కొండల్ని తవ్వేసి.. మట్టి అమ్మేసి!
నార్పల మండలంలో మట్టి మాఫీయా చెలరేగిపోతోంది. కొండలు, గుట్టలు, చెరువులు, వంకలు దేన్నీ వదలడం లేదు. ఎక్కడపడితే అక్కడ యథేచ్ఛగా తవ్వేస్తున్నారు.
మూగేతిమ్మంపల్లి సమీపంలో కొండను తవ్వేశారిలా..
నార్పల గ్రామీణం, న్యూస్టుడే: నార్పల మండలంలో మట్టి మాఫీయా చెలరేగిపోతోంది. కొండలు, గుట్టలు, చెరువులు, వంకలు దేన్నీ వదలడం లేదు. ఎక్కడపడితే అక్కడ యథేచ్ఛగా తవ్వేస్తున్నారు. మట్టిని తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. సహజ సంపద కనుమరుగవుతున్నా అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం శోచనీయం. నార్పల మండలంలోని నార్పల, బొందలవాడ, చామలూరు, గూగూడు తదితర వ్యవసాయ పొలాల్లో భారీగా వెంచర్లు వెలిశాయి. వాటిలో రహదారుల ఏర్పాటుకు, ఇతర పనులకు మట్టి అవసరం అవుతోంది. దీంతో కొందరు అక్రమార్కులు కొండలు, వంకలు, చెరువులను ఎంపిక చేసుకొని పొక్లెయిన్లతో తవ్వేస్తున్నారు. ఇప్పటికే రంగాపురం, మూగేతిమ్మంపల్లి, నరసాపురం, పులసనూతల, నడిమిదొడ్డి, గడ్డంనాగేపల్లి తదితర గ్రామాల సమీపంలోని కొండలను భారీగా తవ్వేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తున్నారు. పచ్చని కొండలు రోజురోజుకు తరిగిపోతున్నా.. అధికారులు చూసుకుంటూ వెళ్తుతున్నారే తప్ప.. ఏ మాత్రం తనిఖీలు చేపట్టడం లేదు. బహిరంగంగా మట్టి దందా సాగుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే హడావుడిగా తనిఖీలు చేసి వాహనాలను పట్టుకోవడం.. నాయకుల నుంచి ఫోన్లు రాగానే విడుదల చేయడం ఇక్కడ పరిపాటిగా మారింది.
* ఈ విషయమై తహసీల్దార్ నారాయణస్వామి వివరణ కోరగా మండలంలో మట్టి తవ్వకాలకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదన్నారు. నిఘా పెట్టి మట్టి తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.
రంగాపురం సమీపంలో భారీగా ఏర్పడిన గోతులు
అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లోనే..
కొండపై లభ్యమయ్యే ఎర్రమట్టి నాణ్యమైనది. దీంతో అక్రమార్కుల కన్ను కొండలపై పడింది. యంత్రాలతో శరవేగంగా కావాల్సినంత మట్టిని తవ్వి ట్రాక్టర్లలో తరలించేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే ఈ దందా సాగిస్తున్నారు. దూరాన్ని బట్టి ఒక ట్రాక్టర్ మట్టిని రూ.800 నుంచి 1000 వరకు విక్రయిస్తున్నారు. మండలంలోని అధికార పార్టీ చోటా నాయకుల కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. విలువైన సహజ వనరులు కనుమరుగవుతుంటే భావితరాలకు ముప్పు వాటిల్లుతుందని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైన మట్టి అక్రమ తవ్వకాలను అరికట్టాలని కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాడు-నేడు జగన్మాయ
[ 19-04-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రగతి పనులను అటకెక్కించారు. నాడు-నేడు పథకం కింద బడులను ఎంపిక చేశారే తప్ప అభివృద్ధి పనులు పూర్తి చేయడానికి తగిన నిధులు కేటాయించడం లేదు. -
నామినేషన్ల పర్వం ఆరంభం
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల సమరం ఆరంభమైంది. కీలక ఘట్టమైన నామినేషన్ల పర్వం మొదలైంది. -
తండ్రి ఆశయాన్నీ నెరవేర్చలేని జగన్: షర్మిల
[ 19-04-2024]
‘‘హంద్రీనీవా పథకాన్ని పూర్తి చేసి అనంత జిల్లా రైతులకు లక్ష ఎకరాలకు సాగు నీరివ్వాలన్నది దివంగత సీఎం వైఎస్సార్ లక్ష్యం. -
నిర్లక్ష్యపు జాడలో.. నీరెరగని కాలువలు
[ 19-04-2024]
కాలువల్లో నీరు పారినపుడే వ్యవసాయం ఆశాజనకంగా ఉంటుంది. అనంతపురం జిల్లాలో వ్యవసాయానికి కాలువలే ఆయువుపట్టు. -
నేడు బాలకృష్ణ నామినేషన్ పత్రాల దాఖలు
[ 19-04-2024]
హిందూపురం అసెంబ్లీ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే బాలకృష్ణ, ఆయన సతీమణి వసుంధరలు శుక్రవారం మధ్యాహ్నం 12.15 గంటలకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు. -
వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం.. ప్రమాదకరం
[ 19-04-2024]
ఈ నెల 16వ తేదీన ముదిగుబ్బ మండలంలోని మలకవేములక్రాస్లో మిద్దెపై ఆడుకుంటున్న ఎనిమిదేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు 11కేవీ విద్యుత్తు తీగలు తగలడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. -
విశ్రాంత ఉద్యోగుల పాలిట జగనాసురుడు
[ 19-04-2024]
సుమారు 35 ఏళ్ల పాటు సేవలు అందించిన విశ్రాంత ఉద్యోగులకు జగన్ సర్కారు పగలే చుక్కలు చూపిస్తోంది. -
జగన్ పాలనలో అన్నీ కోతలే
[ 19-04-2024]
యువతను ఆకర్షించి అధికారంలోకి వచ్చిన వైకాపా చివరకు.. ఆ వర్గానికే షాకిచ్చింది. -
నామినేషన్ల పర్వం ప్రారంభం
[ 19-04-2024]
మొదటి రోజు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా జరిగింది. కేంద్ర ఎన్నికల కమిషన్ సార్వత్రిక ఎన్నికలు నోటిఫికేషన్ విడుదల కావడంతో గురువారం నామపత్రాల ప్రక్రియ ప్రారంభమైంది. -
నేడు కణేకల్లులో చంద్రబాబు సభ
[ 19-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు శుక్రవారం అనంతపురం జిల్లా కణేకల్లుకు రానున్నారు. -
రైతులను విస్మరించిన వైకాపా ప్రభుత్వం
[ 19-04-2024]
రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వం ఐదేళ్లలో రైతులను పూర్తిగా విస్మరించిందని తెదేపా అభ్యర్థి పయ్యావుల కేశవ్ ఆరోపించారు. -
గ్రామాల అభివృద్ధికే రాజకీయాల్లోకి.. : అమిలినేని
[ 19-04-2024]
గ్రామాల అభివృద్ధి కోసమే రాజకీయాల్లోకి వచ్చానని కళ్యాణదుర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు స్పష్టం చేశారు. -
కోడ్ ఉల్లంఘించి ఫ్లెక్సీల ఏర్పాటు
[ 19-04-2024]
ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి అధికార పార్టీ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. -
గొర్రెల యజమానులతో రెవెన్యూ అధికారి డబ్బుల డిమాండ్
[ 19-04-2024]
గొర్రెల యాజమానుల నుంచి ఓ రెవెన్యూ అధికారి డబ్బులు డిమాండ్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
తాడిపత్రిలో భగ్గుమన్న భానుడు
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలోని తాడిపత్రిలో గురువారం అత్యధికంగా 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు సహదేవరెడ్డి, నారాయణస్వామి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
20 మంది ఎమ్మెల్యేలు సహా.. 4 లక్షల ఓటర్లలో ఒక్కరూ ఓటెయ్యలేదు!
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు