున్నారు.

టైరు నుంచి బయటకు వచ్చిన కడ్డీలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు