పండగపూట విషాదం
పండగపూట ఆ ఇంట విషాదం నెలకొంది. విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన ఉరవకొండ మండలంలో చోటుచేసుకుంది.
విద్యుదాఘాతంతో యువకుడి మృతి
మారుతి (పాతచిత్రం)
ఉరవకొండ: పండగపూట ఆ ఇంట విషాదం నెలకొంది. విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన ఉరవకొండ మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబసభ్యుల వివరాల మేరకు.. నింబగల్లులోని నర్సింహ, భీమక్క దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తెకు వివాహమైంది. కుమారుడు మారుతిని పదోతరగతి వరకు చదివించారు. కౌలుకు మిరప సాగు చేస్తున్నారు. నీరు పెట్టేందుకు మారుతి(21) మంగళవారం ఉదయం తల్లిదండ్రులతో కలిసి ఉదయం పొలానికి వెళ్లాడు. అనంతరం మోటారుని ఆపేసే క్రమంలో విద్యుదాఘాతానికి గురయ్యాడు. అక్కడున్న తోటి రైతులు గమనించి పక్కకు లాగినా అప్పటికే మృతి చెందాడు. ఒక్కగానొక్క కొడుకు.. కుటుంబానికి బాసటగా నిలుస్తాడనుకున్న తరుణంలో వదిలివెళ్లావంటూ కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
పోస్టుమార్టంపై గందరగోళం... పోలీసులు మృతదేహాన్ని ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి మృతి చెందినట్లు నిర్ధారించారు. తమ అనుమతి లేకుండానే పోస్టుమార్టం ఎలా చేస్తారని బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రి ప్రాంగణంలో ఆందోళనకు దిగారు. కొద్దిసేపు గందరగోళ వాతావరణం నెలకొంది. పోలీసులు సర్దిచెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సాగు పడిపోయింది జగన్.. సాగనంపేందుకు ‘అనంత’ సిద్ధం
[ 18-04-2024]
అనంతపురం జిల్లా అంటేనే గుర్తొచ్చేది వేరుసెనగ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా పంట పండించేది అనంత జిల్లాలోనే.. ఇక్కడి రైతులకు ప్రధాన పంట వేరుసెనగ. ఇంతటి ప్రాధాన్యం ఉన్న పంట సాగు విస్తీర్ణం ఏటా తగ్గిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. -
నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన ఘట్టం నామినేషన్ల పర్వానికి గురువారం నుంచి తెరలేవనుంది. జిల్లాలో అనంత పార్లమెంటు (లోక్సభ), 8 శాసనసభా స్థానాలకు ఏకకాలంలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. -
లీజు పేరుతో ట్రాక్టర్లు మాయం ఘరానా ముఠా అరెస్టు
[ 18-04-2024]
ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో లీజు పేరిట ట్రాక్టర్లు తీసుకెళ్లి ఇతర ప్రాంతాల్లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్న ఘరానా ముఠా కేసును ఛేదించి కీలక సభ్యులను అరెస్టు చేసినట్లు శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి వెల్లడించారు. -
తెదేపా ప్రతినిధులపై వైకాపా శ్రేణుల దాడి
[ 18-04-2024]
ఉరవకొండలో తెదేపా ప్రతినిధులపై వైకాపా శ్రేణులు దాడికి పాల్పడ్డారు. తెదేపా బూత్ కన్వీనరు నాగభూషణ, నార్పలకు చెందిన అతని మిత్రుడు సంతోశ్తో కలిసి బుధవారం సాయంత్రం డ్రైవర్స్ కాలనీలో ఓటరు జాబితా పరిశీలనకు వెళ్లారు. -
19న చంద్రబాబు ఎన్నికల ప్రచార సభ
[ 18-04-2024]
ణేకల్లులో ఈనెల 19న సాయంత్రం తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో జరిగే ఎన్నికల ప్రచార సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. -
వైద్యం చేయకుండానే రోగుల పేరిట బిల్లులు!
[ 18-04-2024]
డోన్లోని ఒక ప్రైవేట్ వైద్యశాలకు గుత్తితోపాటు సమీప గ్రామాల నుంచి కొంతమంది పేదలను తీసుకెళ్లి ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేసినట్లు బిల్లులు చేసుకోవడం వివాదాస్పదమైంది. విచారణ చేపట్టిన అధికారులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. -
ఎన్నికల వ్యయ పరిశీలకుడి రాక
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం గురువారం మొదలు కానున్న నేపథ్యంలో ఎన్నికల వ్యయ పరిశీలకుడు నితిన్ అగర్వాల్ జిల్లాకు చేరుకున్నారు. -
నేత్రపర్వం.. సీతారాముల తిరుకల్యాణోత్సవం
[ 18-04-2024]
కసాపురంలోని శ్రీనెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో శ్రీరామనవమిని పురస్కరించుకుని సీతారాముల తిరుకల్యాణోత్సవం నేత్రపర్వంగా సాగింది. -
‘చెత్త’నూ తొలగించలేని ప్రభుత్వం
[ 18-04-2024]
-
మడకశిరలో వైకాపాకు షాక్
[ 18-04-2024]
వైకాపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఈర లక్కప్ప సొంత మండలంలోనే ఆ పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు మూకుమ్మడి రాజీనామాలు చేసి గట్టి షాక్ ఇచ్చారు. -
కల్యాణ వైభోగమే..
[ 18-04-2024]
పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో జానకీరాముడి కల్యాణోత్సవం వేలాది మంది భక్తజనం నడుమ వైభవపేతంగా జరిగింది. -
కోడ్ ఉన్నా ఆర్టీసీలో గుట్టుచప్పుడు కాకుండా నియామకం!
[ 18-04-2024]
ఎన్నికల కోడ్ వచ్చి సరిగ్గా నెలరోజులు అవుతున్నా ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థలో నియామకాలు మాత్రం గుట్టుచప్పుడు కాకుండా చేసేస్తున్నారు. -
అప్పు ఇచ్చా.. తిరిగి చెల్లించండి!
[ 18-04-2024]
మొన్నటివరకు కళ్యాణదుర్గంలో అధికారం వెలగబెట్టిన మహిళా ప్రజాప్రతినిధి ఐదేళ్లపాటు ధనార్జనే ధ్యేయంగా పనిచేశారు. డబ్బుల కోసం సొంతపార్టీ నాయకుల్ని సైతం వేధించారు. -
ధర్మవరంలో కూటమి జోరు
[ 18-04-2024]
ధర్మవరంలో రాజకీయ గాలి వేగంగా మారుతోంది. మొన్నటివరకు కూటమి, వైకాపా మధ్య పోటాపోటీగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయిందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. -
నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కీలక ఘట్టం నామపత్రం స్వీకరణ గురువారం నుంచి ప్రారంభంకానుంది. శ్రీసత్యసాయి జిల్లాలోని ఆరు అసెంబ్లీ, ఒక లోక్సభ స్థానాలకు నామపత్రాల స్వీకరణ, ఎన్నికల నోటిఫికేషన్ నేడు వెలువడనుంది. -
నేడు బండారు శ్రావణిశ్రీ నామినేషన్
[ 18-04-2024]
శింగనమల అసెంబ్లీ నియోజకవర్గానికి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ గురువారం నామపత్రాలు దాఖలు చేస్తున్నట్లు ఆ పార్టీ మండల కన్వీనర్ ఆదినారాయణ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
జాబిల్లిపై చైనా ముందే కాలుమోపితే.. అక్రమణలే: నాసా అధిపతి వ్యాఖ్యలు
-
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు.. తొలిరోజు నామినేషన్ వేసిన కీలక నేతలు
-
భారత క్రికెట్లో నీ భాగస్వామ్యం ఏంటి?: హర్షా భోగ్లేపై మాజీ క్రికెటర్ ఆగ్రహం
-
జగన్పై రాయి దాడి కేసు.. ఆ ఆరుగురి వివరాలు తెలపాలంటూ కోర్టులో పిటిషన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ప్రపంచంలో బెస్ట్ ఎయిర్పోర్టులివే.. భారత విమానాశ్రయాలు ఏ స్థానంలో..?