logo

అధ్వాన రహదారికి తెదేపా నాయకుల మరమ్మతు

అధ్వానంగా మారిన రహదారిని తెదేపా నాయకులు బాగు చేశారు. మండలంలోని దర్గాహొన్నూరులో వాటర్‌ట్యాంకు నుంచి సచివాలయం, ఉన్నత పాఠశాల వరకు వన్నళ్లిరోడ్డు దెబ్బతింది.

Published : 05 Oct 2022 01:56 IST

దర్గాహొన్నూరు (బొమ్మనహాళ్‌), న్యూస్‌టుడే: అధ్వానంగా మారిన రహదారిని తెదేపా నాయకులు బాగు చేశారు. మండలంలోని దర్గాహొన్నూరులో వాటర్‌ట్యాంకు నుంచి సచివాలయం, ఉన్నత పాఠశాల వరకు వన్నళ్లిరోడ్డు దెబ్బతింది. వర్షపు నీరు, మురుగు నిలిచి స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మాజీ సర్పంచి కేశప్ప ఆధ్వర్యంలో 5 ట్రాక్టర్ల కంకర, ఇసుక తోలి చదును చేయించారు. రాకపోకలను అనువుగా చేశారు. నాయకులు కుమ్మరి వన్నూరప్ప, ఆనంద్‌, రఫీ, వీఎల్‌ రామాంజనేయులు, నాగరాజు, చెట్ల వన్నప్ప, ముక్కన్న తదితరులు పాల్గొన్నారు. దీర్ఘకాలిక సమస్య పరిష్కారమైందని గ్రామస్థులు అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని