పంట.. పండిందప్పా
పంటకు నీటితడి అందించేందుకు ధర్మవరం డివిజన్ పరిధిలోని కనగానపల్లి మండలం చంద్రాచర్ల గ్రామానికి చెందిన గ్రామీణ తపాలాశాఖ చిరుద్యోగి, రైతు భీమనేని శ్రీనివాస్చౌదరి కొత్త పద్ధతి అనుసరించారు. తక్కువ నీటితో వేరుసెనగలో చక్కటి దిగుబడి సాధించారు.
ఏర్పాటు చేసిన స్ప్రింక్లర్
ధర్మవరం పట్టణం, న్యూస్టుడే: పంటకు నీటితడి అందించేందుకు ధర్మవరం డివిజన్ పరిధిలోని కనగానపల్లి మండలం చంద్రాచర్ల గ్రామానికి చెందిన గ్రామీణ తపాలాశాఖ చిరుద్యోగి, రైతు భీమనేని శ్రీనివాస్చౌదరి కొత్త పద్ధతి అనుసరించారు. తక్కువ నీటితో వేరుసెనగలో చక్కటి దిగుబడి సాధించారు.
ఎక్కువ విస్తీర్ణంలో తడి..
స్ప్రింకర్ల ద్వారా నీటితడి అందించడం కాస్త కష్టమే. పొలాల్లో పైపులు ఎత్తుకొని నడవడం ఇబ్బందికరంగా ఉంటుంది. శ్రీనివాస్చౌదరికి 16 ఎకరాల పొలం ఉంది. అందులో డ్రిప్కు ఏర్పాటుచేసిన పైపులకు 20 అడుగులకు ఒకచోట రంధ్రాలు ఏర్పాటు చేయించారు. అక్కడ 3/4 ఇంచుల డ్రిప్ వైరు లాగారు. చివరిభాగంలో కడ్డీకి ప్లాస్టిక్ పైపు ఏర్పాటుచేసి వాటికి స్ప్రింక్లర్ గన్ అమర్చారు. ఒక్కోదానికి రూ.800 వెచ్చించారు. నీటితడి సులభతరమవడంతో పాటు ఎక్కువ విస్తీర్ణంలో అందించేందుకు దోహదపడిందని రైతు పేర్కొన్నారు.
వేరుసెనగ తొలగిస్తున్న కూలీలు
పొలం వద్దే కొనుగోలు..
పైపులతో 20 గన్నుల ద్వారా నీటితడి అందించేవారు. కొత్త విధానంలో నీటి పొదుపుతోపాటు 40 స్ప్రింకర్ల గన్నులతో పంటను తడిపారు. కే-6 రకం విత్తనం నార్పల నుంచి కొనుగోలు చేశారు. క్వింటా రూ.12 వేలు చొప్పున 12 క్వింటాళ్లకు రూ.1.44 లక్షలు, మందుల పిచికారీ, పంట తొలగింపు, ఇతర ఖర్చులు కింద సుమారు రూ.2.56 లక్షలు వెచ్చించారు. 320 బస్తాలు దిగుబడి వచ్చింది. పొలం వద్దే వ్యాపారులు బస్తా(46 కిలోలు) రూ.3,400 చొప్పున కొనుగోలు చేశారు. పశుగ్రాసం రూ.40 వేలకు విక్రయించారు. పెట్టుబడిపోను రూ.7.18 లక్షల రాబడి వచ్చింది.
శ్రమ తక్కువ..
-భీమనేని శ్రీనివాస్ చౌదరి, రైతు
వ్యవసాయానికి రెండు దఫాలుగా విద్యుత్తు సరఫరా చేస్తారు. ఆ సమయంలో తుంపర పరికరాలు మార్చుకోవాలంటే ఇబ్బందికరంగా ఉంటుంది. డ్రిప్వైర్ ఏర్పాటు చేసిన స్ప్రింకర్ల పైపులు సులభంగా మార్చుకోవచ్చు. నీళ్లు కూడా ఆదా అవుతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరిశ్రమలు తేవడం తెదేపా బ్రాండ్.. తరిమికొట్టడం జగన్ బ్రాండ్: చంద్రబాబు
[ 28-03-2024]
రాయలసీమ ద్రోహి ఎవరో ప్రజలే తేల్చాలని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
ఉమ్మడి జిల్లాలో చంద్రబాబు పర్యటన నేడు
[ 28-03-2024]
తెదేపా అధినేత చంద్రబాబు గురువారం ఉమ్మడి అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. రాప్తాడు, బుక్కరాయసముద్రం, కదిరి ప్రాంతాల్లో ప్రజాగళం పేరిట పర్యటించనున్నారు. -
జలకళ ఏదీ జగన్?
[ 28-03-2024]
జలకళ పథకాన్ని సీఎం జగన్ అట్టహాసంగా ప్రారంభించారు. దరఖాస్తు చేసుకున్న రైతుల్లో అర్హులందరికీ పొలాల్లో బోర్లు తవ్విస్తాం అని ఊదరగొట్టారు. పథకం ప్రారంభమైన కొన్ని రోజులకే మడమ తిప్పారు. -
ధర్మవరం భాజపాకే కూటమి అభ్యర్థిగా సత్యకుమార్
[ 28-03-2024]
-
పోలింగ్ కేంద్రం పక్కనే కోడ్ ఉల్లంఘన
[ 28-03-2024]
అక్కడా.. ఇక్కడా ఎందుకు? డైరెక్టుగా పోలింగ్ కేంద్రం పక్కనే కోడ్ ఉల్లంఘన జరుగుతున్నా.. పట్టించుకునేవారే కరవయ్యారు. -
సీఎం సభకు బస్సులు.. ప్రయాణికుల పాట్లు
[ 28-03-2024]
సీఎం జగన్ ఇతర జిల్లాల్లోని ఎన్నికల పర్యటన సందర్భంగా కళ్యాణదుర్గం డిపో నుంచి 26 బస్సులను తరలించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
ఐదేళ్లయినా అధికారులిక్కడే..
[ 28-03-2024]
మున్సిపల్ విభాగంలో పలువురు కీలక అధికారులు ఒకేచోట మూడేళ్లు దాటినా అక్కడే ఉంటున్నారు. అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నందువల్లే వారిని బదిలీ చేయడం లేదన్న విమర్శ ఉంది. -
మంచినీరు వృథా.. వ్యధ..
[ 28-03-2024]
ఉరవకొండ పట్టణంలో గ్రామీణ నీటి సరఫరా (ఆర్డబ్ల్యూఎస్) అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రజలు కష్టాలు ఎదుర్కొంటున్నారు. -
భూగర్భ మురుగు కాలువ వ్యవస్థకు మోక్షమెన్నడు?
[ 28-03-2024]
గుంతకల్లు మున్సిపాలిటీలో సమగ్ర భూగర్భ మురుగు కాలువల వ్యవస్థ ఏర్పాటుకు సంబంధించిన నివేదిక మూలనపడింది. పట్టణంలో రోడ్లు బాగున్నా.. సరైన కాలువలు లేకపోవడంతో మురుగు రోడ్లపై ప్రవహిస్తుంది. -
తాగునీటి సమస్య పరిష్కరించకుండా విమర్శలా?
[ 28-03-2024]
నగర ప్రజలంతా తీవ్ర తాగునీటి ఎద్దడితో అల్లాడుతుంటే సమస్యను పరిష్కరించకుండా వైకాపా నాయకులు తెదేపాపై అనవసర విమర్శలు చేస్తున్నారని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు గౌస్మోహిద్దీన్ మండిపడ్డారు. -
అనంత నగరపాలక కార్యాలయంలో సినిమా చిత్రీకరణ
[ 28-03-2024]
అనంత నగరపాలక కార్యాలయ ఆవరణలో సినిమా చిత్రీకరణపై విమర్శలు వస్తున్నాయి. బుధవారం సాయంత్రం నగరపాలక కార్యాలయంలో సెట్టింగ్లతో సినిమా తీశారు. -
30 నుంచి భవిత కేంద్రాల్లో శిబిరాలు
[ 28-03-2024]
ఏపీ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో జల్లాలో గుర్తించిన భవిత కేంద్రాల్లో దివ్యాంగ పిల్లలకు అసెస్మెంట్ శిబిరాలు నిర్వహించనున్నట్లు అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ మీనాక్షి తెలిపారు. -
సి-విజిల్ ఫిర్యాదులు పరిష్కరించండి
[ 28-03-2024]
ఎన్నికల నియమావళి మేరకు ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన వాణిజ్య స్థలాలతోపాటు, కార్యాలయాల్లో ఎటువంటి రాజకీయ పార్టీల ప్రకటనలు హోర్డింగ్లు, పోస్టర్లు, బ్యానర్లను అనుమతించవద్దని కలెక్టర్ అరుణ్బాబు ఆదేశించారు. -
ఖాద్రీశుడి సమ్మోహనం
[ 28-03-2024]
కదిరి లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం మోహినీ అలంకారంలో ఖాద్రీశుడు దర్శనమిచ్చారు. ఆలయం నుంచి బయలుదేరిన స్వామి తిరువీధుల్లో విహరించారు. -
రూ.1.67 కోట్ల మళ్లింపుపై కేసు
[ 28-03-2024]
కదిరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వ్యవసాయ విభాగంలో క్షేత్రస్థాయి అధికారి (ఫీల్డ్ ఆఫీసర్) వెంకటనాయుడు ఓడీ ఖాతా నుంచి సేవింగ్ ఖాతాలకు సుమారు రూ.1.67 కోట్లు మళ్లించిన వ్యవహారంపై కదిరి పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. -
సైబర్ పోలీసుల అదుపులో చిలమత్తూరు యువకుడు
[ 28-03-2024]
హైదరాబాద్ సైబర్ క్రైం బ్రాంచ్ పోలీసులు బుధవారం శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం సంజీవరాయనపల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. -
నలుగురు ఉద్యోగుల సస్పెన్షన్
[ 28-03-2024]
ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి రాజకీయ ప్రచారంలో పాల్గొన్న నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ ఓ ప్రకటనలో తెలిపారు. -
ముగ్గురు వాలంటీర్ల తొలగింపు
[ 28-03-2024]
ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా మంగళవారం వైకాపా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న స్థానిక గ్రామ వాలంటీర్లు శివయ్య, రమేశ్, మహబూబ్ బాషాలను విధుల నుంచి తొలగిస్తూ బుధవారం ఎంపీడీవో విజయలలిత ఉత్తర్వులు జారీ చేశారు. -
పది పరీక్షలకు 2,203 మంది గైర్హాజరు
[ 28-03-2024]
జిల్లా వ్యాప్తంగా పదో తరగతి ప్రధాన పరీక్షలు బుధవారం జరిగిన సాంఘికశాస్త్రం పరీక్షతో ముగిసాయి.
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
పరిశ్రమలు తేవడం తెదేపా బ్రాండ్.. తరిమికొట్టడం జగన్ బ్రాండ్: చంద్రబాబు