అద్దె గదుల్లో.. బినామీల పాగా!
నగర, పురపాలికల వాణిజ్య సముదాయాలను కొందరు ఆదాయ వనరుగా మార్చుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా బినామీలకు అప్పగించేశారు.
అనంతపురం నగరపాలిక, న్యూస్టుడే: నగర, పురపాలికల వాణిజ్య సముదాయాలను కొందరు ఆదాయ వనరుగా మార్చుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా బినామీలకు అప్పగించేశారు. వేలం పాటలో తక్కువ అద్దెకు గదులను దక్కించుకుని, ఎక్కువ అద్దెకు ఇచ్చేసి లబ్ధి పొందుతున్నారు. దీనిపై అధికారులు ఏమాత్రం దృష్టి సారించడం లేదు. ఎవరికి అద్దెకు ఇచ్చాం.. అందులో ఎవరు వ్యాపారం చేస్తున్నారో ఆరా తీయడం లేదు. ఖాళీగా ఉన్న దుకాణాలకు సైతం సకాలంలో వేలంపాట నిర్వహించకపోవడంతో ఆదాయానికి గండి పడుతోంది.
పేరొకరిది..వ్యాపారం మరొకరిది
ధర్మవరం: ధర్మవరం పురపాలక సంఘం పరిధిలో 9 వాణిజ్య సముదాయాలు, 97 గదులు ఉన్నాయి. వీటి ద్వారా ప్రతి నెల రూ.7,44,020 అద్దె వస్తోంది. అయితే టెండరు ద్వారా గదులు దక్కించుకున్నవారు మరొకరికి అద్దెకు ఇచ్చారు. వాటిని ఆదాయ వనరుగా మార్చుకున్నారు. 20 ఏళ్లుగా అద్దె గదుల్లో పలువురు వ్యాపారులు మారారు. పెద్ద వ్యాపారులు, ప్రముఖుల చేతుల్లోనే ఎక్కువగా వాణిజ్య సముదాయాలు ఉన్నాయి.
లీజు హక్కును అవకాశంగా తీసుకుని..
ఉమ్మడి జిల్లాలో అనంతపురం, హిందూపురం, గుంతకల్లు, గుత్తి, రాయదుర్గం, తాడిపత్రి, మడకశిర, ధర్మవరం తదితర ప్రాంతాల్లో వాణిజ్య సముదాయాలు ఉన్నాయి. ఒకసారి వేలం పాటలో దుకాణం పొందితే 25 ఏళ్లపాటు లీజుదారునికి హక్కు ఉంటోంది. నిబంధనల ప్రకారం గదిని అద్దెకు తీసుకున్న వ్యక్తి సొంతంగా దుకాణం నిర్వహించాలి. ఈ నిబంధన అమలు కావడం లేదు. సగం దుకాణాలు బినామీల చేతులోనే ఉన్నాయి. ఎక్కువ కాలం లీజు హక్కు ఉండటంతో దీన్ని అవకాశంగా తీసుకుని అక్రమాలకు పాల్పడుతున్నారు.
రెండుగా విభజించి..
కొందరు ఏకంగా గదులను రెండుగా విభజించి ఇద్దరికి అద్దెకు ఇచ్చినా పట్టించుకోవడం లేదు. లీజు పొందిన వ్యక్తులు వాణిజ్య సముదాయాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. పలు పట్టణాల్లో అడ్డంగా గోడ కట్టేసి, రెండుగా విభజించినా అధికారులు పట్టించుకోవడం లేదు. మరోవైపు ప్రతి మూడేళ్లకోసారి 33 శాతం అద్దె పెంచాలి. ఈ ప్రక్రియ కూడా సకాలంలో నిర్వహించడం లేదు.
షెడ్లను ఆక్రమించేశారు..
కూరగాయల మార్కెట్లోని మున్సిపాలిటీ షెడ్లు
గుంతకల్లు: గుంతకల్లులో 25 ఏళ్ల కిందట రూ.15 లక్షలు వెచ్చించి కూరగాయల మార్కెట్ యార్డులో 25 షెడ్లను నిర్మించారు. వాటిని వ్యాపారులకు అద్దెకు ఇవ్వకుండా అధికారులు నిర్లక్ష్యంగా వదిలేశారు. దీన్ని అవకాశంగా తీసుకుని కొందరు ఆక్రమించేశారు. ఇతరులకు అద్దెలకిచ్చి పెద్దఎత్తున లబ్ధి పొందుతున్నారు. ఓ వ్యాపారికి ఏకంగా నాలుగు షెడ్లను స్వాధీనం చేసుకుని ఇతరులకు అద్దెకిచ్చారు. ఒక్కో షెడ్డు నుంచి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల చొప్పున గుడ్విల్తోపాటు ప్రతినెలా రూ.7 వేలకుపైగా అద్దె తీసుకుంటున్నారు. ఈ లెక్కన ఏడాదికి సుమారు రూ.21 లక్షలకుపైగా మున్సిపాలిటీకి గండి కొడుతున్నారు. ఈ తతంగం అధికారులు, నాయకుల కళ్లెదుటే జరుగుతున్నా ఏమాత్రం పట్టించుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై మున్సిపల్ రెవెన్యూ అధికారి నాసిర్ హుసేన్ మాట్లాడుతూ షెడ్ల నుంచి అద్దె వసూలుకు చర్యలు తీసుకుంటామని, మున్సిపాలిటీ ఆదాయాన్ని పెంచడానికి కృషి చేస్తామని తెలిపారు.
ఇతరుల చేతుల్లోనే..
ప్రారంభానికి నోచుకోని షాపింగ్ కాంప్లెక్స్
రాయదుర్గం పట్టణం: రాయదుర్గంలోని పురపాలక సంఘం పరిధిలో 74 గదులు ఉన్నాయి. వీటితోపాటు సీతమ్మ కుంటలో మరో 14 దుకాణాలను నిర్మించి అద్దెకిచ్చారు. గది వైశాల్యం బట్టి నెలకు అద్దె రూ.3 వేల నుంచి రూ.12,500 వరకు నిర్ణయించారు. మొత్తంగా 84 గదులకు కలిపి రూ.4.11 లక్షలు అద్దె రూపంలో చెల్లిస్తున్నారు. వేలంపాటలో దక్కించుకున్న వారు మాత్రం దీనికి రెండింతలు బాడుగ వసూలు చేసుకుంటున్నారు. 50 శాతానికి పైగా గదులు ఇతరుల చేతుల్లో ఉన్నాయి. కూరగాయల మార్కెట్ పరిధిలో బినామీలే నిర్వహిస్తున్నారు. రికార్డులు, అద్దె చెల్లింపు, విద్యుత్తు బిల్లు చెల్లింపు ఇతర లావాదేవీలన్నీ ఒకరి పేరుమీదనే ఉంటున్నాయి. మార్కెట్లో రెండో అంతస్తులో 50 గదులు నిర్మించినా వాటికి వేలం నిర్వహించలేదు.
ఆదాయంపై శ్రద్ధేదీ?
అనంతపురం పాతూరులోని వాణిజ్య సముదాయం
నగరపాలక పరిధిలో 410 గదులు ఉన్నాయి. వీటి ద్వారా ఏడాదికి రూ.3 కోట్లు సమకూరుతోంది. నగరపాలక కార్యాలయం ఎదురుగా వాణిజ్య సముదాయంలో 39 గదులు ఉండగా.. ప్రస్తుతం 25 గదుల నుంచే అద్దె వస్తోంది. పైభాగాన ఉన్న 14 షాపులు శిథిలావస్థకు చేరడంతో వాటిని ఖాళీ చేశారు. అద్దె చెల్లించడం లేదని మూడు దుకాణాలను సీజ్ చేశారు. మరో రెండు షాపుల నుంచి ఏళ్ల తరబడి అద్దె వసూలు చేయడం లేదన్న విమర్శ ఉంది. తాడిపత్రి బస్టాండు వద్ద 44 దుకాణాలు ఉన్నాయి. ఇందులో పైభాగాన 21 గదులు ఏడాదిగా ఖాళీగానే ఉన్నాయి. మార్కెట్ ఎదురుగా ఉన్న గదులు శిథిలావస్థకు చేరాయి. కొత్తూరు మార్కెట్ వద్ద మూడు షాపులు ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ ఓ షాపులో ప్రైవేటు వ్యక్తి అద్దె చెల్లించకుండా పూలవ్యాపారం చేస్తున్నా నగరపాలక ఆలస్యంగా మేల్కొని చర్యలకు ఉపక్రమించారు. జూనియర్ కళాశాల ఎదురుగా 42 దుకాణాల్లో నాలుగు ఖాళీగా ఉన్నాయి. నగరపాలక వాణిజ్య సముదాయాల్లో 50 శాతంపైగా బినామీలు తిష్ఠ వేశారు. శిథిలావస్థకు చేరుకున్న భవనాల స్థానంలో కొత్తవి నిర్మించి, ఎప్పటికప్పుడు అద్దె వసూలు చేస్తే నగరపాలకకు ఏడాదికి మరో రూ.2 కోట్ల దాకా ఆదాయం సమకూరే అవకాశం ఉంది.
చట్టపరమైన చర్యలు తీసుకుంటాం
- రమణారెడ్డి, నగరపాలక ఇన్ఛార్జి కమిషనరు
అద్దె చెల్లించని వారిపై కోర్టుకు వెళ్లి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే కొన్ని దుకాణాలను సీజ్ చేశాం. లీజుకు తీసుకున్నవారే దుకాణం నిర్వహించాలి. లేదంటే చర్యలు తప్పవు. నగరపాలక ఆదాయం పెంపునకు చర్యలు చేపడతాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధూప, దీప నైవేద్యం.. జగనాధీనం
[ 23-04-2024]
దేవాలయాలపై ముఖ్యమంత్రి జగన్ తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారు. తీసుకోవడమేకానీ.. ఇవ్వడం తెలియదన్నట్లుగా.. ఆలయాల నుంచి వచ్చిన కోట్ల రూపాయల ఆదాయాన్ని ఖజానాలో జమ చేసుకున్నారుగాని.. తిరిగి పైసా విదిల్చ లేదు. -
ఎన్నికల మస్కట్గా ‘వేరుసెనగ విత్తనం’
[ 23-04-2024]
ఇక నుంచి జిల్లా ఎన్నికల మస్కట్గా ‘వేరుసెనగ విత్తనం’ ఆకృతిని అధికారికంగా గుర్తించారు. ఈ విషయాన్ని కలెక్టర్ వినోద్కుమార్ ప్రకటించారు. ఉత్తమ ఎన్నికల మస్కట్ పోటీల వివరాలను సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ప్రకటించారు. -
ఊపందుకున్న నామినేషన్లు
[ 23-04-2024]
జిల్లాలో సోమవారం 37 సెట్ల నామపత్రాలు దాఖలయ్యాయి. ఇందులో అనంత లోక్సభకు 7 ఎనిమిది, అసెంబ్లీ స్థానాలకు 30 సెట్ల ప్రకారం నామినేషన్లు వచ్చాయి. -
పదిలో 24వ స్థానం
[ 23-04-2024]
పదో తరగతి పరీక్షా ఫలితాల్లో అనంతపురం జిల్లా వెనుకబడింది. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 24వ స్థానానికి పరిమితమైంది. 80.93 శాతం ఉత్తీర్ణత సాధించినా జిల్లాల వారీగా పరిశీలిస్తే చివరన ఉంది. -
గ్రానైట్ పరిశ్రమలపై గునపం
[ 23-04-2024]
చంద్రబాబు ప్రభుత్వం గ్రానైట్ పరిశ్రమలపై రాయితీ విపరీతంగా పెంచేసింది. రూ.2,300 ఉన్న రాయల్టీని వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత తగ్గిస్తాం. కరెంటు ఛార్జీల భారం లేకుండా చేస్తాం. పెద్దఎత్తున రాయితీ ఇచ్చి కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేసేలా కృషి చేస్తాం. -
ఆస్తి పాస్తులు
[ 23-04-2024]
అభ్యర్థి: కాలవ శ్రీనివాసులు -
తోయండి.. ఇది జగన్మొండి
[ 23-04-2024]
వైకాపా ఐదేళ్ల నిర్లక్ష్య పాలన.. ఉరవకొండ ఆర్టీసీ డిపో అధికారుల వైఖరి కారణంగా తరచూ బస్సులు నడి రోడ్డుపై ఆగిపోతున్నాయి. కళ్యాణదుర్గం నుంచి ఉరవకొండకు వస్తున్న పల్లె వెలుగు బస్సు పట్టణంలోని ప్రధాన రహదారిపై డిపో సమీపంలో గేర్లు పడక ఆగిపోయింది. -
బోధించడం పాపమా.. గురువులపై క్రూరత్వమా?
[ 23-04-2024]
నవ సమాజ నిర్మాతలు గురువులు.. ఎందుకో జగన్కు వీరంటేనే గిట్టదు. తనకు విద్యాబుద్ధులు నేర్పిందీ ఒక గురువే అన్న జ్ఞానాన్ని విస్మరించి.. వారిని శత్రువుల్లా చూస్తూ దండెత్తుతున్నాడు. -
‘అనంత’కు కలిసిరాని నాయకగణం
[ 23-04-2024]
వైకాపా ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి నాయకగణం కలిసి రాలేదు. ఇన్నాళ్లు ఎడ మొహం పెడ మొహంతో ఉన్నా నామినేషన్ సమయానికి అంతా కలిసి వస్తారని చెప్పుకొంటూ వచ్చారు. కానీ అదేం జరగలేదు. -
అరాచక ప్రభుత్వాన్ని సాగనంపండి: కేశవ్
[ 23-04-2024]
రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వం ఐదేళ్లుగా అరాచక పాలన సాగించిందని, వచ్చే ఎన్నికల్లో ఇంటికి సాగనంపాలని ఉరవకొండ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. -
భర్తీలో వెనుకబాటు.. పాలన నగుబాటు
[ 23-04-2024]
విద్యుత్తు శాఖ సెక్షన్ కార్యాలయాల్లో ఏఈలు లేకపోవటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జగన్ ఐదేళ్ల పాలనలో ఎస్పీడీసీఎల్ పరిధిలో అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) పోస్టుల నియామకం చేపట్టకపోవటంతో క్షేత్రస్థాయిలో ఏఈ పోస్టులు ఎక్కువ ఖాళీలు ఏర్పడ్డాయి. -
పదో తరగతి ఫలితాల్లో విద్యార్థుల సత్తా
[ 23-04-2024]
పదో తరగతి పరీక్ష ఫలితాల్లో విద్యార్థులు సత్తా చాటారు. కళ్యాణదుర్గం మండలంలో 69.12శాతం ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 27మంది విద్యార్థులు 500పైగా మార్కులు సాధించారు. -
ధర్మవరంలో వైకాపాకు ఝలక్
[ 23-04-2024]
ధర్మవరం నియోజకవర్గంలో వైకాపాలో బీసీ నాయకులుగా మెలిగిన వారు ఆ పార్టీకే ఝలక్ ఇస్తున్నారు. కొంతకాలంగా ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డితో విభేదాలున్న నాయకులు ఒక్కొక్కొరు పార్టీ నుంచి బయటకు వస్తున్నారు. -
తెదేపాతో అర్హులందరికీ సంక్షేమం: సునీత
[ 23-04-2024]
తెదేపాలో చేరిన వారు భయపడాల్సిన పనిలేదు. పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని మాజీ మంత్రి పరిటాల సునీత భరోసా ఇచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!