logo

తాగునీటి కోసం భిక్షాటన

తనకల్లు పంచాయతీ దుగినేపల్లి గ్రామంలో 20 రోజులుగా నెలకొన్న తాగునీటి సమస్య కోసం గ్రామస్థులు బుధవారం రాత్రి భిక్షాటన చేశారు.

Published : 07 Oct 2022 04:42 IST

భిక్షాటన చేస్తున్న గ్రామస్థులు

తనకల్లు, న్యూస్‌టుడే: తనకల్లు పంచాయతీ దుగినేపల్లి గ్రామంలో 20 రోజులుగా నెలకొన్న తాగునీటి సమస్య కోసం గ్రామస్థులు బుధవారం రాత్రి భిక్షాటన చేశారు. దుగినేపల్లి, గనాథవారిపల్లి గ్రామాలకు ఒకే బోరు ఉండటంతో 90 ఇళ్లకు దీని ద్వారా నీరు సరఫరా అవుతోంది. 20 రోజుల కిందట తాగునీరు సరఫరా అయ్యే పైప్‌లైన్‌ పాడవడంతో దుగినేపల్లిలో నీరు రావడం లేదు. పలుమార్లు సర్పంచికి తెలిపినా ఫలితం లేని కారణంగా మరమ్మతుల డబ్బుల కోసం భిక్షాటన చేశారు. కార్యక్రమంలో శ్రీధర్‌రెడ్డి, జియావుల్లా తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని