logo

రాష్ట్రస్థాయి యోగా పోటీలకు వెంకటేష్‌

రాష్ట్రస్థాయి యోగా పోటీలకు కదిరి ఎస్టీఎస్‌ఎన్‌ ప్రభుత్వ డిగ్రీకళాశాల విద్యార్థి వెంకటేష్‌ ఎంపికైనట్లు ఫిజికల్‌ డైరెక్టర్‌ నరసింహాచారి తెలిపారు.

Published : 07 Oct 2022 04:42 IST

కదిరి, న్యూస్‌టుడే: రాష్ట్రస్థాయి యోగా పోటీలకు కదిరి ఎస్టీఎస్‌ఎన్‌ ప్రభుత్వ డిగ్రీకళాశాల విద్యార్థి వెంకటేష్‌ ఎంపికైనట్లు ఫిజికల్‌ డైరెక్టర్‌ నరసింహాచారి తెలిపారు. అనంతపురం వివేకానందా కేంద్రంలో గురువారం జరిగిన యోగా పోటీల్లో తమ విద్యార్థి ఉత్తమ ప్రతిభ చాటాడన్నారు. దీంతో ఈనెల 7నుంచి 9 వరకు విజయవాడలో జరిగే  రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. వెంకటేష్‌ను ప్రిన్సిపల్‌ స్మిత, పీడీ, అధ్యాపకులు అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు