అప్పు తీసుకుంటే అంతే!
ధర్మవరంలో వడ్డీకాసురుల దందాకు అడ్డుకట్ట పడటం లేదు. చిరువ్యాపారులు, చేనేత కార్మికులు, చిరుద్యోగుల అవసరాన్ని ఆసరా చేసుకుని జలగల్లా పీడిస్తున్నారు.
జలగల్లా పీలుస్తున్న వడ్డీ వ్యాపారులు
ఏడాదిలో పదిమంది బలవన్మరణం
ధర్మవరం, న్యూస్టుడే: ధర్మవరంలో వడ్డీకాసురుల దందాకు అడ్డుకట్ట పడటం లేదు. చిరువ్యాపారులు, చేనేత కార్మికులు, చిరుద్యోగుల అవసరాన్ని ఆసరా చేసుకుని జలగల్లా పీడిస్తున్నారు. సకాలంలో అప్పు చెల్లించకపోతే వడ్డీకి వడ్డీ వేసి రుణగ్రహీతలపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఏడాది కాలంలో ధర్మవరంలో వడ్డీ వ్యాపారుల బెదిరింపులు తాళలేక 10 మందికి పైగా ఆత్మహత్యకు పాల్పడ్డారు. తీసుకున్న రుణానికి ఖాళీ ప్రామిసరీ నోట్లు రాయించుకోవడం యథేచ్ఛగా కొనసాగుతోంది. కట్టడి చేయాల్సిన పోలీసు యంత్రాంగం ఫిర్యాదు లేదనే కారణంతో మిన్నకుండిపోతున్నారు. దీన్ని అవకాశంగా తీసుకుని వడ్డీ వ్యాపారులు పేట్రేగుతున్నారు.
నాలుగు నెలల్లో ఘటనలివీ..
* ధర్మవరం చంద్రబాబునగర్కు చెందిన చేనేత కార్మికుడు లక్ష్మీకాంత్ మగ్గాల నిర్వహణకు వడ్డీ వ్యాపారులతో అప్పు తీసుకున్నాడు. వడ్డీతోపాటు రుణం చెల్లించాలని వ్యాపారులు ఒత్తిడి చేయడంతో ఆత్మహత్య చేసుకున్నాడు.
* ఓ ప్రభుత్వ కార్యాలయంలో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగి అవసరార్థం అప్పు చేశాడు. అధిక వడ్డీ కావడంతో సకాలంలో చెల్లించలేక మరోచోట అప్పు చేశాడు. వడ్డీల భారం పెరగడంతోపాటు, వ్యాపారులు ఒత్తిడి చేయడంతో బలవన్మరణం చెందాడు.
* ఓ విద్యాసంస్థ కరస్పాండెంట్ అవసరార్థం వడ్డీ వ్యాపారుల వద్ద అప్పు చేశాడు. తీసుకున్న రుణానికి అధిక వడ్డీలు కట్టించుకోవడం, రుణం కట్టాలని వ్యాపారులు తీవ్ర ఒత్తిడి చేయడంతో ఉరి వేసుకున్నాడు.
దోపిడీ ఇలా..
వ్యాపారుల వద్ద రూ.లక్ష అప్పు తీసుకుంటే వారానికి వందకు రూ.10 చొప్పున వడ్డీ వసూలు చేస్తున్నారు. రూ.లక్ష అప్పు తీసుకున్నవారు నెలకు వడ్డీ రూపంలోనే రూ.10 వేలు చెల్లించాల్సి ఉంటుంది. నెల తర్వాత అసలు, వడ్డీ పూర్తి చెల్లించాలి. లేదంటే అసలు, వడ్డీ కలిపి మరో ప్రామిసరీ నోటు రాయించుకుంటున్నారు. అప్పు తీసుకున్నవారు సకాలంలో చెల్లించకపోతే ఫోన్లు చేసి బెదిరించడం, వాహనాల్లో గుంపులుగా ఇళ్ల వద్దకు రావడం చేస్తున్నారు. దీంతో రుణగ్రహీతలు భయపడి ఆస్తులు తనఖా పెడుతున్నారు. మరికొందరు బెదిరింపులు తాళలేక బలవన్మరణం చెందుతున్నారు.
ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం
- రమాకాంత్, డీఎస్పీ, ధర్మవరం
బాధితులు ధైర్యంగా పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయాలి. బెదిరింపులకు పాల్పడి, అధిక వడ్డీలు వసూలు చేసేవారిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. పోలీసులను ఆశ్రయిస్తే తగిన న్యాయం చేస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాడు-నేడు జగన్మాయ
[ 19-04-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రగతి పనులను అటకెక్కించారు. నాడు-నేడు పథకం కింద బడులను ఎంపిక చేశారే తప్ప అభివృద్ధి పనులు పూర్తి చేయడానికి తగిన నిధులు కేటాయించడం లేదు. -
నామినేషన్ల పర్వం ఆరంభం
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల సమరం ఆరంభమైంది. కీలక ఘట్టమైన నామినేషన్ల పర్వం మొదలైంది. -
తండ్రి ఆశయాన్నీ నెరవేర్చలేని జగన్: షర్మిల
[ 19-04-2024]
‘‘హంద్రీనీవా పథకాన్ని పూర్తి చేసి అనంత జిల్లా రైతులకు లక్ష ఎకరాలకు సాగు నీరివ్వాలన్నది దివంగత సీఎం వైఎస్సార్ లక్ష్యం. -
నిర్లక్ష్యపు జాడలో.. నీరెరగని కాలువలు
[ 19-04-2024]
కాలువల్లో నీరు పారినపుడే వ్యవసాయం ఆశాజనకంగా ఉంటుంది. అనంతపురం జిల్లాలో వ్యవసాయానికి కాలువలే ఆయువుపట్టు. -
నేడు బాలకృష్ణ నామినేషన్ పత్రాల దాఖలు
[ 19-04-2024]
హిందూపురం అసెంబ్లీ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే బాలకృష్ణ, ఆయన సతీమణి వసుంధరలు శుక్రవారం మధ్యాహ్నం 12.15 గంటలకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు. -
వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం.. ప్రమాదకరం
[ 19-04-2024]
ఈ నెల 16వ తేదీన ముదిగుబ్బ మండలంలోని మలకవేములక్రాస్లో మిద్దెపై ఆడుకుంటున్న ఎనిమిదేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు 11కేవీ విద్యుత్తు తీగలు తగలడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. -
విశ్రాంత ఉద్యోగుల పాలిట జగనాసురుడు
[ 19-04-2024]
సుమారు 35 ఏళ్ల పాటు సేవలు అందించిన విశ్రాంత ఉద్యోగులకు జగన్ సర్కారు పగలే చుక్కలు చూపిస్తోంది. -
జగన్ పాలనలో అన్నీ కోతలే
[ 19-04-2024]
యువతను ఆకర్షించి అధికారంలోకి వచ్చిన వైకాపా చివరకు.. ఆ వర్గానికే షాకిచ్చింది. -
నామినేషన్ల పర్వం ప్రారంభం
[ 19-04-2024]
మొదటి రోజు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా జరిగింది. కేంద్ర ఎన్నికల కమిషన్ సార్వత్రిక ఎన్నికలు నోటిఫికేషన్ విడుదల కావడంతో గురువారం నామపత్రాల ప్రక్రియ ప్రారంభమైంది. -
నేడు కణేకల్లులో చంద్రబాబు సభ
[ 19-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు శుక్రవారం అనంతపురం జిల్లా కణేకల్లుకు రానున్నారు. -
రైతులను విస్మరించిన వైకాపా ప్రభుత్వం
[ 19-04-2024]
రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వం ఐదేళ్లలో రైతులను పూర్తిగా విస్మరించిందని తెదేపా అభ్యర్థి పయ్యావుల కేశవ్ ఆరోపించారు. -
గ్రామాల అభివృద్ధికే రాజకీయాల్లోకి.. : అమిలినేని
[ 19-04-2024]
గ్రామాల అభివృద్ధి కోసమే రాజకీయాల్లోకి వచ్చానని కళ్యాణదుర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు స్పష్టం చేశారు. -
కోడ్ ఉల్లంఘించి ఫ్లెక్సీల ఏర్పాటు
[ 19-04-2024]
ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి అధికార పార్టీ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. -
గొర్రెల యజమానులతో రెవెన్యూ అధికారి డబ్బుల డిమాండ్
[ 19-04-2024]
గొర్రెల యాజమానుల నుంచి ఓ రెవెన్యూ అధికారి డబ్బులు డిమాండ్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
తాడిపత్రిలో భగ్గుమన్న భానుడు
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలోని తాడిపత్రిలో గురువారం అత్యధికంగా 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు సహదేవరెడ్డి, నారాయణస్వామి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలోకి స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో